Ishan Kishan: ధర రూ.10 కోట్లకుపైనే.. అంచనాలు అందుకోలేకపోతున్నారు..!
భారత టీ20 లీగ్లో ఎప్పుడు వేలం జరిగినా కొందరు ఆటగాళ్లు ఊహించని ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. దాంతో వారిపై భారీ అంచనాలు ఏర్పడి ఆసక్తి కలిగిస్తారు...
భారత టీ20 లీగ్లో ఎప్పుడు వేలం జరిగినా కొందరు ఆటగాళ్లు ఊహించని ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. దాంతో వారిపై భారీ అంచనాలు నెలకొంటాయి. అయితే.. వీరిలో కొందరు మైదానంలో ఒత్తిడికి చిత్తవుతున్నారు. తాము తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేక తంటాలు పడుతున్నారు. అలా ఈ సీజన్లో భారీ ధర పలికినా.. సగం సీజన్ పూర్తవడానికి వచ్చినా.. ఇంకా మేటి ప్రదర్శనలు చేయలేక ఇబ్బందులు పడుతున్న ఆటగాళ్లెవరంటే..
(Photo: Ishan Kishan Instagram)
* ఇషాన్ ఒత్తిడికి చిత్తు: ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ సీజన్లో రూ.15.25 కోట్లతో అందరి కన్నా అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కొంత కాలంగా ఆ జట్టు తరఫున రాణిస్తుండటంతో మెగా వేలంలోనూ ముంబయే మళ్లీ కొనుగోలు చేసింది. అతడిపై నమ్మకం ఉంచి ఎవరూ ఊహించని ధరకు తీసుకుంది. అయితే, ఇప్పుడది ఆ జట్టుకు బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. ఇషాన్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 31.83 సగటుతో 191 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. కానీ, అతడి ఆటలో మునుపటి మెరుపు కనిపించడం లేదు. ఇప్పుడు ఆడుతున్న తీరు మరీ తీసిపారేయాల్సిన విధంగా లేకున్నా తీసుకునే సొమ్ముకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు.
(Photo: Shreyas Iyer Instagram)
* శ్రేయస్ ఓకే కానీ: దిల్లీ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో భారత్ తరఫున మూడో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. అతడి బ్యాటింగ్, కెప్టెన్సీ తీరు నచ్చిన కోల్కతా మెగా వేలంలో రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో గతేడాది ఫైనల్లో మిస్సైన మూడో కప్పును ఈసారి తెచ్చిపెడతాడనే ఆశ పెట్టుకుంది. కానీ, శ్రేయస్ బ్యాట్స్మన్గా రాణిస్తున్నా.. కెప్టెన్గా తడబడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 39.33 సగటుతో 236 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడు. అయితే, కెప్టెన్గా మూడు మ్యాచ్ల్లోనే కోల్కతాను విజయతీరాలకు చేర్చాడు. మరో నాలుగింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో జట్టును ఏడో స్థానంలో కొనసాగిస్తున్నాడు.
(Photo: Harshal Patel Instagram)
* హర్షల్ పసలేదు: గతేడాది 32 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్ పటేల్ ఈసారి ఏమాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్న బెంగళూరుకు కాస్త నిరాశే కలిగిస్తున్నాడు. మెగా వేలంలో రూ.10.75 కోట్లకు దక్కించుకొని మళ్లీ అవకాశం ఇచ్చినా ఆ జట్టుకు తన నుంచి కావాల్సిన వికెట్లు దక్కడం లేదు. ఇప్పటివరకు అతనాడిన ఆరు మ్యాచ్ల్లో 8 వికెట్లే తీసి ఏదో నెట్టుకొస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ 11/2 ఉండగా.. 7.29 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడం ఒక్కటే ఊరటనిచ్చే విషయం. అయితే, అతడు మరిన్ని వికెట్లు సాధిస్తే బెంగళూరు విజయాలకు మరింత కలిసొచ్చే వీలుంది. దీంతో హర్షల్ బౌలింగ్ ఇప్పుడు అంతంత మాత్రంగానే అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే హర్షల్ దక్కించుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోయినట్లే.
(Photo: Shardul Thakur Instagram)
* శార్దూల్ కష్టమే: ఇంతకుముందు చెన్నై ఆల్రౌండర్గా ఆ జట్టు విజయాల్లో కీలక సేవలు అందించిన శార్దూల్ ఠాకూర్ ఈసారి దిల్లీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. బౌలింగ్లో అలా వచ్చి ఇలా వికెట్లు తీసిపెట్టడం, బ్యాటింగ్లో మెరుపులు మెరిపించ గల సత్తా ఉండటంతో మెగా వేలంలో దిల్లీ రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అయితే, ఈ సీజన్లో అతడు ఆ జట్టుకు పెద్దగా ఉపయోగపడుతున్నట్లుగా అనిపించడం లేదు. అందుకు శార్దూల్ బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనలే కారణం. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 30/2 అత్యుత్తమ గణాంకాలు. ఎకానమీ కూడా 9.60గా ఉంది. దీంతో అటు పరుగులు ఆపలేక, వికెట్లు తీయలేక తంటాలు పడుతున్నాడు. మొత్తంగా బంతితో 4 వికెట్లు తీసిన శార్దూల్.. బ్యాట్తో 80 పరుగులే చేశాడు. దీంతో సగం సీజన్ పూర్తయ్యేసరికి ఏమాత్రం ప్రభావం చూపించడం లేదనిపిస్తోంది.
(Photo: Prasidh Krishna Instagram)
* ప్రసిద్ధ్ ఫర్వాలేదు: ఇదివరకు కోల్కతా జట్టులో మంచి పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. అతడి బౌలింగ్లోని వైవిధ్యం నచ్చిన ఆ జట్టు మెగా వేలంలో రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫర్వాలేదనిపిస్తున్నా అతడు దక్కించుకున్న ధరకు న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసిన అతడు 3/22 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఎకానమీ కూడా 8.14 మునుపటి సీజన్తో పోలిస్తే బాగుందనె చెప్పాలి. కానీ, అతడు మరిన్ని వికెట్లు తీసిపెడితే రాజస్థాన్కు తిరుగుండదు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా