
మార్చి 20 వరకే బాలాలయం కొనసాగింపు
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదాద్రిలోని బాలాలయం వచ్చే మార్చి 20 వరకే కొనసాగుతుందని యాడా వైస్ఛైర్మన్ కిషన్రావు స్పష్టం చేశారు. కొండ కింద గండిచెరువు ప్రాంగణంలో ఆ నెల 21 నుంచి మొదలై మహాయాగం ముగిసే వరకు నిత్యారాధనలు, దర్శనాలు నిర్వహిస్తామన్నారు. మహాకుంభ సంప్రోక్షణానంతరం పునర్నిర్మిత ప్రధానాలయంలోని స్వయంభువుల దర్శనాలు మార్చి 28 నుంచి పునఃప్రారంభమవుతాయన్నారు.
* మహాయాగం నిర్వహించనున్న ప్రాంగణంలో మరో బాలాలయాన్ని ఏర్పాటుచేసి ఉత్సవమూర్తులతో దైవదర్శనాల సదుపాయం కల్పిస్తారా లేక యాడా వైస్ఛైర్మన్ చెప్పిన ప్రకారం ప్రస్తుతం బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులను కొండ కిందికి తరలించి దర్శనాలు చేయిస్తారా అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. ఈ విషయమై ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్యను సంప్రదించగా లక్ష్మీనారసింహుల కవచమూర్తులను కొండ కిందకు తరలించే యోచన సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
* మహాక్రతువులో భాగంగా కొండ కింద చేపట్టనున్న మహాయాగానికి భారీగా భక్తులు రానున్న దృష్ట్యా దైవదర్శనాలను కొండ కిందే జరపాలని యాడాతో పాటు దేవాదాయశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.