Bangalore vs Gujarat: గుజరాత్తో కీలకపోరు.. బెంగళూరుకు చావో రేవో..!
భారత టీ20 లీగ్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా నాలుగు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. అందులో ఈరోజు బెంగళూరు, గుజరాత్ తమ చివరి మ్యాచ్లో తలపడనున్నాయి...
ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందంటే..
భారత టీ20 టోర్ని 15వ సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకొంది. కేవలం నాలుగు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. వీటిలో ఈరోజు బెంగళూరు, గుజరాత్ తమ చివరి మ్యాచ్లో తలపడనున్నాయి. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా బెంగళూరుకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్గా మారింది. మరీ ముఖ్యంగా రన్రేట్ విషయంలో చాలా వెనకపడి ఉండటంతో బెంగళూరు ఈ రోజు భారీ తేడాతోనే నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
భారమంతా ఇద్దరే మోస్తున్నారు..
(Photo: Faf duplesis Instagram)
ఈ సీజన్లోనూ బెంగళూరు పరిస్థితి ఏమాత్రం మారలేదు. కొత్త జట్టుతో ఆరంభంలో పలు అద్భుత విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ జట్టు తర్వాత మళ్లీ పేలవ ఆటతీరుతో వెనుకబడింది. ముఖ్యంగా బ్యాటింగ్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఓపెనర్, కెప్టెన్ ఫా డుప్లెసిస్ ఆడితేనే స్కోరుబోర్డుపై పరుగులు కనిపిస్తున్నాయి. లేదంటే చివర్లో దినేశ్ కార్తీక్ ధనాధన్ బ్యాటింగ్తో దంచికొడుతున్నాడు. దురదృష్టం కొద్దీ వీరిద్దరూ విఫలమైతే ఇక బెంగళూరు పరిస్థితి చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. టాప్ ఆర్డర్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్, రజత్ పటిదార్, మహిపాల్ లోమ్రర్ ఇప్పటి వరకు ఏ మాత్రం రాణించలేదు.
(Photo: Dinesh Karthik Instagram)
ఇప్పటివరకు బెంగళూరు తరఫున అత్యధిక పరుగుల బ్యాట్స్మెన్ జాబితాలో డుప్లెసిస్ ఒక్కడే టాప్-10లో 9వ స్థానంలో ఉన్నాడు. అతడు 13 మ్యాచ్ల్లో 33.25 సగటుతో 399 పరుగులు చేసి జట్టును ఆదుకొంటున్నాడు. తర్వాత దినేశ్ కార్తీక్ ఫినిషర్గా వస్తూ దంచికొడుతున్నాడు. అతడు 57 సగటుతో 285 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ 13 మ్యాచ్ల్లో కేవలం 19.67 సగటుతో 236 పరుగులే సాధించాడు. మాక్స్వెల్ 10 మ్యాచ్ల్లో 25.33 సగటుతో 228 పరుగులు చేసినా.. భారీ ఇన్నింగ్స్లు లేవు. దీన్నిబట్టి ప్రస్తుతం బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గుజరాత్పై మ్యాచ్ గెలవాలన్నా.. తర్వాత ప్లేఆఫ్స్ చేరాలన్నా వాళ్ల నుంచి ఇలాంటి ప్రదర్శనలు సరిపోవు. కోహ్లీ, మాక్స్వెల్ ఇకనైనా బ్యాట్లు ఝుళిపించకపోతే ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు గుజరాత్ జట్టులో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దంచికొడుతున్నారు. ఓపెనర్ల నుంచి ఫినిషర్ల వరకు పోటీపడి మరీ విజయాలు తెచ్చిపెడుతున్నారు. దీంతో బెంగళూరు ఈ మ్యాచ్లో గెలవాలంటే తమ శక్తియుక్తులను ధారపోయాల్సిందే.
బౌలింగ్లోనూ ఇద్దరే మెరుస్తున్నారు..
(Photo: Wanindu Hasaranga Instagram)
ఇక బెంగళూరు బౌలింగ్ విషయానికి వస్తే వానిండు హసరంగ, హర్షల్ పటేల్ మాత్రమే రాణిస్తున్నారు. వీరిద్దరూ వికెట్లు తీస్తూనే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హసరంగ 13 మ్యాచ్ల్లో 7.48 ఎకానమీతో 23 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు హర్షల్ 12 మ్యాచ్ల్లో 7.72 ఎకానమీతో 18 వికెట్లు తీశాడు. అతడు ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, బెంగళూరులో ప్రధాన పేసర్ అయిన మహ్మద్ సిరాజ్ తన స్థాయికి తగ్గట్లు ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు 13 మ్యాచ్ల్లో 9.82 ఎకానమీతో 8 వికెట్లే సాధించాడు. ఇక జోష్ హేజిల్వుడ్ 9 మ్యాచ్ల్లో 7.88 ఎకానమీతో 13 వికెట్లు తీసి మోస్తరుగా రాణిస్తున్నాడు. అలాగే పార్ట్టైమ్ స్పిన్నర్గా మాక్స్వెల్ 8 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసి 7.05 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. దీంతో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా మరిన్ని వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కీలక ఆటగాళ్లంతా తమ అనుభవాన్ని మొత్తం రంగరించి ఈ మ్యాచ్లో రాణిస్తే తప్ప గుజరాత్పై విజయం సాధించే పరిస్థితి లేదు.
గత మ్యాచ్ల పరిస్థితి..
(Photo: Harshal Patel Instagram)
బెంగళూరు తన చివరి ఐదు మ్యాచ్ల్లో మూడు ఓటములు, రెండు విజయాలు సాధించింది. అలాగే గుజరాత్ మూడు విజయాలు, రెండు ఓటములు సాధించింది. మరోవైపు ఇరు జట్ల మధ్య ఇంతకుముందు జరిగిన మ్యాచ్లోనూ గుజరాత్దే పైచేయిగా నిలిచింది. దీంతో ఎలా చూసినా ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరు కన్నా గుజరాత్ జట్టే మెరుగ్గా ఉంది. దీంతో బెంగళూరు ఇప్పుడు ఆ జట్టును ఓడించడం చాలా కష్టమనే చెప్పాలి. అయినా, గట్టిగా ప్రయత్నిస్తే దాన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి