T20 League Eliminator : ఫాఫ్ ‘లక్’ కొనసాగేనా..? రాహుల్ కల నెరవేరేనా..?
తమ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్ ఒకటి.. కాస్త అదృష్టం కలిసొచ్చి ఇతర జట్ల ఫలితంపై ఆధారపడి మరీ ప్లేఆఫ్స్కు చేరుకున్న జట్టేమో..
ఎలిమినేటర్లో పోటీ పడనున్న లఖ్నవూ, బెంగళూరు
ఇంటర్నెట్ డెస్క్: తమ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్ ఒకటి.. కాస్త అదృష్టం కలిసొచ్చి ఇతర జట్ల ఫలితంపై ఆధారపడి మరీ ప్లేఆఫ్స్కు చేరుకున్న జట్టేమో మరొకటి. ఈ క్రమంలో మే 25న (బుధవారం) ఎలిమినేటర్ మ్యాచ్లో ఢీకొనబోతున్నాయి. ఇందులో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్లో ఓడిన రాజస్థాన్తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మరి ఎలిమినేటర్లో తలపడే ఆ జట్లేవి.. వాటి బలాలు, బలహీనతలు, ఆటగాళ్ల ఫామ్ వంటి విషయాలను ఓ సారి పరిశీలిద్దాం..
మెగా టీ20 టోర్నీలో సుదీర్ఘంగా జరిగిన లీగ్ దశ ముగిసింది. తొలి క్వాలిఫయిర్లో రాజస్థాన్పై గుజరాత్ గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. ఓడిన రాజస్థాన్కు మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్ విజేతతో రెండో క్వాలిఫయర్లో తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్లు ఎలిమినేటర్లో తలపడతాయి. లఖ్నవూ (3) - బెంగళూరు (4) జట్ల మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.
ఛేజింగ్లో బహు జాగ్రత్త లఖ్నవూ..
ప్రస్తుత సీజన్లో శతకాలను సాధించిన వీరుల్లో కేఎల్ రాహుల్ రెండో ఆటగాడు. బట్లర్ (3) తర్వాత అత్యధికంగా రెండు సెంచరీలను రాహుల్ బాదాడు. లీగ్ దశలో 14 మ్యాచులకుగాను 9 విజయాలు సాధించి ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, డికాక్, దీపక్ హుడా, స్టొయినిస్, కృనాల్ పాండ్య, ఎవిన్ లూయిస్, ఆయుష్ బదోని వంటి బ్యాటింగ్ దళంతో లఖ్నవూ అద్భుత విజయాలను సాధించింది. అయితే ఛేజింగ్లో టాప్ఆర్డర్ చేతులెత్తేయడంతో మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీంతో నాలుగు మ్యాచ్లను ఓడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్టొయినిస్, హోల్డర్, దీపక్, బదోని రాణిస్తున్నా ఓటమి తప్పలేదు. కాబట్టి నాకౌట్ దశలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన ఇంటి ముఖం పట్టక తప్పదు.
ఇక టాప్స్కోరర్ జాబితాలో రాహుల్ (537) రెండో స్థానం, డికాక్ (502) మూడో స్థానంలో ఉన్నారు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా (406) కూడా టాప్-10లో ఉండటం విశేషం. బౌలింగ్ విభాగానికి వస్తే చమీర, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, హోల్డర్, స్టొయినిస్ కలిసి కట్టుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. వీరిలో అవేశ్ ఖాన్ (17) ఒక్కడే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా టాప్-10లో చోటు సంపాదించాడు. జాసన్ హోల్డర్ (14), మోహ్సిన్ ఖాన్ (8 మ్యాచుల్లోనే 13 వికెట్లు), రవి బిష్ణోయ్ (12), కృనాల్ పాండ్య (9), చమీర (9) రాణించారు. లఖ్నవూలో దీపక్ హుడా, జాసన్ హోల్డర్, స్టొయినిస్, కృనాల్ వంటి ఆల్రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం.
ఈసాలా కప్ నమదే.. సాధించాలంటే..
ఈసాలా కప్ నమదే.. నినాదంతో బెంగళూరు అభిమానులు ప్రతి సీజన్కు రావడం.. వెనుదిరగడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత సీజన్లోనూ లీగ్ దశకే పరిమితమై ఇంటిముఖం పడుతుందని భావించినా ఆఖరికి దిల్లీపై ముంబయి విజయంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుని ప్లేఆఫ్స్లోకి అడుగు పెట్టింది. నాలుగో స్థానంతో ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూతో తలపడనుంది. జట్టును చూస్తే తక్కువ అంచనా వేయడానికి వీల్లేని విధంగా ఉంది. కానీ మైదానంలో తేలిపోతుండటమే అసలు సమస్య. మరి అదృష్టం కలిసొచ్చి నాకౌట్కు చేరుకున్న బెంగళూరు అభిమానుల చిరకాల అభీష్టాన్ని తీర్చాలంటే ఇక కష్టపడాల్సిందే.
బ్యాటింగ్పరంగా చూస్తే ఆరంభంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అదరగొట్టాడు. తర్వాత నుంచి తన స్థాయి ఆటను ఆడలేకపోయాడు. ఇక మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదేమో. ఒకటి అరా మ్యాచుల్లో తప్ప పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే బ్యాటింగ్లో మిడిల్, లోయర్ఆర్డర్ను సమన్వయం చేసుకుంటూ దినేశ్ కార్తిక్ రెచ్చిపోయాడు. 14మ్యాచుల్లో 191.33 స్ట్రైక్రేట్తో 287 పరుగులు సాధించాడు. అయితే కార్తిక్ మాత్రమే కాకుండా మిగతా బ్యాటర్లూ లఖ్నవూతో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాణించాల్సిందే. లేకపోతే గెలవడం అంత సులువేం కాదు. బౌలింగ్లో బెంగళూరు పరిస్థితి ఫర్వాలేదు. వహిండు హసరంగ (24) మోస్ట్ వికెట్స్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ (18), జోష్ హేజిల్వుడ్ (15) కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ (8) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు. షాహ్బాజ్ ఆల్రౌండ్ పాత్రను సమర్థంగా పోషించాలి.
ఒకేసారి తలపడ్డాయి.. పైచేయి ఎవరిదంటే?
ప్రస్తుత సీజన్లో లఖ్నవూ, బెంగళూరు ఒకే ఒక సారి తలపడ్డాయి. అందులోనూ బెంగళూరుదే పై చేయి. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు డుప్లెసిస్ (96) విజృంభించడంతో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లఖ్నవూ 163/8 స్కోరుకే పరిమితమై 18 రన్స్తో ఓటమిపాలైంది. కృనాల్ పాండ్య (42), కేఎల్ రాహుల్ (30), మార్కస్ స్టొయినిస్ (24) ఫర్వాలేదనిపించారు. కీలక బ్యాటర్లు పెవిలియన్కు చేరడంతో లఖ్నవూకు ఓటమి తప్పలేదు. జోష్ హేజిల్వుడ్ (4/25) అదరగొట్టేశాడు. మరోసారి లఖ్నవూ-బెంగళూరు జట్లు తలపడనున్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారో.. క్వాలిఫయర్-2లోకి వెళ్లి అక్కడా గెలిచి ఫైనల్కు ఎవరు చేరుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు