MS Dhoni: జడేజా ఆటపై కెప్టెన్సీ భారం.. అందుకే: ధోనీ
కెప్టెన్సీ భారం.. రవీంద్ర జడేజా ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపించిందని, అందుకే నాయకత్వ మార్పు చేయాల్సి వచ్చిందని చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టీ20 మెగా టోర్నీలో మళ్లీ చెన్నై బాధ్యతలు అందుకున్న ధోనీ
ఇంటర్నెట్డెస్క్: కెప్టెన్సీ భారం.. రవీంద్ర జడేజా ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపించిందని, అందుకే నాయకత్వ మార్పు చేయాల్సి వచ్చిందని చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టీ20 మెగా టోర్నీలో మళ్లీ చెన్నై బాధ్యతలు అందుకున్న ధోనీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విజయాన్ని అందుకున్నాడు. గత రాత్రి పుణె వేదికగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 13 పరుగుల తేడాతో ఈ సీజన్లో మూడో గెలుపు సాధించింది.
మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్ అయిన తర్వాత చాలా విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత ఆట తీరు పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఆలోచనతో కూడుకున్న వ్యవహారం. మన మెదడును నియంత్రణలో ఉంచడం అంత సులువైన పని కాదు. శరీరం విశ్రాంతి తీసుకున్నా సరే.. మెదడు పనిచేస్తూనే ఉంటుంది. జడేజా విషయంలోనూ అదే జరిగిందని అనుకుంటున్నా. కెప్టెన్సీ భారం అతడి ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది. బౌలర్, బ్యాటర్, ఫీల్డర్గా జడేజా గొప్ప ప్రదర్శన చేస్తాడు. కానీ ప్రస్తుతం మేం గొప్ప ఫీల్డర్ను కోల్పోయాం. మిడ్ వికెట్ ఫీల్డింగ్లో సమస్యలు ఎదుర్కొంటున్నాం. 17-18 క్యాచ్లను కూడా వదిలేశాం. ఇది చాలా అందోళన కలిగించింది. అందుకే మార్పు చేయాల్సి వచ్చింది. కెప్టెన్సీ అనేది నిష్పక్షపాతమైన అంశం. నువ్వు(జడేజా) ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. నువ్వు అత్యుత్తమ ఆటగాడివి. ఇదే జట్టుకు కావాల్సింది కూడా’’ అని చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది టీ20 మెగా టోర్నీ ప్రారంభమవడానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై కెప్టెన్గా రవీంద్ర జడేజా బాధ్యతలు అందుకున్నాడు. అయితే సారథిగా ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండింటిలోనూ విజయాన్ని సాధించగలిగాడు. అటు ఆల్రౌండర్ పాత్రను పోషించడంలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సారథ్య బాధ్యతలను మళ్లీ ధోనీకి అప్పగిస్తున్నట్లు చెన్నై ఇటీవల ప్రకటించింది.
టీ20 లీగ్లో చెన్నైకి నాలుగు సార్లు టైటిల్ను అందించిన ధోనీ.. ఈ సీజన్లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్, కాన్వే అదిరే ఆరంభాన్నిచ్చారు. 182 పరుగులతో ఈ సీజన్లోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
20 ఓవర్లలో కేవలం 2 వికెట్లే నష్టపోయిన చెన్నై 202 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్ ఆరంభంలో దూకుడుగా అనిపించినా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్