T20 League : రెండు జట్లు ఫిక్స్.. మరో రెండింటి కోసం టఫ్ ఫైట్
ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ముప్పావు మ్యాచులు ముగిసినా టాప్-4 జాబితాలో ఉండే జట్లు ఏంటనేవి ఇంకా తెలియలేదు. మ్యాచులు జరిగే కొద్దీ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకునే జట్లేవో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లేమో వరుసగా...
ఎక్కువ అవకాశాలు ఉన్న జట్లపై ప్రత్యేక కథనం
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ముప్పావు మ్యాచులు ముగిసినా టాప్-4 జాబితాలో ఉండే జట్లు ఏంటనేవి ఇంకా తెలియలేదు. మ్యాచులు జరిగే కొద్దీ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకునే జట్లేవో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లేమో వరుసగా ఓటమి బాట పట్టగా.. మరికొన్నేమో విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటి వరకు లీగ్ దశలో 56 మ్యాచ్లు ముగిశాయి. ఇందులో రెండు జట్లు దాదాపు ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగతా రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో తేలాల్సి ఉంది. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం..
తొలిసారే బెర్తులు ఖరారు..
హేమాహేమీలను కాదని కొత్త జట్లు లఖ్నవూ, గుజరాత్ ఈ సీజన్లో దూసుకుపోతున్నాయి. రెండు జట్లూ తలో పదకొండేసి మ్యాచ్లను ఆడేశాయి. ఎనిమిదేసి విజయాలతో ఉన్నాయి. అయితే కాస్త రన్రేట్ ఎక్కువగా ఉండటంతో లఖ్నవూ (16) గుజరాత్ (16) కంటే ముందుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్లకు ఇంకా మూడేసి మ్యాచ్లు ఉన్నాయి. వాటిల్లో ఓడినా సరే పదహారేసి పాయింట్లతో టాప్-4లో మాత్రం ఉండటం పక్కా. కాబట్టి గుజరాత్, లఖ్నవూ దాదాపు ప్లేఆఫ్స్కు వెళ్లినట్లే.
మిగిలిన మ్యాచ్లు..
* లఖ్నవూ: గుజరాత్, రాజస్థాన్, కోల్కతా
* గుజరాత్: లఖ్నవూ, చెన్నై, బెంగళూరు
రెండు జట్లకే ఎక్కువ అవకాశాలు
లఖ్నవూ, గుజరాత్ టీమ్ల తర్వాత పాయింట్ల పట్టికలో రాజస్థాన్ (14), బెంగళూరు (14) వరుసగా ఉన్నాయి. అయితే బెంగళూరు ఇప్పటి వరకు 12 మ్యాచులకుగాను ఏడు విజయాలు, ఐదు ఓటములతో కొనసాగుతోంది. కానీ రాజస్థాన్ మాత్రం 11 మ్యాచుల్లోనే ఏడు విజయాలు నమోదు చేసింది. కాబట్టి బెంగళూరు కంటే రాజస్థాన్కే కాస్త అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ మిగతా మూడు మ్యాచ్లను కనీసం రెండు గెలిస్తే రాజస్థాన్ ఖాయంగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. అదేవిధంగా బెంగళూరు తన చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే మాత్రం ఇతర జట్ల సమీకరణాలతో అవసరం లేకుండానే ప్లేఆఫ్స్కు వెళ్తుంది. అలా కాకుండా ఒకటే గెలిస్తే రన్రేట్ను బట్టి అడుగు ముందుకు పడుతుందో లేదో చూడాలి.
మిగిలిన మ్యాచ్లు..
* రాజస్థాన్: దిల్లీ, లఖ్నవూ, చెన్నై
* బెంగళూరు: పంజాబ్, గుజరాత్
ఈ మూడు ముందుకు సాగేనా..?
వరుసగా ఐదు మ్యాచ్లను గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన హైదరాబాద్ ఆ తర్వాత నాలుగు ఓటములతో డీలా పడింది. హైదరాబాద్తో పాటు దిల్లీ, పంజాబ్ జట్లు కూడా ఐదేసి విజయాలతో 10 పాయింట్లు సాధించాయి. ప్రస్తుతం దిల్లీ ఐదు, హైదరాబాద్ ఆరు, పంజాబ్ ఏడో స్థానాల్లో నిలిచాయి. ఇంకా ఈ జట్లకు మూడేసి మ్యాచ్లు ఉన్నాయి. అన్నింట్లోనూ గెలిస్తే తప్పకుండా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కటి ఓడినా రేసు నుంచి తప్పుకుని ఇంటిముఖం పట్టక తప్పదు. హైదరాబాద్, పంజాబ్ కంటే దిల్లీకే ఛాన్సులు అధికం. నెట్రన్రేట్ ఎక్కువ ఉండటం కలిసొస్తుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మిగిలిన మ్యాచ్లు..
* హైదరాబాద్: కోల్కతా, ముంబయి, పంజాబ్
* దిల్లీ: రాజస్థాన్, పంజాబ్, ముంబయి
* పంజాబ్: హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు
అద్భుతాలే జరగాలి..
పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి (4) ప్లేఆఫ్స్ చేరే అవకాశమే లేదు. మరోవైపు తొమ్మిదో స్థానంలో ఉన్న చెన్నై (8).. అద్భుతాలు జరిగితే తప్ప టాప్-4లో నిలవదు. ఇక ఎనిమిదిలో ఉన్న పంజాబ్ (10), ఏడులో ఉన్న కోల్కతా (10) ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో శక్తికి మించి రాణించాలి. అవి విజయం సాధించినా ఇతర జట్లతో రన్రేట్ పరంగా మెరుగ్గా ఉండాలి.
మిగిలిన మ్యాచ్లు..
* చెన్నై: ముంబయి, గుజరాత్, రాజస్థాన్
* కోల్కతా: హైదరాబాద్, లఖ్నవూ
* ముంబయి: చెన్నై, హైదరాబాద్, దిల్లీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్