Shoaib Akhtar: షేన్‌వార్న్‌కు నివాళిగా రాజస్థాన్‌ గెలవాలి: అక్తర్

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ ఫైనల్లో షేన్‌వార్న్‌కు నివాళిగా రాజస్థాన్‌ టీమ్‌ టైటిల్‌ విజేతగా నిలవాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆకాంక్షించాడు...

Published : 29 May 2022 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ ఫైనల్లో షేన్‌వార్న్‌కు నివాళిగా రాజస్థాన్‌ టీమ్‌ టైటిల్‌ విజేతగా నిలవాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆకాంక్షించాడు. 2008లో టోర్నీ ఆరంభ సీజన్‌లో రాజస్థాన్‌ తొలిసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. దీంతో ఆదివారం గుజరాత్‌తో తుదిపోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలోనే అక్తర్‌ మాట్లాడుతూ రాజస్థాన్‌ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు.

‘14 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌ ఫైనల్‌ చేరింది. షేన్‌వార్న్‌ జ్ఞాపకార్థం ఆ జట్టు తుదిపోరులో గుజరాత్‌ను ఓడిస్తుందని ఆశిస్తున్నా. వార్న్‌కు నివాళిగా ఆ జట్టు గెలవాలని మనసులో బలంగా కోరుకుంటున్నా. ఇప్పటికే ఆ జట్టు ఎన్నో కష్టాలకోర్చి ఫైనల్ వరకు చేరింది. అయితే.. గతంలో చెప్పినట్లు కొత్త జట్టు కూడా గెలవాలని నేను కోరుకుంటున్నాను. గుజరాత్‌  కూడా బాగా ఆడుతోంది.’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. కాగా.. తుదిపోరులో రెండు జట్లూ ఉద్వేగానికి లోనవుతాయని, రాజస్థాన్‌ తొలి సీజన్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఫైనల్‌ చేరడంతో దూకుడుగా ఆడుతుందని చెప్పాడు. మరోవైపు గుజరాత్‌ కూడా తొలి సీజన్‌లో తమ మార్క్‌ చూపించాలని తాపత్రయపడుతుందని పాక్‌ మాజీ పేసర్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు