David Warner: అతడిలా నేనెందుకు ఆడట్లేదని నా పిల్లలకు తెలుసుకోవాలని ఉంది: వార్నర్
రాజస్థాన్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్లా తానెందుకు శతకాలు చేయలేకపోతున్నాననే విషయం తన పిల్లలకు తెలుసుకోవాలని ఉందని దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు...
(Photo: David Warner Instagram)
ముంబయి: రాజస్థాన్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్లా తానెందుకు శతకాలు చేయలేకపోతున్నాననే విషయం తన పిల్లలకు తెలుసుకోవాలని ఉందని దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. వాళ్లు ఇప్పుడు క్రికెట్ గేమ్ను అర్థం చేసుకొంటుండటం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ ఒక వికెట్ కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఛేదించింది. వార్నర్ (60 నాటౌట్; 30 బంతుల్లో 10x4, 1x6) మరోసారి అర్థ శతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా స్పందించాడు.
‘మా బౌలర్లు అద్భుతంగా రాణించి మా పని మరింత తేలిక చేశారు. క్రెడిట్ అంతా వాళ్లకే దక్కుతుంది. లక్ష్య ఛేదనలో పవర్ప్లేలో వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మా జట్టులో కొవిడ్ కేసులు వచ్చాక మేం తిరిగి బరిలోకి దిగి విజయం సాధించడం గొప్పగా ఉంది. ఇదంతా సానుకూల ఆలోచనతోనే సాధ్యమవుతుంది. ఇక పృథ్వీతో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంది. నా బ్యాటింగ్ విషయానికొస్తే.. ప్రాథమిక అంశాలపై దృష్టిసారించి అందుకు అనుగుణమైన ఫుట్వర్క్తో ఆడాలనుకున్నా. ఇకపైనా ఇలాగే రాణిస్తాననే నమ్మకం ఉంది. అయితే, జోస్ బట్లర్లా నేనెందుకు శతకాలు చేయలేకపోతున్నానని నా పిల్లలకు తెలుసుకోవాలని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలందరూ క్రికెట్ను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. అందుకు నాకు ఆనందంగా ఉంది’ అని వార్నర్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తన పిల్లలు కూడా క్రికెట్ను అర్థం చేసుకుంటున్నారని చెప్పాడు. అలాగే ఇంతకుముందు బెంగళూరుతో ఆడిన మ్యాచ్లో వార్నర్ (66) పరుగులు చేసి ఔటయ్యాక ఆ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ రోజు వార్నర్.. హసరంగ బౌలింగ్లో పెవిలియన్కు చేరినప్పుడు గ్యాలరీలో అతడి కుమార్తెలు కంటతడి పెట్టిన చిత్రాలు వైరల్గా మారాయి. దీంతో తాను ఎక్కువ పరుగులు చేయాలని తన కుమార్తెలు ఆశపడుతున్నట్లు వార్నర్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఈ హైదరాబాద్ మాజీ కెప్టెన్.. తొలి మ్యాచ్లో విఫలమయ్యాక వరుసగా మూడు అర్థ శతకాలతో దూసుకుపోతున్నాడు. దీంతో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 63.67 సగటుతో 191 పరుగులు చేశాడు. అతడిలాగే రెచ్చిపోతే ఈ సీజన్లోనూ టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తాడు. మరోవైపు రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ ఆరు మ్యాచ్ల్లో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలతో మొత్తం 375 పరుగులు సాధించాడు. అతడి సగటు 75గా నమోదైంది. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?