T20 League: ఉత్కంఠ రేపుతున్న ప్లేఆఫ్స్ బెర్తులు
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. ఇకపై ముంబయి, చెన్నై మినహా మిగతా జట్లు అన్నింటికీ ప్రతి మ్యాచ్ అతి ముఖ్యమైనదే. అయితే, ఇన్ని రోజులూ టాప్లో కొనసాగుతూ ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం...
వరుసగా ఓడిపోతున్న టాప్ జట్లు
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. ఇకపై ముంబయి, చెన్నై మినహా మిగతా జట్లు అన్నింటికీ ప్రతి మ్యాచ్ అతి ముఖ్యమైనదే. అయితే, ఇన్ని రోజులూ టాప్లో కొనసాగుతూ ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం చేసుకునేలా కనిపించిన ఫేవరెట్ జట్లు ఇప్పుడు అనూహ్యంగా ఓటముల పాలవుతున్నాయి. దీంతో లీగ్స్టేజ్ పూర్తయ్యేసరికి ఎవరు ఎక్కడ నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలున్న జట్లు.. వరుస వైఫల్యాలకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గుజరాత్ ఇలాగే ఆడితే..
హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఇన్ని రోజులు వరుస విజయాలతో దూసుకుపోయిన గుజరాత్ గత రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో టాప్లో ఉండి.. ప్లేఆఫ్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నప్పటికీ.. ఈ ఓటములు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ముంబయి, పంజాబ్ చేతుల్లో ఓటమిపాలైంది. దీంతో ఇదే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయంగా మారింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యమే గుజరాత్ కొంపముంచింది. ఆ జట్టుకు మిడిల్ ఆర్డర్లో వెన్నెముకలా ఉండే డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా లాంటి ఆటగాళ్లు ఉన్నా శుక్రవారం రాత్రి ముంబయితో ఆడిన మ్యాచ్లో విఫలమయ్యారు. ఒకవేళ ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ గుజరాత్ ఇలాగే విఫలమైతే పాయింట్ల పట్టికలో టాప్-4లో వెనుకబడే ప్రమాదం ఉంది.
రాజస్థాన్ మెరుగవ్వకుంటే..
బ్యాటింగ్లో జోస్బట్లర్ చెలరేగుతుండటంతో అద్భుత విజయాలు సాధించి టాప్ రెండులోకి దూసుకుపోయిన రాజస్థాన్ ఇటీవల వరుసగా రెండు మ్యాచ్లు ఓటమిపాలై మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా చివర్లో కొనసాగుతున్న కోల్కతా, ముంబయి చేతుల్లోనే విఫలమవ్వడం గమనార్హం. బ్యాటింగ్లో బట్లర్ లేదంటే కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే రాణిస్తున్నారు. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. తర్వాత వచ్చే డారిల్ మిచెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయిర్ లాంటి ఆటగాళ్లు ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపుతిప్పే సత్తా ఉన్నా విఫలమవుతున్నారు. దీంతో రాజస్థాన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నా ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్ల్లో ఇలాగే ఆడితే ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పాలి.
హైదరాబాద్ పరిస్థితి ఇదీ..
తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలు సాధించి అభిమానుల్లో సంతోషం నింపింది. కానీ, గత మూడు మ్యాచ్ల్లో మళ్లీ ఓటములపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం విలియమ్సన్ నేతృత్వంలో బ్యాటింగ్ పరంగా బాగున్నా.. బౌలింగ్లోనే ధారాళంగా పరుగులిస్తోంది. ఇటీవల ఆ జట్టు ఆడిన అన్ని మ్యాచ్ల్లోని గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. బౌలింగ్లో కాస్త జాగ్రత్త పడితే హైదరాబాద్ పుంజుకునే వీలుంది. ఒకవేళ ఈ విషయంలో మార్పు చేసుకోకపోతే గతేడాదిలాగే ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్ల్లో కనీసం 3 గేమ్స్ తప్పక గెలవాలి.
బెంగళూరు గాడిలో పడాలి..
ఇక బెంగళూరు సీజన్ ఆరంభంలో పలు విజయాలతో మంచి స్థితిలో నిలిచినా మధ్యలో వరుసగా మూడు మ్యాచ్లు ఓటములపాలై కాస్త కంగారు పెట్టింది. కానీ, గత మ్యాచ్లో చెన్నైపై గెలుపొంది మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తోంది. నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. టాప్ ఆర్డర్లో కోహ్లీ, అనూజ్ రావత్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్లో మొదట్లో దంచికొట్టి భారీ అంచనాలు నెలకొల్పిన దినేశ్ కార్తీక్ సైతం ఇటీవల రాణించలేకపోతున్నాడు. అతడు మళ్లీ బ్యాట్ ఝుళిపిస్తే తప్ప ఆ జట్టు పూర్తి స్థాయిలో గాడిలో పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్లో టాప్ రెండులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. లేదంటే మిగతా జట్లతో పోటీపడాల్సి ఉంటుంది.
రేసులోకి దూసుకొస్తున్న దిల్లీ, పంజాబ్..
మరోవైపు నిన్న మొన్నటి వరకు దిగువ స్థాయిలో కొనసాగిన దిల్లీ, పంజాబ్ జట్లు ఒక మ్యాచ్ గెలుస్తూ, ఒక మ్యాచ్ ఓడిపోతూ పాయింట్ల పట్టికలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు జట్లూ హైదరాబాద్ మాదిరే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐదేసి విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇకపై ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మ్యాచ్ల్లో గట్టి పోటీనివ్వాలి. కానీ, ఈ జట్ల పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. దీంతో వీరు టాప్-4లో నిలవాలంటే శక్తికి మించి రాణించాలి.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?