T20 League : టీ20 లీగ్.. గత వారం అద్భుతాలివే.. వచ్చే వారం ప్రతి జట్టుకూ కీలకమే!
టీ20 లీగ్లోని మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ లక్ష్యాలను ...
ప్లేఆఫ్స్ అవకాశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లోని మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ లక్ష్యాలను ఛేదించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొన్ని జట్లైతే స్వల్ప స్కోర్లను కాపాడుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పటి వరకు 46 లీగ్మ్యాచ్లు పూర్తయ్యాయి. గత వారం (సోమవారం నుంచి ఆదివారం) తొమ్మిది మ్యాచ్లు జరిగాయి. వాటి సంగతేంటో ఓసారి చూద్దాం.. అలానే ఇవాళ్టి నుంచి వచ్చే ఆదివారం వరకు మరో తొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి.. ఎవరెవరి మధ్య ఎప్పుడో తెలుసుకుందాం..
గత వారం రివ్యూ..
* ముంబయి తొలి విజయం: ఏప్రిల్ 25 నుంచి మే 1వ తేదీ వరకు జరిగిన మ్యాచుల్లో హైలైట్గా నిలిచేది ముంబయి X రాజస్థాన్ మ్యాచ్. వరుసగా ఎనిమిది మ్యాచ్లను ఓడిన ముంబయి ఎట్టకేలకు తొమ్మిదో మ్యాచ్ (ఏప్రిల్ 30)లో మొదటి విజయం రుచి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 158 పరుగులు చేయగా.. ముంబయి ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది.
* కెప్టెన్ మారాడు: మిస్టర్ కెప్టెన్ కూల్ మరోసారి చెన్నై సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. మే1న హైదరాబాద్తో మ్యాచ్కు ముందు రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ధోనీకే మళ్లీ జట్టు పగ్గాలను యాజమాన్యం అప్పగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 202/2 భారీ స్కోరు చేయగా.. హైదరాబాద్ 189/6 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. ఇది చెన్నైకి మూడో విజయం.
* ప్లేఆఫ్స్కు గుజరాత్: హైదరాబాద్తో మినహా తొమ్మిదికి ఎనిమిది మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ ప్లేఆఫ్స్లో బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఏప్రిల్ 30న జరిగిన మ్యాచ్లో బెంగళూరుపై అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ కేవలం నాలుగు వికెట్లను కోల్పోయి 174 పరుగులు చేసి విజయం సాధించింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచుల్లో చివరి ఓవర్లలోనే గుజరాత్ గెలవడం గమనార్హం.
* వరుసగా రెండో ఓటమి: తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన హైదరాబాద్ తర్వాత ఐదు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. అయితే ఈ వారంలో జరిగిన రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్ ఓడింది. ఏప్రిల్ 27న గుజరాత్పై, మే 1న చెన్నై ఓటమిపాలైంది. దీంతో టాప్-4లో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలను తగ్గించుకుంటోంది. గుజరాత్తో ఆఖర్లో బౌలర్లు తడబడటంతో పరాజయం పాలైంది. ఇక చెన్నైపై భారీ లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చి ఓడింది. అలానే కోల్కతా కూడానూ వరుసగా ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.
* మరోసారి బెంగళూరు విఫలం: హైదరాబాద్పై ఘోర ఓటమిని చవిచూసిన బెంగళూరు తీరు మారలేదు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ బ్యాటర్లు విఫలం కావడం గమనార్హం. 145 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 115 పరుగులకే కుప్పకూలి బెంగళూరు ఓడింది. డుప్లెసిస్ (23), రాజత్ పాటిదార్ (16), షాహ్బాజ్ (17), హసరంగ (18) మినహా ఎవరూ రెండంకెల స్కోరును కూడా నమోదు చేయలేదు. అంతకుముందు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 68 పరుగులకే కుప్పకూలి ఘోర అవమానం ఎదుర్కొంది.
ఈ వారం అసలైన పోరు
ప్లేఆఫ్స్ అవకాశాలు ఎవరికి ఎలా ఉంటాయో దాదాపుగా ఈ వారం (మే 2 నుంచి మే 8వరకు) తేలిపోనుంది. శని, ఆదివారాల్లో డబుల్ మ్యాచ్లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లతోపాటు ఏడో స్థానంలోపు ఉన్న టీమ్లకు కీలకం. హైదరాబాద్, బెంగళూరు పదేసి పాయింట్లతో ఉన్నాయి. వీటి వెనుకనే దిల్లీ, పంజాబ్ ఎనిమిదేసి పాయింట్లతో కాచుకుని ఉన్నాయి. ఏమాత్రం అవకాశం ఇచ్చినా ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లినట్లే.. కోల్కతా-రాజస్థాన్ (మే 2), గుజరాత్-పంజాబ్ (మే 3), బెంగళూరు-చెన్నై (మే 4), దిల్లీ-హైదరాబాద్ (మే 5), గుజరాత్-ముంబయి (మే 6), పంజాబ్- రాజస్థాన్ (మే 7), లఖ్నవూ-కోల్కతా (మే 7), హైదరాబాద్-బెంగళూరు (మే 8), చెన్నై-దిల్లీ (మే 8) మ్యాచ్లు జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా