Olympic Medals: అన్నీ ‘వ్యర్థ’ పతకాలే!
నీరజ్ చోప్రా బంగారు పతకం, మీరాబాయి చాను వెండి పతకం, పి.వి. సింధు కాంస్య పతకం.. ఇలా టోక్యో ఒలింపిక్స్లో ఎందరెందరో క్రీడాకారులు ఎన్నెన్నో పతకాలు గెలుచుకున్నారు. అవన్నీ
నీరజ్ చోప్రా బంగారు పతకం, మీరాబాయి చాను వెండి పతకం, పి.వి. సింధు కాంస్య పతకం.. ఇలా టోక్యో ఒలింపిక్స్లో ఎందరెందరో క్రీడాకారులు ఎన్నెన్నో పతకాలు గెలుచుకున్నారు. అవన్నీ ఎలా తయారయ్యాయో తెలుసా?
టోక్యో ఒలింపిక్ క్రీడల పతకాలన్నీ ‘వ్యర్థ’ పతకాలే! క్రీడాకారులంతా ఎంతో కష్టపడి, ఎంతగానో పోరాడి పతకాలు సాధిస్తే అలా అంటారేంటని అనుకుంటున్నారా? దీనర్థం నిష్ఫలమని కాదు. వ్యర్థాలతో తయారైనవేనని. అవును. టోక్యో ఒలింపిక్స్లో విజేతలకు బహూకరించిన పతకాలన్నీ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి తయారైనవే మరి. వీటిని సేకరించటం దగ్గర్నుంచి తయారు చేయటం వరకూ ఆద్యంతమూ ఆసక్తికర క్రీడల మాదిరిగానే సాగింది.
పాత మొబైళ్లు, ల్యాప్టాప్ల వంటి పరికరాలతో పోగుపడుతున్న ఇ-వ్యర్థం అంతా ఇంతా కాదు. ప్రపంచానికిది కొత్త చెత్త తిప్పలు తెచ్చిపెడుతోంది. నిజానికి పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి వంటి లోహాలుంటాయి. కానీ చాలామంది వీటిని పారెయ్యటమో, కాల్చేయటమో చేస్తుంటారు. వీటిని విడగొట్టి, సంగ్రహించగలిగితే బోలెడంత బంగారాన్ని, వెండిని వెలికితీయొచ్చు. అందుకే ఇ-వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే దిశగా జపాన్ వినూత్నంగా ఆలోచించింది. ఒలింపిక్స్ పోటీల్లో విజేతలకు బహూకరించే పతకాలన్నింటినీ ఇ-వ్యర్థాల నుంచే తయారుచేయాలని సంకల్పించి, విజయం సాధించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రెండేళ్ల పాటు బృహత్తర ఉద్యమమే నడిపించింది. పాత ఎలక్ట్రానిక్ పరికరాలను దానం చేయాలని కోరటం ప్రజలనూ ఆలోచింపజేసింది. ఒలింపిక్ క్రీడల్లో తామూ భాగస్వామ్యం అవుతున్నామనే భావనతో సమరోత్సాహంతో పాల్గొన్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలనే తేడా లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు పాత మొబైళ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లను ఇచ్చేశారు.
32 కిలోల బంగారం
ప్రజలు దానం చేసిన పాత ఫోన్లు, ల్యాప్టాప్లతో సుమారు 80 టన్నుల వ్యర్థాలు పోగుపడ్డాయి. వీటిని విడగొట్టి, శుద్ధిచేస్తే ఎంత బంగారం వెలికి వచ్చిందో తెలుసా? 32 కిలోలు! అంతేనా? 3,492 కిలోల వెండి, 2,199 కిలోల కాంస్యం (కంచు) కూడా లభించింది. మొత్తం ఒలింపిక్ పతకాలన్నింటినీ వీటితోనే తయారు చేశారు. ఇలా మొత్తం ఒలింపిక్ పతకాలన్నింటినీ పునర్వినియోగ లోహాలతోనే రూపొందించిన మొట్టమొదటి దేశం జపానే. నిజానికిది కొత్త ఆలోచనేమీ కాదు. రియోలో 2016లో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగానూ కారు విడిభాగాలు, అద్దం ఉపరితలాల నుంచి వెండిని సేకరించారు. దీంతోనే 30% పతకాలు తయారు చేశారు.
పెద్ద ఉపద్రవం
ఇ-వ్యర్థాలు పర్యావరణానికి సరికొత్త శత్రువుగా మారాయి. ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 5.36 కోట్ల టన్నుల ఇ-వ్యర్థం పోగయ్యింది! ఇది 350 మహా భారీ నౌకల సైజుకు సమానం. ఇ-వ్యర్థాలు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో ఐదొంతుల కన్నా ఎక్కువగా పెరిగాయి. ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ పెరగటం, ఇవి అంత ఎక్కువకాలం మన్నక పోవటం, మరమ్మతుకు అవకాశాలు తక్కువగా ఉండటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో సక్రమంగా సేకరణ కేంద్రాలకు, విడగొట్టటానికి వస్తున్నవి ఐదో వంతు కన్నా తక్కువే. ఇ-వ్యర్థాల వెల్లువను అడ్డుకోకపోతే మున్ముందు పర్యావరణాన్ని పెద్ద దెబ్బే తీస్తుంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రయత్నం కొత్త మార్గం చూపుతోంది. పారిస్లో 2024లో జరగనున్న ఒలింపిక్స్లో ఇది మరింత ఊపందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే తదుపరి ఒలింపిక్స్ ముఖ్య నినాదాలు ‘సామాజిక మార్పు, పర్యావరణ సంరక్షణను ప్రోత్సహించటమే’ మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్జీపీటీ
ఛాట్జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
ఎక్స్లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?