Rohit Sharma: రోహిత్శర్మ నాటౌట్ అట.. థర్డ్ అంపైర్పై నెటిజన్ల ఫైర్
గతరాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ నాటౌట్ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని మండిపడుతున్నారు...
ముంబయి: గతరాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ నాటౌట్ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని మండిపడుతున్నారు. కోల్కతా నిర్దేశించిన 166 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో ముంబయి తొలి ఓవర్లోనే కెప్టెన్ వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన చివరి బంతి.. రోహిత్ బ్యాట్ అంచుకు తాకుతున్నట్లు వెళ్లడంతో కీపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోల్కతా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటివ్వలేదు.
శ్రేయస్ అయ్యర్ రివ్యూకు వెళ్లడంతో సమీక్షించిన థర్డ్ అంపైర్.. అల్ట్రా ఎడ్జ్లో స్పైక్ కనిపించడంతో ఔటిచ్చాడు. అయితే, రీప్లేలో బంతి హిట్మ్యాన్ బ్యాట్కు కాస్త దూరంగా వెళ్తున్నట్లు కనిపించడం గమనార్హం. అది చూసి రోహిత్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతడు చేసేదిలేక నిరాశగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లో ముంబయి 17.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ సీజన్లో తొమ్మిదో ఓటమి చవిచూసింది.
నెటిజన్ల విమర్శలు..
* మనం చూసింది.. థర్డ్ అంపైర్ ఎందుకు చూడలేకపోయాడు. రోహిత్ నాటౌట్.
* థర్డ్ అంపైర్కు 3 డీ గ్లాస్ అవసరం అనుకుంటా.
* ఇది కచ్చితంగా సాంకేతికత తప్పిదం. బంతి రోహిత్ బ్యాట్ దగ్గరకు రాకముందే స్పైక్ కనిపించింది. థర్డ్ అంపైర్ కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది.
* థర్డ్ అంపైర్ సరిగ్గా గమనించకుండానే అలా ఎలా ఔటిస్తాడు. దీన్నిబట్టి వాళ్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. ఆ క్యాచ్ కూడా సరిగ్గా పట్టాడా లేదా అనేది కూడా చూడరా?
* బీసీసీఐతో పాటు టోర్నీ నిర్వాహకులు కొంచెం సరిగ్గా పనిచేసే అంపైర్లను తీసుకురండి. ఇలాంటి తప్పుడు అంపైరింగ్ నిర్ణయాలు ఆటగాళ్ల శ్రమ, అంకితభావాన్ని దెబ్బతీస్తాయి. ఏదో ఒక రోజు ఇలాంటి తప్పులు ఫైనల్ లేదా ఫలితాలను ప్రభావం చేసేలా మారుతాయి. అలాంటివి మంచిది కాదు.
* ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ కనీసం హాట్స్పాట్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఫీల్డ్ అంపైర్లను వదిలేస్తే ఈసారి థర్డ్ అంపైర్లు మరీ దారుణంగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
దిల్లీ అదరగొట్టింది. ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
Gujarat vs Delhi: పంత్ వికెట్ కీపింగ్ అదుర్స్.. ఒంటి చేత్తో సూపర్ క్యాచ్
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ వికెట్ కీపింగ్తో అదరగొట్టాడు. ఇషాంత్ శర్మ వేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి వికెట్ కీపర్ పంత్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ వెనుదిరిగాడు.
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. -
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
గాయం నుంచి కోలుకుని ముంబయితో మ్యాచ్కు శిఖర్ ధావన్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. -
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.