Chennai: చెన్నై ఇప్పటికీ మూడు లేదా నాలుగులో నిలవొచ్చు.. ఎలాగంటే?
భారత టీ20 లీగ్ అత్యంత కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్లో ఆదివారం నాటికి 55 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే మిగిలాయి...
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్లో ఆదివారం నాటికి 55 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే మిగిలాయి. దీంతో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ చాలా కీలకమైనది. ఇప్పుడు టాప్-4లో నిలిచిన లఖ్నవూ, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరు తేలిగ్గా ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తున్నా మిగతా జట్లూ టాప్లోకి దూసుకొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో చెన్నై కూడా రాణిస్తే మూడు లేదా నాలుగులో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ముంబయి: ముంబయి ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలే సాధించింది. దీంతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. ఇకపై బాగా ఆడి, మిగిలిన మ్యాచ్లన్నింటిలో గెలిచినా గరిష్ఠంగా ఐదో స్థానంలోనే నిలుస్తుంది.
కోల్కతా: కోల్కతా ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై అద్భుతంగా పుంజుకొని రాణించినా లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి గరిష్ఠంగా నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అది కూడా ఇతర జట్లతో పోటీపడాల్సిన స్థితిలోనే. ఇది జరగాలంటే అద్భుతమే అని చెప్పాలి.
చెన్నై: ప్రస్తుతం కోల్కతా మాదిరే చెన్నై 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆదివారం దిల్లీని ఓడించడంతో కాస్త ఉపశమనం లభించింది. దీంతో ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ ఇలాగే గొప్ప విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సమానంగా 14 పాయింట్లు పంచుకునే వీలుంది. అప్పుడు వాటి కన్నా రన్రేట్ మెరుగ్గా ఉంటే మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అలా జరగడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి.
పంజాబ్: పంజాబ్ ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్లు గెలవాలి. అప్పుడు రెండు, మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అది కూడా ఇతర జట్లతో రన్రేట్ పరంగా మెరుగ్గా ఉంటేనే. అది జరగాలంటే ఇకపై విశేషంగా రాణించాలి.
హైదరాబాద్: హైదరాబాద్ ఇప్పుడు 11 మ్యాచ్ల్లో 5 విజయాలతోనే ఆరో స్థానంలో నిలిచింది. ఇకపై మిగిలిన మూడు మ్యాచ్లు గెలిస్తే టాప్-4లో ఎక్కడైనా నిలవొచ్చు. కానీ ఆదివారం బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో అవకాశాలు క్లిష్టంగా మారాయి.
దిల్లీ: దిల్లీ కూడా హైదరాబాద్లాగే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 5 విజయాలతోనే ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా టాప్-4లో ఎక్కడైనా నిలవొచ్చు. అయితే, ఇతర జట్లతో పాయింట్లు సమానంగా ఉంటే రన్రేట్ అత్యంత కీలకం అవుతుంది.
బెంగళూరు: బెంగళూరు ప్రస్తుతం ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తే టాప్-1లో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు టాప్లో ఉన్న జట్లు మిగతా మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.
రాజస్థాన్: రాజస్థాన్ ఇప్పుడు బెంగళూరు మాదిరే 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో టాప్-3లో ఉంది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్లు గెలిస్తే టాప్-1లో ప్లేఆఫ్స్ చేరుతుంది. అందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కాకపోతే కాస్త ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.
గుజరాత్: గుజరాత్ వరుస విజయాలతో మొన్నటివరకూ టాప్-1లో నిలిచినా రెండు వరుస అపజయాలతో ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించింది. ఒకవేళ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైనా నాలుగోస్థానంలో నిలిచే అవకాశం ఉంది.
లఖ్నవూ: లఖ్నవూ ఇప్పుడు వరుస విజయాలతో టాప్లో దూసుకుపోతోంది. గుజరాత్లాగే ఈ జట్టు కూడా 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో కొనసాగుతోంది. ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా.. అవి ఓడిపోయినా ప్లేఆఫ్స్ చేరే వీలుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించడం అందుకు కారణం.
నోట్: ఇక్కడ చెప్పిన విషయాలన్నీ జరగాలంటే ప్రతి జట్టూ ఇకపై తాము ఆడాల్సిన అన్ని మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. అది కూడా నెట్రన్ పరంగా ఇతర జట్లతో నెగ్గుకొస్తేనే.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!