Rajasthan: బాగా ఆడిన రాజస్థాన్ ఎందుకు కప్ కొట్టలేకపోయింది... ఏం జరిగింది?
2022 టీ20 లీగ్లో తొలుత నుంచి బాగా ఆడుతున్న రాజస్థాన్ ఎందుకు టైటిల్ సాధించలేకపోయింది.
టీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఫైనల్కి వచ్చింది. ఈ సారి టైటిల్ గెలిచి షేన్ వార్న్కి నివాళి ఇద్దామనుకున్నారు. అయితే ఫైనల్లో ఊహించని రీతిలో ఓడిపోయారు. అయితేనేం రెండో మేటి జట్టుగా క్రీడాభిమానుల ప్రేమను సాధించారు. మరి టైటిల్ ఎందుకు కొట్టలేకపోయారో ఓసారి పోస్ట్మార్టమ్ చేద్దామా?
73 మ్యాచ్లపాటు అభిమానులు వేచి చూసిన టీ20 లీగ్ ఫైనల్ నిన్న జరిగింది. అన్ని రంగాల్లో సమష్ఠిగా రాణించిన గుజరాత్ అరంగేట్ర సీజన్లోనే కప్పు సాధించింది. సిరీస్ సాంతం బాగా ఆడిన రాజస్థాన్.. ఫైనల్లో బొక్క బోర్లాపడింది.
బలమే బలహీనత...
టీ20 లీగ్ 2022లో రాజస్థాన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో జాస్ బట్లర్ ఒకటి. సిరీస్ ప్రారంభంలో బట్లర్ బాదుడు చూసి ఈ ఏడాది రాజస్థాన్ టైటిల్ కొట్టేయడం పక్కా అనుకున్నారంతా. అంతలా విరుచుకుపడ్డాడు. నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలతో సీజన్లో 863 పరుగులు చేశాడు బట్లర్. బ్యాటింగ్లో ఈ ఏడాది అత్యధికాలు అన్నీ బట్లర్వే. అంతలా బలంగా కనిపించిన బట్లరే... బలహీనత కూడా. అందుకే బట్లర్ బాగా ఆడిన మ్యాచ్ల్లో గెలవడం, లేదంటే ఓడడం రాజస్థాన్ డైలీ రొటీన్ అయిపోయింది. అలా అని ఆడిన అన్ని మ్యాచ్లు గెలవలేదనుకోండి.
కానీ, ఫైనల్ లాంటి కీలక మ్యాచ్లో బట్లర్ బాగా ఆడాల్సి ఉంది. కీలకమైన క్వాలిఫయర్ 2లో బెంగళూరుపై సెంచరీ చేసిన బట్లర్ నుంచి ఫైనల్లో అదే ప్రదర్శన ఆశించింది రాజస్థాన్. కానీ ఆఖరి పోరులో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో జట్లు స్కోరు 130 పరుగులకే పరిమితమైపోయింది. బట్లర్ లేదంటే శాంసన్ అన్నట్లుగా ఉన్న రాజస్థాన్ బ్యాటింగ్ వాళ్లిద్దరూ పెవిలియన్కి చేరేసరికి.. మిగిలినవాళ్లూ డగౌట్కి వచ్చేశారు. రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం బలంగా మారిన బలహీనత అయిన బట్లర్ అని చెప్పొచ్చు. ఒక్కరిద్దరి మీద ఆధారపడితే మ్యాచ్లు గెలుస్తారు తప్ప టోర్నీలు కాదని సీనియర్లు ఊరికే చెప్పలేదు.
వేగం నియంత్రించలేక...
గుజరాత్ ఈ ఏడాది టాప్ టీమ్గా ఫైనల్కి చేరిందంటే దానికి కారణాల్లో ఒకటి బౌలింగ్లో వైవిధ్యం. జట్టులో 140 - 150 కి.మీల వేగంతో బంతులేసేవాళ్లు ఉన్నారు. అదే సమయంలో 120 నుంచి 130 మధ్య నిలకడగా బంతులేసేవాళ్లూ ఉన్నారు. కొన్ని పిచ్ల మీద ఆ పేస్ వేరియేషన్ చాలా అవసరం. రాజస్థాన్ బౌలర్లలో ఇది కాస్త తక్కువే అని చెప్పొచ్చు. పాండ్య లాంటి మీడియం పేసర్ రాజస్థాన్కి లేకపోయాడు. దాంతోపాటు రియాన్ పరాగ్ లాంటి ఆరో బౌలర్ ఆప్షన్ ఉన్నా వాడకపోవడం రాజస్థాన్ చేసిన తప్పు అని కూడా పరిశీలకులు అంటుంటారు.
అశ్విన్ కూడా చెయ్యేసుంటే...
రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కూడా చేస్తాడని తెలుసు. అలా ఈ ఏడాది తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. టిపికల్ టెయిలెండర్లా కాకుండా, సరైన ఆల్రౌండర్లా ఆడాడు. అయితే ఈ క్రమంలో బౌలింగ్లో పట్టుసడలింది అని చెప్పాలి. 17 మ్యాచ్ల్లో కేవలం 12 వికెట్లే తీశాడు. ఓవైపు యుజ్వేంద్ర చాహల్ 27 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచినా.. అతడు విఫలమైనప్పుడు లేదంటే వికెట్లు తీయలేనప్పుడు అశ్విన్ ఓ చెయ్యి వేయాల్సింది. కానీ అశ్విన్ నుంచి ఆ స్థాయి బౌలింగ్ ప్రదర్శన ఈ ఏడాది రాలేదు. పరుగులు నియంత్రించినా వికెట్లు అంతగా తీయలేకపోయాడు.
నలుగురే ఆడాలా...
రియాన్ పరాగ్ లాంటి యంగ్ ప్లేయర్ ఉన్నప్పటికీ సంజూ శాంసన్ కీలక సమయాల్లో రవిచంద్రన్ అశ్విన్ను ఆర్డర్లో పైకి తీసుకొచ్చి ఆడించాడు. అశ్విన్ మీద నమ్మకం ఒక కారణమైతే.. పరాగ్ ఆట మీద నమ్మకం లేకపోవడమూ ఓ కారణం అని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే మిడిలార్డర్కి, టెయిలెండర్లకు అనుసంధానంగా ఉండాల్సిన లోయరార్డర్ ఈ సిరీస్లో రాజస్థాన్కి పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. కరీబియన్ హిట్టర్ హెట్మయర్, ఇండియన్ యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఆశించిన మేర రాణించలేదు. రూ.3.8 కోట్లకు రాజస్థాన్ అతడిని కైవసం చేసుకుంది. కానీ పరాగ్ మాత్రం 132 పరుగులే చేశాడు. మరోవైపు హెట్మయర్ 204 పరుగులు చేశాడు. దీంతో జట్టుకు అవసరమైన సాయం చేయలేకపోయారు.
అందరి దారిలో వెళ్లకుండా...
2022 ఐపీఎల్లో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. పొట్టి క్రికెట్లో ఛేజింగ్ చేయడమే విజయరహస్యం అని ఫ్రాంచైజీలు అనుకోవడమే దీనికి కారణం. కానీ రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫైనల్లో అందరి దారిలో వెళ్లకుండా కొత్తగా ప్రయత్నించాడు. ఛేజింగ్లో ఒత్తిడికి చిత్తవుతామనే భయమో లేక పిచ్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కానీ... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోయిన హార్దిక్ పాండ్యకు ఇది నెత్తిన పాలు పోసినట్లయింది. అవకాశాన్ని గట్టిగా పట్టుకున్న పాండ్య ఆండ్ కో వరుస వికెట్లు తీసి శాంసన్ నిర్ణయం ఎంత తప్పో నిరూపించారు.
అన్ని ప్రయత్నాలు చేసి...
రాజస్థాన్కి సంజూ శాంసన్ 2021లో కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్ ఏ మాత్రం కలసి రాలేదు. 14 మ్యాచ్ల్లో కేవలం ఐదింట గెలిచి ఏడో స్థానంలో నిలిచిపోయింది. అలాంటి జట్లు ఈ ఏడాది రెండో స్థానానికి వచ్చింది. అంటే సంజూ శాంసన్ ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. చాలావరకు కూల్ అండ్ కామ్గా కనిపించే శాంసన్.. తను ఆడాడు, ఆడించాడు... కానీ జట్టుకు కప్ తీసుకురాలేకపోయాడు. ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేయించాలనే అప్రకటిత నియమం పెట్టుకుని, వేరియేషన్లు లేక కొన్ని మ్యాచ్లు చేజార్చుకున్నాడు. ఇది కెప్టెన్సీ లోపమే అంటున్నారు క్రీడా పండితులు.
ఏదైతే ఏముంది ఈ ఏడాది టోర్నీ గెలిచి తమ మొదటి కెప్టెన్ షేన్ వార్న్కి నివాళి ఇద్దామనుకున్న రాజస్థాన్ ఆశ నెరవేరలేదు. కొత్త ఏడాదిలో శాంసన్ కొత్త ఆలోచనలతో వస్తాడని ఆశిద్దాం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..