Rohit Sharma : ఎందుకిలా హిట్మ్యాన్.. నాయకత్వ భారమా..? ఆటగాళ్ల వైఫల్యమా..?
టీ20 లీగ్ చరిత్రలో ఐదుసార్లు తన జట్టుకు కప్ అందించిన...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్ చరిత్రలో ఐదుసార్లు తన జట్టుకు కప్ అందించిన సారథి అతడు... దిగ్గజ కెప్టెన్గా పేరుగాంచిన ఎంఎస్ ధోనీకి సాధ్యం కాని రికార్డూ అతడి పేరిట సొంతం.. విరాట్ కోహ్లీ నుంచి నాయకత్వ పగ్గాలు అందుకుని మరీ టీమ్ఇండియానే అప్రతిహతంగా నడిపిస్తోన్న ఆ కెప్టెన్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ.. హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకునే రోహిత్ శర్మ.. అతని సారథ్యంలోని ముంబయి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ను గెలవలేకపోయింది. మరి ఎందుకిలా అవుతుందో ఓ సారి విశ్లేషిద్దాం..
భారత కెప్టెన్సీకి మార్గమదే..!
ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న రోహిత్ టీమ్ఇండియాకు సారథిగా ఎంపిక కావడానికి ప్రధానం కారణం.. ముంబయి కెప్టెన్గా విజయవంతం కావడమేనని విశ్లేషకుల అభిప్రాయం. ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్గా నిలపడం సాధారణ విషయమేమీ కాదు. తీవ్ర పోటీ ఉండే టీ20 లీగ్లో ఆ ఫీట్ను సాధించడమే రోహిత్ శర్మకు ప్లస్ అయింది. విరాట్ కంటే ముందే భారత జట్టు నాయకత్వ బాధ్యతలు అందుకునే అవకాశం రోహితుడికే దక్కాల్సింది. అయితే దూకుడు, భీకర ఫామ్లో ఉండటం విరాట్ కోహ్లీకి కలిసొచ్చి కెప్టెన్సీ వరించింది. అయితే విరాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ మరే ఇతర ఆటగాళ్ల గురించి ఆలోచించకుండా రోహిత్కే అన్ని ఫార్మాట్ల పగ్గాలను అందించింది. వయసురీత్యా రోహిత్ (34) ఇంకో నాలుగైదేళ్లు మాత్రమే ఆడగలడు. అయినా కెప్టెన్గా నియమించిందంటే రోహిత్పై ఉండే నమ్మకం ఇది.
నాయకత్వమే భారమా..? వారి వైఫల్యమా?
భారత్ క్రికెట్ జట్టు సారథిగా ఎంపికైన తర్వాత ఆడిన ప్రతి సిరీస్నూ రోహిత్ టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సహకారంతో సొంతం చేసుకుంటూనే వచ్చాడు. న్యూజిలాండ్, లంక, విండీస్ జట్ల మీద టీ20 సిరీస్లను నెగ్గాడు. నూతన సమరోత్సాహంతో టీ20 లీగ్లోకి వచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లను ఆడిన ముంబయి ఒక్కటంటే ఒక్కటీ గెలవలేకపోయింది. బోణీ కొట్టలేకపోయింది. వ్యూహాలను అమలు చేయడంలో రోహిత్ విఫలమవుతున్నాడా..?అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత సీజన్ వరకు ముంబయి జట్టు సమతూకంగా ఉండేది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లతో దుర్భేద్యంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం యువ క్రికెటర్లు ఉండటం, సీనియర్లు ఫామ్లో లేకపోవడం కలవరపెడుతోంది. ఇషాన్, సూర్యకుమార్, తిలక్, బ్రెవిస్ వంటి వారు ఆడుతున్నా.. వ్యక్తిగతంగా రోహిత్ భారీగా పరుగులు చేయడం లేదు. ఇక హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పరిస్థితి మరీ దారుణం. ఆల్రౌండర్ పాత్రను పోషించడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. ఇక బుమ్రాకు బౌలింగ్లో సహకారం లేదు.
బయటపడేదెలా..?
ముంబయి జట్టు యాజమాన్యం సభ్యులకు ఎంతో స్వేచ్ఛనిస్తుంది. గత సీజన్ వరకూ వారు రాణించడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సారి యువ క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. బ్యాటింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలర్లు తేలిపోతున్నారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్కే అందుబాటులో ఉండడు. బుమ్రాకు తోడుగా బసిల్ థంపి, జయ్దేవ్ ఉనద్కత్ వంటి ఫాస్ట్ బౌలర్లను ప్రయోగించినా వర్కౌట్ కాలేదు. మిల్స్, డానియల్ సామ్స్ వంటి విదేశీ బౌలర్లూ తేలిపోయారు. కాబట్టి బౌలింగ్పై భారం లేకుండా ఉండాలంటే బ్యాటింగ్లో భారీ స్కోర్లు చేయాలి. పిచ్ను బట్టి ఒక్కోసారి వాటిని కాపాడుకోవడం కూడా కష్టమే అవుతుందేమో కానీ.. ప్రయత్నించడానికి బౌలర్లకు అవకాశం దొరుకుతుంది. యువ క్రికెటర్లను సమతుల్యం చేసుకుని నడిపించాల్సిన బాధ్యత రోహిత్పై ఉంది. ఇక నుంచైనా విజయాల బాట పట్టాలని ముంబయి అభిమానులు కోరుతున్నారు.
రోహిత్ ఫామ్లోకి రావాలి
ఓపెనింగ్లో శుభారంభం దక్కితే కింద వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఓ వైపు ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. రోహిత్ మాత్రం అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ కలిపి (41, 10, 3, 26, 28) 108 పరుగులు మాత్రమే చేశాడు. వీటిల్లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలయిస్తూ ఒక్క ఇన్నింగ్స్ లేకపోవడం గమనార్హం. ఇక నుంచైనా నాయకుడిగానే కాకుండా కీలక బ్యాటర్గా భారీ స్కోర్లు చేసి నడిపిస్తేనే ముంబయికి విజయాలు దక్కేది. లేకపోతే అత్యంత చెత్త రికార్డులను ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు