Sehwag: అక్తర్ బౌలింగ్ కాకుండా త్రో వేసేవాడు.. అది అతడికీ తెలుసు: సెహ్వాగ్
భారత క్రికెట్లో మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ది భిన్నమైన శైలి అనే సంగతి అందరికీ తెలిసిందే. అతడు ఆడే రోజుల్లో విధ్వంసకర బ్యాటింగ్తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు...
ఇంటర్నెట్డెస్క్: భారత క్రికెట్లో మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ది భిన్నమైన శైలి అనే సంగతి అందరికీ తెలిసిందే. అతడు ఆడే రోజుల్లో విధ్వంసకర బ్యాటింగ్తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీలకు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో క్రీజులో ఉన్నది పది నిమిషాలైనా స్కోరు బోర్డును పరుగులు పెట్టించేవాడు. నీళ్లు తాగినంత తేలిగ్గా బౌలర్లను ఉతికారేసేవాడు. రిస్క్ తీసుకొని మరీ శతకాల వద్ద బౌండరీలు బాదేవాడు. అంత దూకుడుగా ఆడటానికి గల కారణాలను తాజాగా వివరించాడు. ఓ క్రీడాఛానల్తో మాట్లాడిన సందర్భంగా సెహ్వాగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ.. ఈ నలుగురూ 150-200 బంతులు ఆడితే కచ్చితంగా శతకాలు సాధించేవాళ్లు. అలాంటప్పుడు నేను కూడా వాళ్లలాగే బ్యాటింగ్ చేస్తే నన్నెవరూ గుర్తుపట్టరు. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఆ నలుగురికన్నా ఇంకా వేగంగా పరుగులు చేయాలనుకున్నా’ అని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు. అలాగే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ బౌలింగ్పైనా స్పందించాడు. అతడి బౌలింగ్ సరిగ్గా ఉండదంటూ విమర్శించాడు. ‘అక్తర్ బంతులు సంధించేటప్పుడు మోచేయి కుదుపులకు లోనవుతుంది. దీంతో అతడు బౌలింగ్ కాకుండా త్రో వేసేవాడు. ఆ విషయం అతడికి కూడా తెలుసు. లేకపోతే ఐసీసీ అతడిపై ఎందుకు నిషేధం విధిస్తుంది?’ అని విమర్శించాడు. మరోవైపు ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ బౌలింగ్ అంటే తనకేమాత్రం భయంలేదని, అతడి మోచేయి సరిగ్గా తిరుగుతూ బంతిని బాగా సంధిస్తాడని మెచ్చుకున్నాడు. తాను బ్రెట్లీ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడేవాడిని కాదన్నాడు. అక్తర్ మాత్రం ఎప్పుడు ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమయ్యేది కాదని తెలిపాడు. అతడి బౌలింగ్లో రెండు, మూడు ఫోర్లు కొడితే.. ఇక తర్వాతి బంతి నుంచి తలమీదకైనా లేదా యార్కర్లతో అరికాళ్లనైనా టార్గెట్ చేసేవాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ