Diamond Duck: వీళ్లంతా డైమండ్ డక్ కెప్టెన్లు..
క్రికెట్లో డకౌట్ అంటే అందరికీ తెలిసిందే. ఎవరైనా బ్యాట్స్మన్ ఎన్ని బంతులాడినా పరుగులు చేయకుండా ఔటైతే డకౌట్ అంటారు. అలాగే గోల్డన్ డక్ అంటే ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరడం...
క్రికెట్లో డకౌట్ అంటే అందరికీ తెలిసిందే. ఎవరైనా బ్యాట్స్మన్ ఎన్ని బంతులాడినా పరుగులు చేయకుండా ఔటైతే డకౌట్ అంటారు. అలాగే గోల్డన్ డక్ అంటే ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరడం. కానీ, ఈ రెండూ కాకుండా డైమండ్ డక్ అనేది కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇలా డైమండ్ డక్కే ఔటయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా పెవిలియన్ చేరాడు. అలా ఈ భారత టీ20 లీగ్లో ఇప్పటివరకు డైమండ్ డక్గా వెనుదిరిగిన కెప్టెన్లు ఎవరంటే..
షేన్వార్న్ తొలిసారి..
(Photo: Shane Warne Instagram)
ఈ టీ20 లీగ్లో ఆరంభ సీజన్లోనే తొలి టైటిల్ కొట్టిన రాజస్థాన్ మాజీ కెప్టెన్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్వార్న్ డైమండ్ డక్ రికార్డుల్లోనూ తన పేరునే ముందు లిఖించుకున్నాడు. 2009లో ముంబయితో జరిగిన ఓ లీగ్ మ్యాచ్లో తొలిసారి అతడు ఈ అనవసరపు రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జయసూర్య బౌలింగ్ చేయగా జోహన్ బోథా ఆఖరి బంతికి క్రీజులో ఉన్నాడు. అంతకుముందే మైదానంలోకి వచ్చిన వార్న్ నాన్స్ట్రైకర్ ఎండ్లో నిలుచున్నాడు. అయితే, ఆ చివరి బంతిని బోథా లాంగాన్లోకి పంపి సింగిల్ తీశాడు. అప్పుడు వార్న్ రెండో పరుగుకోసం యత్నించగా హర్భజన్ వేసిన త్రోకు రనౌటయ్యాడు. దీంతో తొలిసారి ఈ టోర్నీలో డైమండ్ డకౌటైన ఆటగాడిగా షేన్వార్న్ నిలిచాడు.
రెండోసారి కూడా..
(Photo: Shane Warne Instagram)
ఇక మరుసటి ఏడాదే రెండోసారి కూడా ఈ టోర్నీలో డైమండ్ డక్ అయిన కెప్టెన్గా షేన్వార్న్ మరో ప్రత్యేకత సాధించాడు. ఈసారి చెన్నైతో ఆడిన ఓ లీగ్ మ్యాచ్లో ఔటవ్వడం గమనార్హం. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనే బరిలోకి వచ్చిన అతడు 19.4 ఓవర్కు నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. అప్పుడు తులాన్ తుషార వేసిన బంతికి సుమిత్ నర్వాల్ డీప్ పాయింట్ దిశగా షాట్ ఆడి సింగిల్ తీశాడు. అయితే, వార్న్ అనవసరంగా రెండో పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. అలా వరుసగా రెండో ఏడాది కూడా ఒక్క బంతిని ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు.
గంభీర్ స్వయంకృతం..
(Photo: Gautam Gambhir Instagram)
ఈ జాబితాలో రెండో కెప్టెన్గా గౌతమ్ గంభీర్ నిలిచాడు. 2013లో దిల్లీతో ఆడిన ఓ లీగ్ మ్యాచ్లో అతడు ఇలాగే ఒక్క బంతినీ ఎదుర్కోకుండా పెవిలియన్ చేరాడు. కోల్కతా ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ చేయగా.. మన్విందర్ బిస్లా రెండో బంతిని స్ట్రైట్డ్రైవ్ ఆడాడు. అది వెళ్లి నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న గంభీర్ ప్యాడ్లకు తగలడంతో అతడు సింగిల్ కోసం పరుగెత్తాడు. దీంతో వెంటనే బంతి అందుకున్న ఇర్ఫాన్ నేరుగా కీపర్వైపు విసిరాడు. అది వికెట్లకు తాకడంతో గంభీర్ రనౌటవ్వక తప్పలేదు.
మోర్గాన్ దురదృష్టం..
(Photo: Eoin Morgan Instagram)
ఇక 2013 తర్వాత మళ్లీ ఇలా డైమండ్ డక్గా ఔటైన మూడో కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ నిలిచాడు. గతేడాది అతడు కోల్కతా సారథిగా ఉండగా రాజస్థాన్తో జరిగిన ఓ లీగ్ మ్యాచ్లో ఒక్క బంతిని ఎదుర్కోకుండానే ఔటయ్యాడు. కోల్కతా ఇన్నింగ్స్ 10.2 ఓవర్కు మోరిస్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి స్ట్రైట్డ్రైవ్ ఆడాడు. ఆ బంతి నేరుగా వెళ్లి నాన్స్ట్రైకింగ్ ఎండ్లోని వికెట్లకు తాకగా.. అప్పటికే మోర్గాన్ క్రీజుదాటి ముందుకు వచ్చాడు. అది ఔట్ కాకపోయినా.. అక్కడే ఉన్న మోరిస్ మళ్లీ బంతిని అందుకొని నాన్స్ట్రైకింగ్లోనే వికెట్లను తాకాడు. దీంతో మోర్గాన్ రనౌట్ రూపంలో ఒక్క బంతి ఆడకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది.
ఈసారి రాహుల్ కూడా..
(Photo: KL Rahul Instagram)
ఈ సీజన్లో తొలిసారి డైమండ్ డక్ అయిన తొలి కెప్టెన్గా, ఓవరాల్గా నాలుగో సారథిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. కోల్కతాతో శనివారం ఆడిన మ్యాచ్లో ఈ లఖ్నవూ సారథి ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ చేరాడు. లఖ్నవూ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సౌథీ బౌలింగ్లో ఓపెనర్ డికాక్ ఆడిన ఐదో బంతి షార్ట్ ఎక్స్ట్రా కవర్స్లోకి వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న వెంకటేశ్ అయ్యర్ వెంటనే బంతిని అందుకొని నాన్స్ట్రైకింగ్ ఎండ్లో వికెట్లకేసి విసిరాడు. అప్పటికే క్రీజువదిలి ముందుకు వచ్చిన రాహుల్ రనౌటయ్యాడు. దీంతో ఈ జాబితాలో అతడు కూడా చేరిపోయాడు.
కేన్ మామ ఇలాగే..
(Photo: Kane Williamson Instagram)
ఇక తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇలాగే ఔటయ్యాడు. దీంతో అతడు కూడా డైమండ్ డక్గా వెనుదిరిగిన ఐదో కెప్టెన్గా ఆ జాబితాలో చేరిపోయాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే నాన్స్ట్రైకర్గా ఉన్న కేన్ మామ ఔటయ్యాడు. మాక్స్వెల్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతిని అభిషేక్ శర్మ కవర్స్లోకి ఆడగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షాబాజ్ అహ్మద్ బంతిని అందుకొని నేరుగా కీపర్వైపు వికెట్లకేసి విసిరాడు. దీంతో పరుగు కోసం యత్నించిన విలియమ్సన్ క్రీజులో బ్యాట్ పెట్టిన సమయానికి బంతి వికెట్లకు తాకింది. అయితే, అది అంపైర్ నిర్ణయం ప్రకారం ఔటివ్వడంతో విలియమ్సన్ కూడా డైమండ్ డక్ కెప్టెన్గా మిగిలిపోయాడు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM