మిస్డ్‌ కాల్‌ ద్వారా టెలిమెడిసిన్‌ సేవలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

కొవిడ్‌ బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాధితులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే కరోనాకు వైద్యసాయం పొందే ఏర్పాట్లు చేసింది. దీని కోసం ట్రస్ట్‌ ప్రత్యేకంగా ఒక ఫోన్‌ నంబర్‌ను కేటాయించింది

Published : 29 Jan 2022 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాధితులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే కరోనాకు వైద్యసాయం పొందే ఏర్పాట్లు చేసింది. దీని కోసం ట్రస్ట్‌ ప్రత్యేకంగా ఒక ఫోన్‌ నంబర్‌ను కేటాయించింది. టెలిమెడిసిన్‌ సాయం అవసరమైన వారు శనివారం నుంచి 8801033323 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వవచ్చు. ఇలా సంప్రదించిన వారి మొబైల్‌ ఫోన్‌కు జూమ్‌ కాల్‌ లింక్‌ వెళుతుంది. దాని ద్వారా బాధితులు వైద్య సేవలు పొందవచ్చు. అవసరమైన వారికి ట్రస్ట్‌ ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం 7.30 గంటలకు బాధితులకు జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని