T20 League: అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. ఈసారి అంచనాలకు మించి అద్భుతాలు..!
ఈ సీజన్లో పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సీనియర్లకు సైతం సిగపాట్లు పట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు..
నాణేనికి బొమ్మాబొరుసూ రెండు వైపులుంటాయ్. భారత్లో ఏటా జరిగే మెగా టీ20 టోర్నీకీ అంతే! ప్రపంచ సంపన్న లీగ్గా ఈ టోర్నీపై ఎన్ని విమర్శలున్నా.. కొత్త టాలెంట్ను వెలికితీయడంలో దీన్ని మించిన ఈవెంట్ మరొకటి లేదు. అందువల్లే జాతీయ జట్టులోకి ప్రవేశించడానికి ఈ టోర్నీనే ట్రాక్గా ఎంచుకుంటున్నారు మేటి కుర్రాళ్లు. ప్రపంచ ఆటగాళ్లకు సైతం సిగపాట్లు పట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మేరకు 2022 సీజన్లో పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
హైదరాబాద్ కుర్రాడు.. తిలక్
ముంబయి జట్టులో ఈసారి 19 ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఆటే హైలైట్. జట్టు ఓటములు పక్కనపెడితే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో రెండు అర్ధశతకాలు సహా తిలక్ 334 పరుగులు చేశాడు. జట్టులో సీనియర్ బ్యాటర్లు సైతం చేతులెత్తేస్తున్న వేళ.. అతనొక్కడే అదిరే బ్యాటింగ్తో మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. ఇకపైనా ఇలాగే ఆడితే భవిష్యత్తు టీమ్ఇండియాకు తిలక్ వర్మ ప్రాతినిధ్యం వహిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సీజన్లో తిలక్ అత్యధిక స్కోర్ 61, స్ట్రైక్రేట్ 136.66.
అభిషేక్.. అంచనాలకు మించి
హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈసారి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. పంజాబ్కు చెందిన ఈ 21 ఏళ్ల ఎడమచేతి వాటం ఆల్రౌండర్ తన 11 ఇన్నింగ్స్ల్లో మొత్తం 331 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైపై గెలుపులో అభిషేక్ శర్మ (75) అమోఘమైన ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు. అత్యధిక స్కోర్ 75, స్ట్రైక్ రేట్ 132.40.
అరంగ్రేటంలోనే అద్భుతం
గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుతంగా ఆడాడు. ఎటువంటి భయం కనిపించకుండా చక్కటి షాట్లు ఆడుతూ ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఆపై పంజాబ్తో జరిగిన మరో మ్యాచ్లో 65 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల సుదర్శన్ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో మొత్తం 145 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 65 నాటౌట్. స్ట్రైక్రేట్ 127.19.
ఫినిషర్ బదోని
గుజరాత్తో జరిగిన అరంగేట్ర మ్యాచ్లోనే అర్థశతకం సాధించాడు లఖ్నవూ ఆటగాడు ఆయుష్ బదోని (54). ఆపై చెన్నై, దిల్లీతో మ్యాచ్ల్లో ఫినిషర్గా బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. ఇప్పటివరకు ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ సహా బదోని 161 పరుగులు చేశాడు. మూడుసార్లు నాటౌట్గా నిలిచాడు. అత్యధిక స్కోర్ 54, స్ట్రైక్రేట్ 129.66.
అలాగే మరో కొత్త జట్టు గుజరాత్లో అభినవ్ (7 మ్యాచ్ల్లో 108) అవకాశం వచ్చినప్పుడల్లా తన మెరుపు బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. మరోవైపు బెంగళూరు బ్యాటర్లలో రజత్ పటిదార్ (4 ఇన్నింగ్స్ల్లో 137), అనుజ్ రావత్ (8 ఇన్నింగ్స్ల్లో 129) నిలకడగా రాణిస్తున్నారు.
బుల్లెట్ బంతుల ఉమ్రాన్
ఈ సీజన్లో ప్రధాన చర్చంతా హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గురించే. బులెట్ బంతులతో ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఉమ్రాన్. గుజరాత్తో మ్యాచ్లో 25 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇందులో నాలుగు బౌల్డ్లు కాగా.. ఒకటి క్యాచ్ ఔట్. అంతేకాకుండా 150 కి.మీ వేగంతో స్థిరంగా బంతులను సంధిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో ఉమ్రాన్ 15 వికెట్లు పడగొట్టాడు.
ముకేశ్ చౌదరీ
రాజస్థాన్కు చెందిన 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముకేశ్ చౌదరీ ఈ సీజన్లో గొప్పగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 10 మ్యాచ్లు ఆడి ముకేశ్ 13 వికెట్లు పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్తో మ్యాచ్లో 9 పరుగులకే మూడు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
యూపీకి చెందిన యువ పేసర్ మోసిన్ ఖాన్.. ఈసారి లఖ్నవూ తరఫున ఆడుతున్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్లో మోసిన్ కేవలం 16 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
-
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
-
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు