T20 League 2022 Final: ‘బట్లర్.. అతడి బౌలింగ్లో జాగ్రత్త’
మరికొన్ని గంటల్లో టీ20 లీగ్ తుది సమరం ప్రారంభంకానుంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, రాజస్థాన్ జట్లు టైటిల్ పోరులో ఢీకొననున్నాయి. ఈ సీజన్లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు.
(photo: Jos Buttler insta)
ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని గంటల్లో టీ20 లీగ్ తుది సమరం ప్రారంభంకానుంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, రాజస్థాన్ జట్లు టైటిల్ పోరులో ఢీకొననున్నాయి. ఈ సీజన్లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 16 మ్యాచ్ల్లో 58.86 సగటుతో 824 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఫైనల్ మ్యాచ్లో బట్లర్ మరోసారి చెలరేగి జట్టుకు టైటిల్ని అందించాలని రాజస్థాన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బట్లర్కు టీమ్ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ కీలకమైన సూచన చేశాడు. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ స్పిన్నర్ రషీద్ఖాన్ బౌలింగ్లో బట్లర్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి, ఇతర బౌలర్ల ఓవర్లలో పరుగులు రాబట్టాలని మంజ్రేకర్ సూచించాడు. ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ తుది జట్టులో వ్యూహత్మక మార్పులు చేయాలని అభిప్రాయపడ్డాడు.
‘గుజరాత్ జట్టు మొదటి ఆరు ఓవర్లలో రషీద్ ఖాన్తో బౌలింగ్ చేయించొచ్చు. ఎందుకంటే అతడు వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేస్తాడు. బంతి నేరుగా స్టంప్స్ మీదికి వస్తే బట్లర్ ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి, అతడి బౌలింగ్లో బట్లర్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. అలాగే, రాజస్థాన్ బౌలర్లు రషీద్ఖాన్ని తొందరగా ఔట్ చేయాలి. క్వాలిఫయర్-1లో అల్జారీ జోసెఫ్ (గుజరాత్) బాగా బౌలింగ్ చేయలేదు. అతడు రెండు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చాడు. పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉండే పిచ్ కాబట్టి గుజరాత్ అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ని తుది జట్టులోకి తీసుకుంటుదని భావిస్తున్నా’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు