Gujarat Vs Rajasthan : గుజరాతేనయా.. ఫైనల్కు చేరిందయా
ప్లేఆఫ్స్ రేసు మొదలైంది. తొలి క్వాలిఫయిర్లో గుజరాత్-రాజస్థాన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన గుజరాత్ కెప్టెన్...
కోల్కతా: టీ20 లీగ్లో గుజరాత్ ఫైనల్కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్లో ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాజస్థాన్పై గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 188/6 స్కోరు సాధించింది. అనంతరం గుజరాత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసి గెలిచింది. డేవిడ్ మిల్లర్ (68*) అర్ధశతకం సాధించగా.. హార్దిక్ పాండ్య (40*), శుభ్మన్ గిల్ (35), మ్యాథ్యూ వేడ్ (35) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మెక్కాయ్ చెరో వికెట్ తీశారు.
ఈ విజయంతో గుజరాత్ నేరుగా ఫైనల్కు చేరుకోగా.. రాజస్థాన్కు మరొక అవకాశం క్వాలిఫయర్-2 రూపంలో ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూ-బెంగళూరు మధ్య ఎవరు నెగ్గితే వారితో రాజస్థాన్ తలపడుతుంది. మే 25న (బుధవారం) ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.
లక్ష్యం దిశగా గుజరాత్
గుజరాత్ ఇన్నింగ్స్ లక్ష్యం దిశగా సాగుతోంది. రాజస్థాన్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజ్లో హార్దిక్ పాండ్య (34*), డేవిడ్ మిల్లర్ (22*) ఉన్నారు. వీరిద్దరూ కలిపి ఇప్పటికి 53 పరుగులు జోడించారు. గుజరాత్ గెలవాలంటే ఇంకా 30 బంతుల్లో 50 పరుగులు చేయాలి.
దూకుడుగా గుజరాత్
గుజరాత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. అయితే వేగంగా ఆడిన శుభ్మన్ గిల్ (35) రనౌట్గా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజ్లో మ్యాథ్యూ వేడ్ (35*), హార్దిక్ పాండ్య (2*) ఉన్నారు. ఆరంభ ఓవర్లో కాస్త ఆచితూచి ఆడిన గుజరాత్ బ్యాటర్లు పవర్ప్లే ఓవర్లలో దంచి కొట్టారు. గుజరాత్ విజయానికి ఇంకా 66 బంతుల్లో 114 పరుగులు కావాలి.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ ప్రారంభించింది. అయితే రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే వృద్ధిమాన్ సాహా (0) వికెట్ తీశాడు. అనంతరం రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం గుజరాత్ బ్యాటర్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజ్లో శుభ్మన్ గిల్ (7*), మ్యాథ్యూ వేడ్ (19*) ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 188/6 స్కోరు సాధించింది.
గుజరాత్ ఎదుట భారీ లక్ష్యం
తొలి క్వాలిఫయర్లో గుజరాత్ ఎదుట రాజస్థాన్ 189 పరుగుల భారీ లక్ష్య ఉంచింది. మధ్య ఓవర్లలో నెమ్మదించినప్పటికీ రాజస్థాన్ మంచి స్కోరే సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (89) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (47), దేవదుత్ పడిక్కల్ (28) ఫర్వాలేదనిపించారు. యశస్వి జైస్వాల్ 3, హెట్మయేర్ 4, రియాన్ పరాగ్ 4, అశ్విన్ 2* పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, దయాల్, సాయికిశోర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.
కోలుకున్న రాజస్థాన్
ఇప్పుడిప్పుడే రాజస్థాన్ కుదురుకుంటోంది. దేవదుత్ పడిక్కల్ (28) ధాటిగా ఆడి హార్దిక్ పాండ్య బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజ్లో జోస్ బట్లర్ (37*), హెట్మయేర్ (1*) ఉన్నారు. ఆఖరి ఐదు ఓవర్లలో ధాటిగా పరుగులు రాబడితేనే గుజరాత్ ఎదుట భారీ లక్ష్యం ఉంచే అవకాశం ఉంటుంది.
గుజరాత్ స్పిన్నర్లు కట్టుదిట్టం
గుజరాత్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు శ్రమించారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన కెప్టెన్ సంజూ శాంసన్ (47) పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్లో జోస్ బట్లర్ (25*), దేవదుత్ పడిక్కల్ (1*) ఉన్నారు. ప్రారంభంలో ధాటిగా ఆడిన బట్లర్ నెమ్మదించాడు. దీంతో స్కోరు బోర్డు స్లో అయింది.
దూకుడుగా రాజస్థాన్ బ్యాటింగ్..
రాజస్థాన్ దూకుడుగా ఆడుతోంది. గుజరాత్ బౌలర్లు పట్టు విడవడంతో రాజస్థాన్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడేశారు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజ్లో ఓపెనర్ జోస్ బట్లర్ (17*), సంజూ శాంసన్ (34*) ఉన్నారు. యశస్వి జైస్వాల్ ఔటైన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన శాంసన్ వేగంగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు ఇప్పటి వరకు 49 పరుగులు జోడించారు.
రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభం..
తొలి క్వాలిఫయిర్లో రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. గుజరాత్ పేసర్ షమీ వేసిన తొలి ఓవర్లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ (14*) రెండు బౌండరీలు బాదాడు. అనంతరం రెండో ఓవర్ను యాష్ దయాల్ కట్టుదిట్టంగా వేశాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చి యశస్వి జైస్వాల్ (3) వికెట్ను తీశాడు. దీంతో రాజస్థాన్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజ్లో బట్లర్తోపాటు సంజూ శాంసన్ ఉన్నాడు.
టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్య
ప్లేఆఫ్స్లో సమరం మొదలైంది. తొలి క్వాలిఫయిర్లో గుజరాత్-రాజస్థాన్ మధ్య మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకుని రాజస్థాన్కు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. అయితే ఓడిన టీమ్కు మరొక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో తొలి క్వాలిఫయర్లో ఓడిన టీమ్ తలపడుతుంది. గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసింది. లాకీ ఫెర్గూసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్ను తీసుకుంది. రాజస్థాన్ ఏ మార్పు లేకుండా బరిలోకి దిగింది.
ఈ సీజన్లో రాజస్థాన్ తొలిసారి బ్యాటింగ్ చేసినప్పుడు ఏడుసార్లు విజయం సాధించగా.. గుజరాత్ ఆరు సార్లు ఛేజింగ్లోనే గెలవడం విశేషం. మరోవైపు సంజూ శాంసన్ ఈ సీజన్లో కేవలం రెండు సార్లు మాత్రమే టాస్ను నెగ్గగా.. 13 సార్లు కోల్పోయాడు. దీంతో ఒకే సీజన్లో అత్యధికసార్లు టాస్ ఓడిన కెప్టెన్గా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. సంజూ తర్వాత ఎంఎస్ ధోనీ (12సార్లు - 2012) (11సార్లు -2008), విరాట్ కోహ్లీ 11 సార్లు (2013) ఉన్నారు.
జట్ల వివరాలు:
గుజరాత్: వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయికిశోర్, యాష్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదుత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రోన్ హెట్మయేర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, చాహల్, మెక్కాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే