5జీ ఫోన్ కొనాలా..ఇదిగో జాబితా..!
టెక్నాలజీ పరంగా ఇతర దేశాలతో పోటీపడుతోంది భారత్. ఇందులో భాగంగా వేగవంతమైన డేటా సేవలను అందించేందుకు టెలికాం నెట్వర్క్ కంపెనీలు తమ పరికరాలను సిద్ధం చేస్తున్నాయి. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు కూడా 5జీ నెట్వర్క్ స్మార్ట్ఫోన్లను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి....
ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ పరంగా ఇతర దేశాలతో పోటీపడుతోంది భారత్. ఇందులో భాగంగా వేగవంతమైన డేటా సేవలను అందించేందుకు టెలికాం నెట్వర్క్ కంపెనీలు తమ పరికరాలను సిద్ధం చేస్తున్నాయి. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు కూడా 5జీ నెట్వర్క్ స్మార్ట్ఫోన్లను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే ఈ టెక్నాలజీతో ఫోన్ తయారీ అనేది ఖర్చుతో కూడుకున్నది కావడంతో మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్లను ఎక్కువ ధర విక్రయించడం ప్రారంభించాయి. దీంతో 5జీ ఫోన్ అనేది సామాన్యుడి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ విడిభాగాలను ఉత్పత్తి చేసే కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ మొబైల్స్ని అందించే దిశగా దృష్టి సారించాయి. దీంతో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రాకముందే 5జీ ఫోన్లకు మార్కెట్లో డిమాండ్ మొదలయింది. మరి ఇప్పటివరకు భారత మార్కెట్లోకి వచ్చిన 5జీ ఫోన్లు ఏవి?.. అలానే రాబోయే 5జీ మోడల్స్ ఏంటనేది ఓ లుక్కేద్దాం రండి.
యాపిల్ ఐఫోన్ 12 (Apple iPhone 12)
యాపిల్ ఈ సిరీస్లో మొత్తం నాలుగు ఫోన్లను విడుదల చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్, ఐఫోన్ 12 మినీ. ధర, ఫీచర్ల పరంగా వీటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ఈ ఫోన్లు 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. ఇందుకోసం వీటిలో యాపిల్ ఫ్లాగ్షిప్ ఏ 14 బయోనిక్ చిప్ను ఉపయోగించారు. నెట్వర్క్ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి 4జీ/5జీకి మారేందుకు వీలుగా ఈ ఫోన్లలో స్మార్ట్ డేటా మోడ్ ఉంది. అన్నింటిలోనూ సూపర్ రెటినా ఎక్స్డీఆర్ డిస్ప్లే ఇస్తున్నారు. అయితే ధర పరంగా ఐఫోన్ 12 మినీ రూ. 69,900, ఐఫోన్ 12 రూ. 79,900, ఐఫోన్ 12 ప్రొ రూ. 1,19,900, ఐఫోన్ ప్రొమ్యాక్స్ రూ 1,29,000.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా (Samsung Galaxy Note 20 Ultra)
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్లో రెండు మోడల్స్ను తీసుకొచ్చింది. వీటిలో గెలాక్సీ నోట్ 20 అల్ట్రా మోడల్ మాత్రమే 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎగ్జినోస్ 990 ప్రాసెసర్ను ఉపయోగించారు. 6.9-అంగుళాల డబ్ల్యూహెచ్డీ ఇన్ఫీనిటీ ఓ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఎడ్జ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఫోన్తో పాటు ఎస్-పెన్ అదనం. 8జీబీ ర్యామ్/256జీబీ అంతర్గత స్టోరేజి వేరియంట్ ధర రూ. 1,04,999. శాంసంగ్ తొలి మడతబెట్టే ఫోన్ జెడ్ ఫోల్డ్2 కూడా 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 1,49,999.
వివో ఎక్స్50 ప్రో (Vivo X50 Pro)
వివో భారత్ మార్కెట్లో అందిస్తున్న తొలి 5జీ ఫోన్. ఇందులో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 76 5జీ ప్రాసెసర్ను ఉపయోగించారు. 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్/128జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్లో ఈ ఫోన్ లభిస్తుంది. దీని ధర రూ. 49,990.
షావోమి ఎంఐ 10టీ 5జీ (Xiaomi Mi 10T 5G)
షావోమి కంపెనీ ఎంఐ 10టీ సిరీస్లో రెండు ఫోన్లను విడుదల చేసింది. ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో. ఈ రెండు మోడల్స్ 5జీ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తాయి. వీటిలో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ను ఉపయోగించారు. 6.67-అంగుళాల ట్రూకలర్ డాట్ డిస్ప్లే ఇస్తున్నారు. 10టీ 6జీబీ ర్యామ్/128జీబీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 10టీ ప్రో 8జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 35,999.
వన్ప్లస్ 8 అండ్ నార్డ్ (OnePlus 8 & Nord)
వన్ప్లస్ భారత మార్కెట్లోకి నాలుగు 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. వన్ప్లస్ 8 సిరీస్, వన్ప్లస్ నార్డ్. వన్ప్లస్ 8 సిరీస్లో మూడు వేరియంట్లున్నాయి. వన్ప్లస్ 8, 8 ప్రో, 8టీ. మూడు వేరియంట్లలో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ను ఉపయోగించారు. నార్డ్ మోడల్లో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 765జీ ప్రాసెసర్ను ఉపయోగించారు. వన్ప్లస్ నార్డ్లో 6.44-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. 8 (6.55-అంగుళాలు), 8ప్రో (6.78-అంగుళాలు), 8టీ (6.55-అంగుళాలు)లో అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. వన్ప్లస్ 8 సిరీస్ ధర రూ, 41,999 నుంచి ప్రారంభమవుతుంది. 6జీబీ ర్యామ్/128జీబీ, 8జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్లలో లభిస్తాయి. ఇక వన్ప్లస్ నార్డ్ ప్రారంభ ధర రూ. 24,999. 6జీబీ ర్యామ్/64జీబీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 12జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్లలో ఈ మోడల్ లభిస్తుంది.
అసుస్ రోగ్ ఫోన్ 3 (Asus ROG Phone 3)
అసుస్ నుంచి వచ్చిన తొలి 5జీ ఫోన్ ‘రోగ్ ఫోన్ 3’. గేమర్స్ కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ ఫోన్లో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్ను ఉపయోగించారు. 6.59-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్/128జీబీ, 12జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 46,999.
మోటో రేజర్ 5జీ (Moto Razr 5G)
మోటోరోలా అందిస్తున్న తొలి ఫోల్డింగ్ ఫోన్. అంతేకాదు రేజర్ 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 76 ప్రాసెసర్ను ఉపయోగించారు. 6.2-అంగుళాల ఫోల్డింగ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో పాటు 2.7-అంగుళాల జీఓఎల్ఈడీ క్విక్ వ్యూ డిస్ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్లో లభిస్తుంది. దీని ధర రూ. 1,24,999.
త్వరలో భారత మార్కెట్లో విడుదలకానున్న 5జీ ఫోన్లు..
రెడ్మీ నోట్ 9 5జీ (Redmi Note 9 5G)
రెడ్మీ నుంచి వస్తున్న తొలి 5జీ ఫోన్. నోట్ 9 ప్రో 5జీ, నోట్ 9 5జీ పేరుతో తీసుకొస్తున్నారు. ఈ రెండు మోడల్స్ 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తాయి. నోట్ 9 ప్రో 5జీలో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్ను, నోట్ 9 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్ను ఉపయోగించారు. నోట్ 9 ప్రో 5జీ ఫోన్లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, నోట్ 9 5జీలో 6.53-అంగుళాల ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే ఇస్తున్నారు. రెండు మోడల్స్ 6జీబీ ర్యామ్/128జీబీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 8జీబీ ర్యామ్/256 జీబీ వేరియంట్లలో లభిస్తాయి. చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లను భారత మార్కెట్లో రూ.20,000 లోపు ధరలో విడుదలచేయాలని కంపెనీ భావిస్తోందట. ఒకవేళ అదే జరిగితే అతి తక్కువ ధరలో లభించే తొలి 5జీ ఫోన్ ఇదే.
రెడ్మీ కే30 ప్రో (Redmi K30 Pro)
రెడ్మీ నుంచి వస్తున్న మరో 5జీ ఫోన్ కే30 ప్రో. క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ను ఉపయోగించారట. 6.67-అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారట. చైనా మార్కెట్లో 6జీబీ ర్యామ్/128జీబీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 8జీబీ/256జీబీ, 12జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. భారత్లో ఎన్ని వేరియంట్లో లభిస్తుందనే దానిపై పూర్తి సమాచారం లేదు. ధర రూ. 30,000 నుంచి ప్రారంభం కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
వన్ప్లస్ నార్డ్ 10 5జీ (OnePlus Nord 10 5G)
వన్ప్లస్ నుంచి భారత మార్కెట్లోకి వస్తున్న మరో 5జీ ఫోన్. ఇందులో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 690 5జీ ప్రాసెసర్ను ఉపయోగించారు. 6.49-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారని సమాచారం. 6జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారట. ధర రూ.30,000లోపు ఉంటుందట.
మోటో జీ 5జీ (Moto G 5G)
తక్కువ ధరలో 5జీ ఫోన్ తీసుకురావాలనే లక్ష్యంతో మోటోరోలా జీ 5జీ ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇందులో క్వాల్కోమ్ 765 5జీ ప్రాసెసర్ను ఉపయోగించారు. 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ సినిమా విజన్ డిస్ప్లే ఇస్తున్నారు. 4జీబీ ర్యామ్/64జీబీ, 6జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ధర రూ. 30,000లోపు ఉంటుందని సమాచారం.
వివో వి20 ప్రో (Vivo V20 Pro)
డిసెంబర్ 2 తేదీన ఈ ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇది 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 765జీ ప్రాసెసర్ను ఉపయోగించారు. 8జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్ ధర రూ. 30,000లోపు ఉంటుందని తెలుస్తోంది.
గూగుల్ పిక్సెల్ 5 (Google Pixel 5)
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటలో ఉంది. 5జీ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తుంది. క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 730జీ ప్రాసెసర్ను ఉపయోగించారు. 5.81-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారు. 6జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్ ధర రూ. 31,999 ఉంటుందని అంచనా. త్వరలో భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవే కాకుండా రిలయన్స్ జియో, శాంసంగ్, రియల్మీ కంపెనీలు కూడా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్లను తీసుకురానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్లా వాడుకుంటే సరి. మ్యాక్లోనైతే- ఫొటో బూత్ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్ను వెబ్క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్టాప్లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్వర్డ్ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్వర్డ్లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్ను అమ్ముతున్నారా?
ప్రింటర్తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్బాట్స్ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!