సుప్రసిద్ధ కథా రచయిత ‘శ్రీవిరించి’ కన్నుమూత
ప్రముఖ కథా రచయిత, తత్వవేత్త ‘శ్రీవిరించి’గా సుప్రసిద్ధులైన డాక్టర్ ఎస్.సి.రామానుజాచారి (87) బుధవారం చెన్నైలో కన్నుమూసినట్లు ఆయన సోదరుడు, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్య (చక్రవర్తి) తెలిపారు.
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రముఖ కథా రచయిత, తత్వవేత్త ‘శ్రీవిరించి’గా సుప్రసిద్ధులైన డాక్టర్ ఎస్.సి.రామానుజాచారి (87) బుధవారం చెన్నైలో కన్నుమూసినట్లు ఆయన సోదరుడు, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్య (చక్రవర్తి) తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన తెలుగు పండితులు, ప్రముఖ కవి ఎన్.సి.ఎస్.వెంకటేశ్వరాచార్యులు, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 1935లో జన్మించిన రామానుజాచారి ‘శ్రీవిరించి’ కలం పేరుతో అక్షర సేద్యం చేశారు. పదేళ్ల కిందటే ఆయన సతీమణి కన్నుమూయగా, చెన్నైలోని కుమార్తె వద్ద ఉంటున్నారు. రాజనీతిశాస్త్రంలో ఎంఏ చేసిన ఆయన పారిశ్రామిక, వాణిజ్య చట్టాల్లో న్యాయవిద్యనభ్యసించారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు. . 1951 నుంచి తెలుగు స్వతంత్ర, భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, వివిధ పత్రికల్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో కథలు, వ్యాసాలు రాశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహా డా.దాశరథి రంగాచార్య, కమలా సాహిత్య పురస్కారాలు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే