Rishabh Pant: నేను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్ల్లో ఇదొకటి: రిషభ్ పంత్
గతరాత్రి హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 12x4, 3x6) విధ్వంసక బ్యాటింగ్.. తాను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్ల్లో ఒకటని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రశంసలు కురిపించాడు...
(Photo: Rishabh Pant Instagram)
ముంబయి: గతరాత్రి హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 12x4, 3x6) విధ్వంసక బ్యాటింగ్.. తాను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్ల్లో ఒకటని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. వార్నర్కు తోడుగా రోవ్మన్ పావెల్ (67 నాటౌట్; 35 బంతుల్లో 3x4, 6x6) దంచికొట్టడంతో నాలుగో వికెట్కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే వారిద్దరి బ్యాటింగ్ను కెప్టెన్ మెచ్చుకున్నాడు.
‘మేం మెరుగవ్వడానికి ఎప్పుడూ అవకాశాలు ఉన్నాయి. కానీ, బ్యాటింగ్ పరంగా ఈ మ్యాచ్ మాకు సరైన గేమ్లా అనిపించింది. మేం నిర్దేశించిన లక్ష్యం చూసి నేను ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే 200పై చిలుకు లక్ష్య ఛేదనలో ఏ జట్టు అయినా విజయం సాధించాలంటే ఓవర్కు 10-12 పరుగులు రాబట్టాలి. అలా 20 ఓవర్ల వరకూ ఆడటం అంత తేలిక కాదు. దీన్నిబట్టే మా బౌలర్లకు ప్రశాంతంగా ఉంటూ బౌలింగ్ చేయమని చెప్పా. ఇక వార్నర్ బ్యాటింగ్ విషయానికొస్తే.. అతడు ఆడిన విధానం, ఇన్నింగ్స్ను సాగించిన తీరు అమోఘం. నేను చూసిన అత్యుత్తమ బ్యాటింగ్లో ఇదొకటి. పావెల్ గురించి అందరికీ తెలిసిందే. అతడిని వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఇలా చెలరేగుతున్నాడు. ఇప్పుడు మేం ఒక్కో మ్యాచ్పైనే శ్రద్ధ వహిస్తున్నాం. అయితే, ఈ విజయం చాలా ముఖ్యమైనది’ అని పంత్ చెప్పుకొచ్చాడు.
అనంతరం డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. తనకు నచ్చినట్లు షాట్లు ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయన్నాడు. ‘ఈ వికెట్ చాలా బాగుంది. నాకు తోడుగా పావెల్ అద్భుతంగా ఆడాడు. ఇక హైదరాబాద్పై చెలరేగడానికి నాకేం అదనపు స్ఫూర్తి అవసరం లేదు. ఆ జట్టుపై విజయం సాధించడం గొప్పగా ఉంది. ఇక నేను ఆడిన స్విచ్ షాట్ (కుడి చేతి బ్యాటింగ్) బంతిని భువనేశ్వర్ యార్కర్ వేస్తాడని ఊహించా. కానీ, అతడు వికెట్లకు దూరంగా బంతిని వేశాడు. దీంతో నేను స్విచ్ షాట్కు ప్రయత్నించాను. సహజంగా ఈ షాట్ జోస్ బట్లర్ ఆడతాడు. దాన్ని నెట్స్లో సాధన చేసి ఇక్కడ ఉపయోగించాను. అయితే, తొలుత దాన్ని రివర్స్ షాట్ ఆడదామనుకున్నా.. కానీ, ఆ బంతి పడిన విధానం చూసి కట్ షాట్ ఆడాను’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ చివరి వరకూ పోరాడింది. ఆఖరికి 186/8తో నిలిచి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ జట్టులో నికోలస్ పూరన్ (62) రాణించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.