Top Paid Cricketers: రేటులో ఖరీదు.. మరి ఆటలో..?
ఈ సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన మెగా వేలంలో పలువురు స్వేదేశీ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు. దీంతో వారిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి...
ఈ భారత క్రికెటర్లు ఎలా ఆడారంటే..?
ఈ సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన మెగా వేలంలో పలువురు స్వేదేశీ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు. దీంతో వారిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాళ్ల నుంచి ఈ సీజన్లో పరుగుల వరద, వికెట్ల వేట చూస్తామని ఆశించిన అభిమానులకు కాస్త నిరాశే ఎదురైంది. అలా ఈ సీజన్లో అభిమానుల అంచనాలు అందుకోలేకపోయిన ఆటగాళ్లెవరంటే..
డైనమైట్లా పేలతాడనుకుంటే..
(Photo: Ishan Kishan Instagram)
ఈ సారి వేలంలో దేశీయ ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ముంబయి బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్. ఒంటి చేత్తో మ్యాచ్లను మలుపు తిప్పగలడు. ఈ సీజన్లో డైనమైట్టా పేలతాడనుకుంటే ఆరంభంలో ఘోరంగా విఫలమయ్యాడు. సగం మ్యాచ్ల తర్వాత ఫామ్లోకి వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అతడు అమ్ముడుపోయిన ధర(రూ.15.25 కోట్లు)కు న్యాయం చేయలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 32.15 సగటుతో 120.11 స్ట్రైక్రేట్తో 418 పరుగులే చేశాడు. కానీ, అతడి నుంచి అభిమానులు మరో లెవెల్ ఆటను ఆశించారు.
కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ కూడా..
(Photo: Shreyas Iyer Instagram)
ఇక వేలంలో మూడో అత్యధిక ధర పలికిన ఆటగాడు శ్రేయస్ అయ్యర్. కోల్కతా అతడిపై నమ్మకం ఉంచి రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే తనకున్న కెప్టెన్సీ అనుభవంతో నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ, గతేడాది రన్నరప్గా నిలిచిన జట్టు ఈసారి కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. ముఖ్యంగా శ్రేయస్ అటు సారథిగా, ఇటు బ్యాట్స్మెన్గా అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 30.85 సగటుతో 134.56 స్ట్రైక్రేట్తో 401 పరుగులే చేశాడు. దీంతో అతడు తీసుకునే సొమ్ముకు తగిన న్యాయం చేయలేదనే చెప్పాలి.
పెద్దగా ప్రభావం చూపలేదు కానీ..
(Photo: Shardul Thakur Instagram)
శార్ధూల్ ఠాకూర్ ఈసారి వేలంలో రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ నిలకడగా వికెట్లు తీయగల సత్తా ఉన్న ఆటగాడు. అవసరమైతే బ్యాట్తోనూ పరుగులు చేయగల సమర్థుడు. దీంతో ఈసారి వేలంలో అతడిపై నమ్మకం ఉంచిన దిల్లీ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే, శార్దూల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బౌలింగ్ పరంగా 15 వికెట్లు తీసి కాపాడుకున్నాడు. కానీ, బ్యాటింగ్లో 15 సగటుతో 120 పరుగులే చేసి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడు తీసుకునే డబ్బుకు మోస్తరు న్యాయం చేశాడు.
గతేడాది మెరిసినట్లు మెరవలేదు..
(Photo: Harshal Patel Instagram)
గతేడాది అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ను ఈసారి అదే జట్టు మెగా వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు 32 వికెట్లు తీసి టోర్నీ చరిత్రలో రెండోసారి ఆ ఘనత సాధించిన బౌలర్గా నిలిచారు. కానీ, ఈ సీజన్లో హర్షల్ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. ఈసారి 7.66 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేసినా 19 వికెట్లే తీశాడు. దీంతో హర్షల్ ఈసారి అందుకునే సొమ్ముకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు.
వీళ్లిద్దరూ ఎలా ఆడారంటే..
ఇక రాజస్థాన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, లఖ్నవూ పేసర్ అవేశ్ ఖాన్లు ఈ సీజన్లో చెరో 10 కోట్లకు అమ్ముడుపోయారు. అయితే, వీరిద్దరూ తాము తీసుకున్న సొమ్ముకు న్యాయం చేశారనే చెప్పొచ్చు. అవేశ్ 18 వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ 19 వికెట్లు తీశాడు. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ చేరడంలో ప్రసిద్ధ్, అవేశ్ తమవంతు కృషి చేశారు.
* ఇక దీపక్ చాహర్ను చెన్నై టీమ్ ఈసారి మెగా వేలంలో రూ.14 కోట్లకు దక్కించుకుంది. కానీ, అతడు టోర్నీ ప్రారంభానికి ముందు గాయపడటంతో ఈ సీజన్లో ఆడలేకపోయాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!