Mayank Agarwal: ఇది చాలా కష్టమైన మ్యాచ్.. అయినా పోరాడాం: మయాంక్
గుజరాత్తో తలపడిన పోరులో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డా ఫలితం లేకపోయిందని పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. గతరాత్రి బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ నిర్దేశించిన 190...
(Photos: Mayank Agarwal, Hardik Pandya Instagram)
ముంబయి: గుజరాత్తో తలపడిన పోరులో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డా ఫలితం లేకపోయిందని పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. గతరాత్రి బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ఆఖరి బంతికి ఛేదించిన సంగతి తెలిసిందే. రాహుల్ తెవాతియా (13 నాటౌట్; 3 బంతుల్లో 2x6) ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి గుజరాత్కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన మయాంక్ ఇలా స్పందించాడు.
‘ఇది చాలా కష్టమైన మ్యాచ్. మేం విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాం. ఇంకో 5-7 పరుగులు చేయాల్సింది. అయినా, గుజరాత్ ఆరంభంలో ధాటిగా ఆడినా.. తర్వాత మేం పుంజుకున్నాం. బ్యాటింగ్లో తొమ్మిది వికెట్లు కోల్పోయినా 189 పరుగులు సాధించామంటే గొప్పగా ఆడాం. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాం. మా బౌలర్లు అర్ష్దీప్, రబాడా అత్యుత్తమ బౌలింగ్ చేశారు. మ్యాచ్ను చేజిక్కించుకునేందుకు విజయపుటంచుల దాకా తీసుకెళ్లారు. అయితే, చివరి ఓవర్లో ఫలితం ఇరు జట్లకూ సమానంగా మారింది. గుజరాత్ గెలుపొందినా చివరి ఓవర్ వేసిన ఒడియన్కు మేం అండగా ఉంటాం. అతడికి వందశాతం మద్దతిస్తాం. ఈ ఓటమి జీర్ణించుకోవడం కష్టమే అయినా.. మేం తిరిగి పుంజుకుంటాం’ అని అగర్వాల్ చెప్పుకొచ్చాడు.
నేను న్యూట్రల్గా మారా: హార్దిక్
ఇక గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ఆటలో గెలుపోటములు సహజమేనని చెప్పాడు. తాను ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నానని, గెలుపోటములతో సంబంధం లేదని చెప్పాడు. ఇక తమ జట్టు బ్యాటింగ్పై స్పందిస్తూ.. ‘చివర్లో రాహుల్ తెవాతియా చాలా గొప్పగా ఆడాడు. అతడికి హ్యాట్సాఫ్. ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో అలా వెళ్లి ఒత్తిడిని జయించి బ్యాటింగ్ చేయడం గొప్ప విశేషం. నిజం చెప్పాలంటే ఇది పంజాబ్ మ్యాచ్. వాళ్లు ఓటమిపాలవ్వడం నాకు బాధగా ఉంది. మా బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ చాలా మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా సాయికి క్రెడిట్ ఇవ్వాలి. అతడు గిల్తో నెలకొల్పిన భాగస్వామ్యం అమూల్యమైనది. ఆ భాగస్వామ్యమే మమ్మల్ని చివరివరకూ మ్యాచ్లో నిలబెట్టింది. నా విషయానికి వస్తే.. ప్రతి మ్యాచ్కూ మెరుగవుతున్నా. అయితే, పూర్తిగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయలేక అలసిపోతున్నా’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్