Rashid Khan:టీ20 లీగ్ ఫైనల్లో కచ్చితంగా ‘స్నేక్ షాట్’ ఆడతా: రషీద్ఖాన్
టీ20 లీగ్లో గత సీజన్ వరకు హైదరాబాద్కు ఆడిన రషీద్ఖాన్ ఈ ఏడాది కొత్త జట్టు గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. మెగా వేలానికి ముందు అతడిని గుజరాత్ రూ.15 కోట్లకు దక్కించుకుంది. అయితే, తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో గత సీజన్ వరకు హైదరాబాద్కు ఆడిన రషీద్ఖాన్ ఈ ఏడాది కొత్త జట్టు గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. మెగా వేలానికి ముందు అతడిని గుజరాత్ రూ.15 కోట్లకు దక్కించుకుంది. అయితే, తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించే రషీద్ఖాన్.. ఇప్పుడు బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న భారత టీ20 లీగ్లోనూ ఈ అఫ్గాన్ స్పిన్నర్ బ్యాట్తో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్లో రషీద్ ఓ కొత్త షాట్ను ఆవిష్కరించాడు. ఆ షాట్కు ‘స్నేక్ షాట్’అనే పేరు కూడా పెట్టాడు.
ఇదిలా ఉండగా, ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగబోయే టైటిల్ పోరులో గుజరాత్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో రషీద్ఖాన్ మాట్లాడాడు. తన ‘స్నేక్ షాట్’ గురించి అభిమానుల నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని రషీద్ పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ఆ షాట్ని తప్పకుండా ఆడతానని చెప్పాడు. ‘నేను ఇంతకుముందు కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నా. దీనికి కారణం నా ఆత్మవిశ్వాసం. కోచింగ్ స్టాఫ్, కెప్టెన్, ఆటగాళ్లందరూ ఆత్మవిశ్వాసం అందించారు. నేను రాణించగలనని వారు నమ్మారు. ఒక ఆటగాడికి కావలసిన శక్తి ఇదే. ఆ శక్తిని వారంతా నాకు ఇచ్చారు. ప్రాక్టీస్ సెషన్లో ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నా. గతంలో కంటే నాకు ఇప్పుడు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తోంది. కాబట్టి.. ఆఖర్లో జట్టుకు కొన్ని పరుగులు అందించగలనని ప్రతి ఒక్కరూ నాపై నమ్మకం పెట్టుకున్నారు. జట్టుకు అవసరమైనప్పడు 20-25 పరుగులు చేయగలననే నమ్మకం ఉంది. ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా స్నేక్ షాట్ ఆడతా’ అని రషీద్ఖాన్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.