Ravindra Jadeja: చెన్నై టీమ్తో జడేజాకు విభేదాలా.. అందుకే జట్టు వీడాడా..?
చెన్నై టీమ్తో రవీంద్ర జడేజాకు విభేదాలు ఏర్పాడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కటెముకల్లో గాయం కారణంగా అతడు మిగిలిన సీజన్లో ఆడటం...
ఇంటర్నెట్డెస్క్: చెన్నై టీమ్తో రవీంద్ర జడేజాకు విభేదాలు ఏర్పాడ్డాయనే ప్రచారం జరుగుతోంది. పక్కటెముకల్లో గాయం కారణంగా అతడు మిగిలిన సీజన్లో ఆడటం లేదని చెన్నై టీమ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు ఆ జట్టు.. జడేజాను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిందని, ఇప్పుడు ఏకంగా జట్టులో నుంచే తొలగించిందని అభిమానులు మండిపడుతున్నారు.
అసలేం జరిగింది..
10 ఏళ్లుగా చెన్నై జట్టులో అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన జడేజా.. తన ఆల్రౌండ్ ప్రతిభతో ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన కెప్టెన్ ధోనీ, జట్టు యాజమాన్యం ఈ సీజన్కు ముందు రూ.16 కోట్లు వెచ్చించి మరీ అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలోనే టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ పగ్గాలు సైతం అందజేసింది. అయితే, నాయకత్వ బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురైన జడేజా ఈ సీజన్లో చెన్నైని సరిగ్గా నడిపించలేకపోయాడు. మరోవైపు ఆటగాడిగానూ విఫలమయ్యాడు. దీంతో కొద్ది రోజుల క్రితమే జడేజా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాడని, ధోనీ తిరిగి బాధ్యతలు చేపడతాడని చెన్నై టీమ్ ప్రకటించింది.
గాయం నిజమేనా..?
ఇక జడేజా కెప్టెన్సీ వదులుకున్నాక మే 4న బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా ఒక క్యాచ్ అందుకునే క్రమంలో పక్కటెముకలకు గాయమైంది. కానీ, ఆ రోజు జడేజా ఫీల్డింగ్ కొనసాగించి, తర్వాత బ్యాటింగ్ కూడా చేశాడు. అనంతరం మే 8న దిల్లీతో ఆడిన మ్యాచ్లో తుది జట్టులో లేడు. గాయం కారణంగా అతడు ఆడట్లేదని జట్టు యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చెన్నై జట్టు ఇన్స్టాగ్రామ్లో జడేజాను అన్ఫాలో చేసిందని, ఇప్పుడు జట్టు నుంచి తొలగించిందని అభిమానులు మండిపడుతున్నారు. తర్వాత అతడు కూడా చెన్నైని అన్ఫాలో చేశాడని అంటున్నారు.
చెన్నై టీమ్ ఏమంటోంది?
జడేజాకు నిజంగానే చెన్నై జట్టుతో చెడిందా అని ఆ జట్టు సీఈవో కాశీవిశ్వనాథన్ను అడిగితే అలాంటిదేమీ లేదన్నాడు. సామాజిక మాధ్యమాలను తాను వాడనని, అక్కడ ఏం జరుగుతోందనే విషయాలు తనకు తెలియవని చెప్పాడు. కానీ, జడేజా భవిష్యత్తులో కచ్చితంగా చెన్నైతోనే కొనసాగుతాడని వెల్లడించాడు. ప్రస్తుతం అతడు గాయపడ్డాడని, వైద్యుల సూచన మేరకే ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లు ఆడలేకపోతున్నాడని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.