Punjab vs Bangalore: బెంగళూరుపై పులి.. ఇతర జట్లపై పిల్లి.. పంజాబ్పై విమర్శలు
భారత టీ20 లీగ్లో ఇప్పటివరకు ట్రోఫీ అందుకోని వాటిల్లో బెంగళూరు, పంజాబ్ జట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టోర్నీ ప్రారంభమై 15 సీజన్లు పూర్తికావస్తున్నా...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్లో ఇప్పటివరకు ట్రోఫీ అందుకోని వాటిల్లో బెంగళూరు, పంజాబ్ జట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టోర్నీ ప్రారంభమై 15 సీజన్లు పూర్తికావస్తున్నా ఇంకా తొలి కప్పు కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. అయితే, గత మూడేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో పంజాబ్దే ఆధిపత్యం. గతరాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 160 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేకపోయినా.. ఈ సీజన్లో బెంగళూరుపై రెండు సార్లు 200పైచిలుకు పరుగులు చేసి విజయాలు సాధించింది. అలాగే గత మూడేళ్లలో ఈ రెండు జట్లు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో గెలుపొందింది. దీంతో ఇతర జట్లతో పిల్లిలా ఉండే పంజాబ్.. బెంగళూరుపై పులిలా చెలరేగుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. బెంగళూరు అవకాశాలను దెబ్బతీయడానికే పంజాబ్ ఆడుతున్నట్లుందని ఆ జట్టు అభిమానులు మండి పడుతున్నారు. మీమ్స్తోనూ అలరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?