ఇతర ఖనిజ తవ్వకాలూ చేపడతాం: సింగరేణి

బొగ్గుతో పాటు ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాలూ చేపట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద ఆయన బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సంస్థ చరిత్రలో తొలిసారి ఇతర రాష్ట్రాల్లో బొగ్గు

Published : 27 Jan 2022 05:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గుతో పాటు ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాలూ చేపట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద ఆయన బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సంస్థ చరిత్రలో తొలిసారి ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలు చేపట్టామని, వచ్చే ఏప్రిల్‌ నుంచి ఒడిశాలోని నైనీ గనిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. అదే రాష్ట్రంలో న్యూపాత్రపాద గని కూడా త్వరలో ప్రారంభమవుతుందన్నారు. కేంద్రం నిర్వహిస్తున్న వేలంపాటల్లో పాల్గొని ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనులనూ చేజిక్కించుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని