Delhi vs Mumbai: పోరు దిల్లీ, ముంబయిది.. ఉత్కంఠ బెంగళూరుది..!
భారత టీ20 టోర్నీలో లీగ్ దశ చివరి మజిలీకి చేరింది. అందరూ ఊహించినట్లే ఇన్ని రోజులూ టాప్లో కొనసాగిన గుజరాత్, రాజస్థాన్, లఖ్నవూ జట్లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి...
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: భారత టీ20 టోర్నీలో లీగ్ దశ చివరి మజిలీకి చేరింది. అందరూ ఊహించినట్లే ఇన్ని రోజులూ టాప్లో కొనసాగిన గుజరాత్, రాజస్థాన్, లఖ్నవూ జట్లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసమే దిల్లీ, బెంగళూరు జట్లు పోటీపడుతున్నాయి. ఆ ఉత్కంఠకు కూడా ఈరోజు రాత్రి దిల్లీ, ముంబయి జట్ల మధ్య జరిగే పోరుతో తెరపడనుంది.
లీగ్ దశలో భాగంగా మొత్తం 70 మ్యాచ్లు ఆడుతుండగా.. ఇప్పటికే 68 ఆటలు పూర్తయ్యాయి. ఇంకా రెండు మ్యాచ్లే మిగిలాయి. అయితే, ఈరోజు దిల్లీ విజయం సాధిస్తే నాలుగో బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఓడితే బెంగళూరు ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రం కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈరోజు జరిగే మ్యాచ్పైనే పడింది. ఈ టోర్నీలో అన్ని జట్ల కన్నా ముందే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి పదో స్థానంలోనే నిలిచింది. అలాంటి జట్టు ఇప్పుడు ఐదో స్థానంలో ప్లేఆఫ్స్ కోసం పోటీపడుతున్న దిల్లీని ఏమాత్రం కట్టడి చేస్తుందో చూడాలి. అయితే, ఈ పోరులో ముంబయి విజయం సాధించాలని, అటు బెంగళూరు, ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
రెండు సమానంగా..
ఈ సీజన్లో ముంబయి ఎంత దారుణంగా ఆడినా గత ఐదు మ్యాచ్ల్లో దిల్లీ మాదిరే మూడు విజయాలు, రెండు ఓటములతో నిలిచింది. అంటే ఈ లెక్కన ప్రస్తుతం రెండు జట్లూ ఇంచుమించు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. కానీ, దిల్లీ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్ కోసం పోటీపడుతుండటంతో ఈ మ్యాచ్ను అంత తేలిగ్గా తీసుకోదనేది కాదనలేని సత్యం. మరోవైపు ముంబయి ఈ సీజన్లో కేవలం మూడు విజయాలే సాధించడంతో చివరి మ్యాచ్లోనైనా గెలుపొంది కనీసం తొమ్మిదో స్థానంలో నిలిచిన చెన్నై మాదిరే కాస్త గౌరవప్రదంగా తిరుగుముఖం పట్టాలని చూస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
దిల్లీని వార్నరే ఆదుకోవాలి..
ఈ సీజన్ ఆరంభం నుంచి గెలుపోటములతో దాగుడుమూతలు ఆడుతూ ఇక్కడిదాకా చేరుకున్న దిల్లీ గత రెండు మ్యాచ్ల్లోనే వరుసగా విజయాలు సాధించడం గమనార్హం. అయితే, రోహిత్ టీమ్ బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేస్తే.. దిల్లీని కట్టడి చేయడం పెద్ద కష్టమేం కాదు. ప్రస్తుతం ఆ జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (427) ఒక్కడే రాణిస్తున్నాడు. అతడు ఆడిన 11 మ్యాచ్ల్లో 5 అర్ధ శతకాలతో.. 53.38 మంచి సగటుతో కొనసాగుతున్నాడు. కెప్టెన్ రిషభ్పంత్ 13 మ్యాచ్ల్లో (301) పరుగులతో ఏమంత ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు ఇప్పటివరకు ఒక్క అర్ధశతకం కూడా సాధించలేదు. మరో ఓపెనర్ పృథ్వీ షా (259) కాస్త ఫరవాలేదనిపించినా అనారోగ్యంతో ఇప్పుడు తుదిజట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక విదేశీ ఆటగాళ్లు మిచెల్ మార్ష్ (251), రోమన్ పావెల్ (207) కూడా పెద్ద ప్రమాదకరంగా కనిపించడం లేదు. దీంతో టాప్ ఆర్డర్లో వార్నర్ను కట్టడి చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే. దిల్లీ బౌలింగ్లో కుల్దీప్ (20), ఖలీల్ అహ్మద్ (16) పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నారు. శార్దూల్ ఠాకూర్ (13) తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.
ముంబయిలో రోహిత్ మెరవాలి..
ఇక ముంబయి బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ సీజన్ ఆరంభంలో విఫలమైనా ఇటీవల కాస్త మెరుగైనట్లు కనిపిస్తున్నారు. గత మ్యాచ్లో హైదరాబాద్పై తొలి వికెట్కు వీరిద్దరు 95 పరుగులు జోడించారు. అదే జోరును ఈరోజు కూడా కొనసాగిస్తే దిల్లీకి కష్టాలు తప్పకపోవచ్చు. ఇషాన్ ఇప్పటివరకు 13 మ్యాచ్ల్లో 370 పరుగులు చేయగా మూడు అర్ధశతకాలు సాధించాడు. అలాగే యువ బ్యాట్స్మన్ తిలక్ వర్మ కూడా అన్ని మ్యాచ్ల్లో 376 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో రెండు అర్ధశతకాలు సాధించాడు. కెప్టెన్ రోహిత్ 13 మ్యాచ్ల్లో (266) పరుగులు చేసినా ఒక్క అర్ధశతకం నమోదు చేయలేదు. దీంతో చివరి మ్యాచ్లోనైనా అతడు చెలరేగి ఆడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సూర్యకుమార్ (303) ఇంతకుముందే గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇక మిగిలినవారిలో పొలార్డ్ (144) పరుగులే చేశాడు. దీంతో దిల్లీలాగే ముంబయి బ్యాటింగ్ లైనప్ కూడా ఏమంత చెప్పుకునే స్థితిలో లేదు. మరోవైపు ముంబయి బౌలింగ్ కూడా పూర్తిగా గాడితప్పింది. ఈ మధ్య బుమ్రా (13), డేనియల్ సామ్స్ (12) రాణించడం కాస్త ఊరటనిచ్చే విషయం. మురుగన్ అశ్విన్ (9) వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?