T20 League : టీ20 లీగ్ ప్లేఆఫ్స్.. మూడు బెర్తుల కోసం ఐదు టీమ్లు ‘తగ్గేదేలే ’!
టీ20 లీగ్ ఆఖరి దశకు చేరుతోంది. లీగ్ దశలో మరో ఏడు మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. అయితే ప్లేఆఫ్స్ బెర్తుల్లో గుజరాత్ మాత్రమే ఇప్పటి వరకు ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్ ఆఖరి దశకు చేరుతోంది. లీగ్ దశలో మరో ఏడు మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. అయితే ప్లేఆఫ్స్ బెర్తుల్లో గుజరాత్ మాత్రమే ఇప్పటి వరకు ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఐదు జట్లు ముందు వరుసలో ఉన్నాయి. మరి ఆ జట్లేవి.. వీటిల్లో ఏ జట్టు ముందుంది.. వాటికున్న అవకాశాలు ఏంటనేది తెలుసుకుందాం..
- గుజరాత్ : ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్స్కు వెళ్లిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. ఇప్పటి వరకు 13 మ్యాచుల్లో పది విజయాలతో 20 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరే జట్టూ తనను క్రాస్ చేసుకోని వెళ్లలేదు. మిగిలిన ఒక్క మ్యాచులోనూ విజయం సాధించి లీగ్ దశను ముగించాలని హార్దిక్ నేతృత్వంలోని గుజరాత్ భావిస్తోంది. అయితే లీగ్ స్టేజ్లో అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ నాకౌట్ రాణించడం చాలా కీలకం.
- రాజస్థాన్ : ప్రస్తుతం ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ (16)కు బెర్తు ఖరారు అని చెప్పలేని పరిస్థితి. తన ఆఖరి మ్యాచ్లో విజయం సాధిస్తే మాత్రం తిరుగుండదు. లఖ్నవూ వంటి బలమైన జట్టును ఓడించిన రాజస్థాన్కు చివరి మ్యాచ్లో చెన్నైని బోల్తా కొట్టించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే చెన్నైని ఓడించి రెండో స్థానం సుస్థిరం చేసుకుంటే నాకౌట్ దశలో అక్కరకొస్తుంది.
- లఖ్నవూ : ఆరంభంలో గుజరాత్తో పోటీగా విజయాలు సాధించిన లఖ్నవూ గత రెండు మ్యాచుల్లో ఓటమిపాలై ప్లేఆఫ్స్ అవకాశాలను కఠినం చేసుకుంది. లేకపోతే గుజరాత్తోపాటు ప్లేఆఫ్స్కు చేరిన జట్టుగా లఖ్నవూ అవతరించేది. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. తన ఆఖరి మ్యాచ్లో కోల్కతాతో తలపడనుంది. మరోవైపు కోల్కతాకు ఈ మ్యాచ్ ఫలితం పెద్దగా ఉపయోగపడదు. ఆరు విజయాలతో 12 పాయింట్లను మాత్రమే దక్కించుకుంది. అయితే లఖ్నవూ అవకాశాలను దెబ్బతీసే ఛాన్స్ మాత్రం కోల్కతా ముందుంది.
- బెంగళూరు : ఈసారి ఎలాగైనా కప్ను సాధించాలనే పట్టుదలతో వచ్చిన బెంగళూరు తీవ్ర నిరాశపరుస్తోంది. కీలక బ్యాటర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ విఫలం కావడం బెంగళూరు ఆశలకు గండి పడేలా ఉంది. ప్రస్తుతం ఏడు విజయాలను సాధించి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. తన ఆఖరి మ్యాచ్లో గుజరాత్తో తలపడాల్సి ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న గుజరాత్ను తట్టుకుని విజయం సాధించడం అద్భుతమనే చెప్పాలి. ఒకవేళ గెలిస్తే మాత్రం.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి కనీసం నాలుగో స్థానంతోనైనా ప్లేఆఫ్స్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.
- దిల్లీ- పంజాబ్ : ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారడానికి కారణం దిల్లీ, పంజాబ్ జట్లు.. కీలక సమయంలో విజయాలు సాధించి సై అంటూ ముందుకొచ్చాయి. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై ఒక జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. గెలిచిన జట్టు ఆశలు సజీవంగా ఉండటంతోపాటు పాయింట్ల పట్టికలో ముందడుగు పడుతుంది. ఓడిన జట్టు దాదాపు ఇంటి ముఖం పట్టక తప్పదు. ప్రస్తుతం దిల్లీ (5), పంజాబ్ (7) ఆరేసి విజయాలతో 12 పాయింట్లు సాధించాయి. ఇక దిల్లీకి తన ఆఖరి మ్యాచ్లో ముంబయితో తలపడుతుంది. పంజాబ్కు హైదరాబాద్తో మ్యాచ్ ఉంది. అయితే ఇవాళ్టి మ్యాచే ఇరు జట్లకూ కీలకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.