KL Rahul: నేనా బంతిని చూడలేదు.. లేకపోతే ఏదో ఒకటి చేసేవాడిని: కేఎల్ రాహుల్
గతరాత్రి రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో తాను ఔటైన బంతిని గమనించలేదని లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆ బంతిని చూసి ఉంటే కచ్చితంగా ఏదో ఒకటి చేసేవాడినని చెప్పాడు...
స్టాయినిస్ ఎంత ప్రమాదకారో తెలుసు.. అందుకే అలా
(Photo: KL Rahul Instagram)
ముంబయి: గతరాత్రి రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో తాను ఔటైన బంతిని గమనించలేదని లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆ బంతిని చూసి ఉంటే కచ్చితంగా ఏదో ఒకటి చేసేవాడినని చెప్పాడు. రాజస్థాన్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన రాహుల్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మెరుపు వేగం బంతికి అతడు క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇక మరుసటి బంతికే వన్డౌన్ బ్యాట్స్మన్ కృష్ణప్ప గౌతమ్ (0) సైతం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో లఖ్నవూ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్ బౌల్ట్ బౌలింగ్ను కొనియాడాడు.
‘నేను ఆ బంతిని చూడలేదు. చూస్తే ఏదో ఒకటి చేసేవాడిని. ఆ క్రెడిట్ అంతా బౌల్ట్కే దక్కుతుంది. అదొక అత్యుత్తమ డెలివరీ. ఈ మ్యాచ్లో ఓటమిపాలైనా మాది బలమైన జట్టే. బ్యాట్, బంతితో రాణించే సత్తా మాకుంది. 20 పరుగులలోపే మూడు వికెట్లు కోల్పోయినా మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. కానీ, మా జట్టులో ఒక మేటి భాగస్వామ్యం నిర్మించలేకపోయాం. చివర్లో స్టాయినిస్ మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు. అతడి ఆట మెచ్చుకోదగినది. ఈ సీజన్లో అతడికి ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఈ ప్రదర్శనతో మంచి ఆత్మవిశ్వాసం సంపాదించుకుంటాడు. అతడిని చివరిదాకా బ్యాటింగ్కు పంపకపోవడం కూడా మా ప్రణాళికలో భాగమే. చివర్లో అతడు ఎంత ప్రమాదకారో మాకు తెలుసు. అందుకే అలా పంపించాం. మా వ్యూహాలతో ప్రత్యర్థులకు అర్థంకాని విధంగా ఆడాలనుకుంటాం. కానీ, ఈ మ్యాచ్లో మేం వేసుకున్న ప్రణాళికలను అమలుచేయలేకపోయాం. ఈ ఓటమి ఓ గుణపాఠంలాంటిది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఛేదనలో బౌల్ట్ 2/30, యుజ్వేంద్ర చాహల్ 4/41 రెచ్చిపోవడంతో లఖ్నవూ విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆఖర్లో స్టాయినిస్ (38 నాటౌట్; 17 బంతుల్లో 2x4, 4x6), దుష్మంత చమీరా (13; 7బంతుల్లో 2x4), అవేశ్ ఖాన్ (7 నాటౌట్; 2 బంతుల్లో 1x6) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. దీంతో లఖ్నవూ ఈ సీజన్లో రెండో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో టాప్లో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. గుజరాత్ను తన సొంతమైదానంలోనే చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే