Ravi Shastri: దిల్లీ జట్టు ఆటగాళ్లకు ఆమాత్రం తెలియదా: రవిశాస్త్రి మండిపాటు
గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ విషయంలో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు...
ఇంటర్నెట్డెస్క్: గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ విషయంలో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేరాడు. ఒకడుగు ముందుకేసి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టిమ్డేవిడ్ లాంటి ప్రమాదకర బ్యాట్స్మన్ ఖాతా కూడా తెరవకముందే ఔటయ్యే అవకాశం వస్తే వినియోగించుకోరా? అప్పటికింకా చేతిలో ఐదు ఓవర్లే ఉండగా రెండు రివ్యూలున్నా.. వాటిని ఉపయోగించుకునే కనీస విషయం తెలియదా? అంటూ మండిపడ్డాడు.
‘దిల్లీ ఆటగాళ్లకు ఆ మాత్రం తెలియదా? డేవిడ్ బ్యాట్ అంచున తాకి వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడినప్పుడు పంత్, శార్ధూల్ను వదిలేస్తే.. ఇతర ఆటగాళ్లు ఏం చేస్తున్నారు. అప్పటికి గేమ్లో ఇంకా ఐదు ఓవర్లే మిగిలి ఉన్నాయి. దిల్లీ వద్ద రెండు రివ్యూలు మిగిలాయి. డేవిడ్ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు బంతికే ఒక వికెట్ దక్కింది. దీంతో అతడి వికెట్తో కూడా దక్కితే రెండోదయ్యేది. అప్పుడు దిల్లీ జట్టే పైచేయి సాధించేది. అలాంటి సమయంలో రివ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదా? దానికి ఏం ఇంగిత జ్ఞానం కావాలి? ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇది వాళ్లు చేజేతులా చేసుకున్నదే. ఈ తప్పిదం వల్ల ఆటగాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఇది ప్లేఆఫ్స్కు చేరవేసే కీలక మ్యాచ్. అలాంటి ముఖ్యమైన దాన్ని కోల్పోయారు. ఇక్కడ ఎవర్నీ నిందించాల్సిన అవసరం లేదు. వాళ్లని వాళ్లే నిందించుకోవాలి. ఈ మ్యాచ్లో ముంబయి గెలిచిందని చెప్పేకన్నా దిల్లీనే స్వయంగా ఓడిందని అనాలి’ అని రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాంటివి జరుగుతుంటాయి: రోహిత్
మరోవైపు ఇదే విషయంపై ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అప్పుడప్పుడు ఆటలో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పాడు. పంత్ మంచి కెప్టెన్ అని, అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు చేయిదాటిపోతాయని, అదంతా సహజమని కొట్టిపారేశాడు. తానూ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. అదే విషయాన్ని పంత్కు వివరించానన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.