నేడు యాదాద్రి కలెక్టరేట్‌ భవనం ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు. దీంతోపాటు తెరాస జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించి కలెక్టరేట్‌ పక్కన జరిగే బహిరంగ

Published : 12 Feb 2022 04:17 IST

భువనగిరి, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు. దీంతోపాటు తెరాస జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించి కలెక్టరేట్‌ పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. భువనగిరి శివారు రాయగిరిలో హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి పక్కన 12 ఎకరాల విస్తీర్ణంలో రూ. 53.20 కోట్ల వ్యయంతో జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించారు. కలెక్టరేట్‌తో పాటు 30 జిల్లా శాఖల కార్యాలయాలు, మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్‌ ఏర్పాటు చేశారు. 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ+2 అంతస్తులో ఈ భవనాన్ని నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని