Vijay Shankar: విజయ్ శంకర్ను ఎలా తీసుకున్నారు..? గుజరాత్ ఆల్రౌండర్పై విపరీతమైన ట్రోలింగ్
గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతడిని ఈ టీ20 లీగ్కు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు...
(Photo: Vijay Shankar Instagram)
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతడిని ఈ టీ20 లీగ్కు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. గతరాత్రి రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అతడు వన్డౌన్ బ్యాట్స్మన్గా వచ్చి ఏడు బంతులాడి కేవలం రెండే పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని ఎందుకు తీసుకుంటున్నారని అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు గుజరాత్ టీమ్ ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ అనే ప్రతిభావంతుడైన యువకుడిని పక్కనపెట్టి విజయ్ను ఎంపిక చేయడంతో మరింత రెచ్చిపోతున్నారు.
విజయ్ కొన్నేళ్లుగా ఈ టీ20 లీగ్ ఆడుతూ వరుసగా విఫలమవుతున్నాడు. మధ్యలో టీమ్ఇండియాకు ఎంపికైనా ఒక్క మ్యాచ్లోనూ ఆకట్టుకోలేదు. ఇక ఈ లీగ్లోనూ ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతడి వల్ల 2019 వన్డే ప్రపంచకప్లో అంబటిరాయుడు చోటు కోల్పోయాడని, ఇప్పుడు సాయిసుదర్శన్ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. సాయి ఇటీవల పంజాబ్తో ఆడిన మ్యాచ్లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని కాదని, విజయ్ను ఎలా తీసుకుంటున్నారని నిలదీస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన విజయ్ శంకర్ 6.33 సగటుతో కేవలం 19 పరుగులే చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.