Hardik Pandya : గుజరాత్ సక్సెస్ వెనుక స్టోరీ అదే: హార్దిక్
తొలి క్వాలిఫయిర్ మ్యాచ్లో రాజస్థాన్పై అద్భుత విజయంతో గుజరాత్ ఫైనల్కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి (మే 24న) జరిగిన మ్యాచ్లో...
ఇంటర్నెట్ డెస్క్: తొలి క్వాలిఫయిర్ మ్యాచ్లో రాజస్థాన్పై అద్భుత విజయంతో గుజరాత్ ఫైనల్కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి (మే 24న) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 188/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ‘‘మైదానం లోపల, వెలుపల సమతూకంగా ఉండేలా చూసుకుంటున్నాను. కెప్టెన్గా ఎంతో నేర్చుకుంటున్నా. గత కొన్నేళ్లుగా నా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా’’ అని పేర్కొన్నాడు.
తొలిసారి కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్య గుజరాత్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలోనూ మెరుగుపడ్డాడు. ఇప్పటి వరకు 15 మ్యాచుల్లో 453 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ఈ సీజన్లో ఇలా రాణించడంలో నా కుటుంబ సభ్యులదే కీలక పాత్ర. అందులో నా భార్య, కొడుకు, నా సోదరుడు సహా అందరూ మద్దతుగా నిలిచారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండగలుగుతున్నా. ఇకపోతే సీజన్ ముగిశాక ఇంటికెళ్లి నా కుటుంబంతో సమయం గడపాలి. అదే నన్ను ఉత్తమ క్రికెటర్గా మారుస్తుంది’’ అని వివరించాడు.
డేవిడ్ మిల్లర్ అలాంటి సమర్థుడే: హార్దిక్
ద
గుజరాత్ ఫైనల్కు చేరుకోవడం ఎలా అనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఇప్పుడైతే ఎలాంటి భావోద్వేగం లేదు. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. అద్భుత విజయం సాధించడం వెనుక జట్టు సభ్యుల కృషి ఎంతో ఉంది. డ్రెస్సింగ్ రూమ్ ఎంతో బాగుంది. మా టీమ్లోని 23 మంది ఆటగాళ్లు వేర్వేరు క్యారెక్టర్లు కలిగినవారు. అందుకే వేర్వేరు ఆలోచనలను పంచుకోగలిగాం. మంచివాళ్లు పక్కన ఉంటే మంచి ఆలోచనలే వస్తాయి. ఇదే ఇప్పటి వరకు మా సక్సెస్ వెనుక ఉన్న స్టోరీ. జట్టు గెలవాలని డగౌట్లోనూ మా ఆటగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రషీద్ ఖాన్ సీజన్ మొత్తం బాగా బౌలింగ్ చేస్తున్నాడు. డేవిడ్ మిల్లర్ ఒంటిచేత్తో మ్యాచ్లను గెలిపించగల సమర్థుడు. మిల్లర్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఇకపోతే నేను జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు వస్తా. ఈ ప్లేస్లోనే బ్యాటింగ్కు వెళ్తాననే డిమాండ్ ఎప్పుడూ ఉండదు’’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. ఇవాళ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో తొలి క్వాలిఫయిర్లో ఓటమిపాలైన రాజస్థాన్ మే 27న రెండో క్వాలిఫయర్ పోరులో తలపడుతుంది. అనంతరం అక్కడ గెలిచిన జట్టు ఫైనల్లో గుజరాత్ను ఢీకొడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!