Sanju Samson: మా చేతిలో వికెట్లు ఉంటే ఈ మ్యాచ్ గెలిచేవాళ్లం: సంజూ
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో తమ చేతిలో వికెట్లు ఉంటే గెలిచేవాళ్లమని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ 37 పరుగులతో విజయం సాధించింది...
(Photo: Sanju Samson Instagram)
ముంబయి: గుజరాత్తో జరిగిన మ్యాచ్లో తమ చేతిలో వికెట్లు ఉంటే గెలిచేవాళ్లమని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ 37 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఆ జట్టు నాలుగు విజయాలతో టాప్లో దూసుకుపోతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 192/4 భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (87 నాటౌట్; 52 బంతుల్లో 8x4, 4x6) దంచికొట్టాడు. ఛేదనలో రాజస్థాన్ 155/9కే పరిమితమై ఓటమిపాలైంది. పాండ్య బౌలింగ్లోనూ ఒక వికెట్ తీయడంతో పాటు తన మెరుపు ఫీల్డింగ్తో సంజూ (11)ను రనౌట్ చేశాడు. దీంతో అతడు ఆల్రౌండ్ షో చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ ఇలా చెప్పుకొచ్చాడు.
‘గుజరాత్ అంత స్కోర్ చేసిందంటే ఆ క్రెడిట్ అంతా ఆ జట్టు బ్యాటర్లకు దక్కుతుంది. ముఖ్యంగా హార్దిక్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మా చేతిలో వికెట్లు ఉంటే ఈ స్కోర్ ఛేదించేవాళ్లమనే అనుకున్నా. పవర్ప్లేలో మా రన్రేట్ కూడా అద్భుతంగా ఉంది. అయితే వికెట్లు కోల్పోయాం. ఈరోజు హార్దిక్ అన్ని విభాగాల్లో రాణించాడు. ఈ లీగ్లో ప్రతి గేమ్ ముఖ్యమైందే అని నాకు తెలుసు. ఇక తర్వాతి మ్యాచ్లో తిరిగి బలంగా పుంజుకోవాలి. గతేడాది వరకు నేను మూడో స్థానంలో ఆడుతున్నా. ఇప్పుడు జట్టు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలనుకున్నాం. అశ్విన్ లాంటి ఆటగాడు ఉంటే ఇలాంటి ప్రయోగాలు చేయడం తేలికవుతుంది. ఇదంతా మేం ఆడే కాంబినేషన్ను బట్టి ఉంటుంది’ అని సంజూ వివరించాడు.
(Photo: Hardik Pandya Instagram)
ఇక గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఇలా విజయాలు సాధిస్తుంటే బాగుంటుందని చెప్పాడు. ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో బౌలింగ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మధ్యలోనే మైదానం వీడినట్లు తెలిపాడు. ఈరోజు తాను లయ అందుకున్నానని, దాంతో పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేశానన్నాడు. తాను అలా విజృంభించడం ద్వారా ఇతర ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. సారథిగా ముందుండి నడపడం గొప్ప విశేషమని అన్నాడు. తమ జట్టు ప్రస్తుతం బాగా ఆడుతోందని, ఇలాగే వరుస విజయాలతో ముందుకు సాగాలనుకుంటున్నట్లు చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. -
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
గాయం నుంచి కోలుకుని ముంబయితో మ్యాచ్కు శిఖర్ ధావన్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. -
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్