KL Rahul: ఇలాంటివాటికైనా నాకు మరింత ఎక్కువ చెల్లించాలి: కేఎల్ రాహుల్
భారత టీ20 లీగ్ 15వ సీజన్లో లఖ్నవూ ప్లేఆఫ్స్ చేరింది. గతరాత్రి లీగ్ స్టేజ్లో కోల్కతాతో ఆడిన తమ చివరి మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది...
(Photo: KL Rahul Instagram)
ముంబయి: భారత టీ20 లీగ్ 15వ సీజన్లో లఖ్నవూ ప్లేఆఫ్స్ చేరింది. గతరాత్రి లీగ్ స్టేజ్లో కోల్కతాతో ఆడిన తమ చివరి మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో అధికారికంగా ప్లేఆఫ్స్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో లఖ్నవూ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా 208/8కు పరిమితమైంది. దీంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. చివరి ఓవర్లో కోల్కతా విజయానికి 21 పరుగులు అవసరమైన వేళ రింకూ సింగ్ (40; 15 బంతుల్లో 2x4, 4x6) రెచ్చిపోయాడు. స్టాయినిస్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాదిన అతడు తర్వాత వరుసగా రెండు బంతుల్ని స్టాండ్స్లోకి తరలించాడు. అలాగే నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రింకూ.. ఐదో బంతికి ఔటయ్యాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరమైన వేళ ఉమేశ్ యాదవ్ బౌల్డయ్యాడు. దీంతో ఉత్కంఠభరితమైన క్షణాల్లో కోల్కతా 18 పరుగులు సాధించి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఇలా స్పందించాడు.
‘ఇటువంటి మ్యాచ్ల కోసం నాకు మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో ఇలాంటివే కొన్ని మ్యాచ్లు కోల్పోయాం. ఇలా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లు చాలా తక్కువ. కొన్ని చివరి ఓవర్ వరకు వెళ్లిండొచ్చు. అయితే, ఈ మ్యాచ్లో గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కచ్చితంగా మేం ఓడిపోయే మ్యాచ్లాగే అనిపించింది. అదే జరిగి ఉంటే కచ్చితంగా మేం సరిగ్గా ఆడలేదనే భావనతో వెనుదిరిగేవాళ్లం. ఈ సీజన్లో మా చివరి లీగ్ మ్యాచ్ను ఘనంగా పూర్తి చేయడం బాగుంది. రెండు జట్ల ఆటగాళ్లు గొప్పగా ఆడినందువల్లే ఇలాంటి మ్యాచ్ ఆస్వాదించాము. స్టాయినిస్ చివరి రెండు బంతుల్లో తన ప్రణాళికలను అమలు చేసి విజయం సాధించడం గొప్ప విశేషం. మేం బ్యాటింగ్లో చాలా మెరుగ్గా ఆడాం. అయితే, మాపై కోల్కతా ఎదరుదాడి చేస్తుందని తెలుసు. ఇలాంటి విజయాలు ఆటగాళ్లకు మనోధైర్యాన్ని ఇస్తాయి. ఇక డికాక్ బ్యాటింగ్ చేస్తుంటే నేను ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాను. అతడు చాలా క్లీన్గా బౌండరీలు బాదాడు. ఈ సీజన్లో మా ఆటగాళ్లు పలువురు కొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అదే పని మేం ఈ మ్యాచ్లో చేశాం. చివర్లో లూయిస్ పట్టిన క్యాచ్ అమోఘం. అతడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. అయినా, ఈ రోజు అద్భతమైన క్యాచ్ అందుకున్నాడు. అతడికి ఈ రోజు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా ఏదో ఒక విధంగా జట్టుకు ఉపయోగపడాలనే తాపత్రయం కనిపించింది. మోసిన్ ఖాన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. త్వరలోనే అతడు టీమ్ఇండియా తరఫున ఆడతాడు’ అని రాహుల్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.