Kohli : ‘‘కోహ్లీ ఆ చీకటి ప్రదేశంలో ఉన్నాడు..’’
బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ టీ20 సీజన్లో తన
వరుసగా రెండోసారి విరాట్ గోల్డెన్ డక్పై పీటర్సన్
ముంబయి : బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ టీ20 సీజన్లో తన పేలవ ప్రదర్శనతో అటు అభిమానులను.. ఇటు జట్టు యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. నిన్న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన తీరు అతడి ఆటతీరుకు నిదర్శనం. ఈ సీజన్లో ఇలా వెనుదిరగడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. దీంతో విరాట్ బ్యాటింగ్పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లీ ఫామ్పై స్పందించాడు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడంటూ వ్యాఖ్యానించాడు. ‘‘ప్రస్తుతం కోహ్లీ ఏ స్థితిలో ఉన్నాడో.. గతంలో నా కెరీర్లో రెండుసార్లు నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇది మంచిది కాదు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడు. ముఖ్యంగా.. అందరి దృష్టి అతడిపైనే ఉన్నప్పుడు.. అది పూర్తిగా ఒంటరి ప్రదేశం. ఇది త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆట కోసం అతడు పరుగులు సాధించాల్సి ఉంది’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇక భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ కూడా కోహ్లీ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎవరైనా కొన్ని బంతులు కూడా ఎదుర్కోకుండా ఔట్ అయితే వారి బ్యాటింగ్ గురించి చెప్పడం కష్టం. కనీసం డజన్ బంతులైనా ఆడితే.. ఫుట్వర్క్ ఎలా ఉంది.. లైన్లోనే ఆడుతున్నాడా.. ఈ సాంకేతికతో ఆడితే బాగుంటుంది.. అని చెప్పొచ్చు’ అని గావస్కర్ వివరించాడు.
నిన్న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో జన్సన్ బౌలింగ్లో సెకండ్ స్లిప్లో చిక్కి కోహ్లీ వెనుదిరిగాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా ఇలాగే పరుగులేమీ చేయకుండా ఔటైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాదే టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో విరాట్ ఆటతీరుపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.