Sachin Tendulkar: సచిన్ తెందూల్కర్ టీ20 జట్టు.. ఆ ఇద్దరికి దక్కని చోటు
టీ20 లీగ్ సందడి ముగిసింది. లీగ్లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటిల్ని ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాజస్థాన్ను హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్గా అవతరించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్ సందడి ముగిసింది. లీగ్లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటిల్ని ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాజస్థాన్ను హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేయగా.. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. అయితే, ఈ సీజన్లో కొంతమంది ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించగా.. మరికొంత మంది తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఈ సీజన్లో తన బెస్ట్ ఎలెవన్ను ప్రకటించాడు.
గుజరాత్కు కప్ని సాధించి పెట్టిన హార్దిక్ పాండ్యను సచిన్ తాను ఎంచుకున్న జట్టుకు కెప్టెన్గా నియమించాడు. ఈ సీజన్లో నాలుగు శతకాలు బాది అత్యధిక పరుగులు (863) చేసిన ఆటగాడిగా నిలిచిన జోస్ బట్లర్, పంజాబ్ ఆటగాడు శిఖర్ ధావన్ని ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్స్టోన్, దినేశ్ కార్తీక్లను తీసుకున్నాడు. రషీద్ఖాన్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్లను బౌలర్లుగా ఎంపిక చేశాడు. టీ20 లీగ్లో మంచి బ్యాటర్లుగా గుర్తింపు పొందిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ సీజన్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రోహిత్ శర్మ (268), కోహ్లీ (341) పరుగులు మాత్రమే చేశారు. దీంతో సచిన్ తెందూల్కర్ ప్రకటించిన టీ20 జట్టులో ఈ ఇద్దరి ఆటగాళ్లకు చోటు దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.