Faf duplessis: ధోనీ లాగే దినేశ్ కార్తీక్ చాలా కూల్: డుప్లెసిస్
దినేశ్ కార్తీక్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, అచ్చం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలా కూల్గా ఉంటాడని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ ప్రశంసించాడు...
ముంబయి: దినేశ్ కార్తీక్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, అచ్చం చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలా కూల్ అని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ ప్రశంసించాడు. గతరాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 128 పరుగులకే కుప్పకూలగా బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో బెంగళూరు కూడా తడబడినా.. చివర్లో దినేశ్ కార్తీక్ (14 నాటౌట్; 7 బంతుల్లో 1x4, 1x6), హర్షల్ పటేల్ (10 నాటౌట్; 6 బంతుల్లో 2x4) ధాటిగా ఆడి విజయాన్నందించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మాట్లాడాడు.
‘ఈ విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న స్కోర్ల మ్యాచ్లో మేం సానుకూలంగా ఆడటానికి ప్రయత్నించాం. కానీ, కోల్కతా బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఈరోజు బంతి కాస్త ముందుగానే స్వింగ్ అవడంతో పాటు బౌన్స్ కూడా అయింది. రెండు, మూడు రోజుల క్రితం ఇదే పిచ్పై 200 పరుగులు చేస్తే ఈరోజు 130 పరుగులే నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి పెద్ద లక్ష్యమేమీ లేకపోయినా వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఇక దినేశ్ కార్తీక్ గురించి చెప్పడానికి ఏం లేదు. అతడు ధోనీలాగే చాలా ప్రశాంతంగా, కూల్గా ఉంటాడు. ఏదైనా అవసరమైతే నేను జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి సహాయం తీసుకుంటా. మా టీమ్లో చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మా కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. జట్టుగా కలిసి ఉన్నారు. వాళ్లకు ఏదైనా ఆలోచన వస్తే నాతో పంచుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
మా ఆటగాళ్లకు అదే చెప్పా: శ్రేయస్
‘ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నేనెంతో ఉత్సాహంగా ఉన్నా. మా ఆటగాళ్లతో కూడా మాట్లాడా. మనం గెలుస్తామా లేదా అనేది పక్కనపెడితే, మైదానంలో ఎలాంటి ప్రదర్శన చేశామనేదే మనమేంటో తెలియజేస్తుంది. మనం పోరాడే తీరు.. రాబోయే రోజుల్లో మన ఆలోచనా దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే చివరి వరకూ పోరాడి మ్యాచ్ను ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉంది. దానికి గర్వపడుతున్నా. ఆదిలోనే ఆ జట్టు వికెట్లు పడగొట్టే బౌలర్లను తీసుకురావాలనుకున్నా. అయితే, బెంగళూరు బ్యాట్స్మన్ నిలకడగా ఆడారు. వాళ్లకు అభినందనలు. ఇక చివర్లో వెంకటేశ్ అయ్యర్కు బౌలింగ్ ఇవ్వడానికి కారణం.. అంతర్జాతీయ క్రికెట్లో అతడూ కొంత అనుభవం పొందడమే. అందుకే అతడికి మరింత ఆత్మవిశ్వాసం కోసం అవకాశం ఇచ్చా. టోర్నీ ఆరంభంలోనే ఇలా బౌలింగ్ అవకాశాలిస్తే వారిలో సానుకూల ఆలోచనా విధానం ఏర్పడుతుంది. ఇక ఈ మ్యాచ్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్లో రాణించడానికి కృషి చేస్తాం. ఇక బెంగళూరు స్పిన్నర్ వానిండు హసరంగ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నా వికెట్ తీశాక మరింత రెచ్చిపోయాడు. మంచి ప్రదర్శన చేసిన అతడికి అభినందనలు’ అని కోల్కతా కెప్టెన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.