ఆ పలకరింపులకై అన్వేషణ!
అనంత విశ్వం.. భూమిపై మనం. నక్షత్ర వ్యవస్థల నుంచి కాంతి వేగంతో అంతుచిక్కని సంకేతాలు!! అవి మనల్ని పలకరించేందుకేనా? విశ్వంలో ఎక్కడైనా మనలాంటి బుద్ధి జీవులు ఉన్నారా? ఉంటే.. మనతో ఏదైనా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారా?.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి....
సైన్స్ సంగతులు
అనంత విశ్వం.. భూమిపై మనం. నక్షత్ర వ్యవస్థల నుంచి కాంతి వేగంతో అంతుచిక్కని సంకేతాలు!! అవి మనల్ని పలకరించేందుకేనా? విశ్వంలో ఎక్కడైనా మనలాంటి బుద్ధి జీవులు ఉన్నారా? ఉంటే.. మనతో ఏదైనా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారా?.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఫలితంగా గ్రహాలు దాటుకుని మనిషి విశ్లేషణ నక్షత్ర మండలాల వరకూ చేరుకుంది. ఇదిలా ఉండగా.. మన పొరుగు గ్రహమైన అంగారకుడిపైనే అందరి దృష్టి పడింది. ఇప్పుడు నాసా పంపిన పర్సెవరెన్స్ మార్స్పై దిగి మరిన్ని విశ్లేషణలు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో జీవరాశి జాడలపై మరింత ఆసక్తి నెలకొంది!
జీవరాశికి మూలం జీవకణం. అది గ్రహించిన ఆహారంతో మెటబాలిజమ్ జరిపి జీవాన్ని నిలుపుతుంది. అంతేకాదు.. తనలాంటి మరొక దాన్ని పునరుత్పత్తి చేయగలదు. కాలంతో పాటు జరిగే మార్పుల ఫలితంగా ఈ జీవకణం నుంచి బుద్ధి జీవులు ఆవిర్భవిస్తారు. ఈ సిద్ధాంతమే ఇతర నక్షత్ర, గ్రహవ్యవస్థలపై జీవరాశి ఉంటుందనే ఆశకు ప్రాణం పోస్తోంది. ఇలా జరగడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టొచ్చేమోగానీ.. భూమిపై జరిగింది కూడా ఇదే. భూపరిణామ క్రమంలో సహజసిద్ధమైన రీతిలోనే జీవపరిణామం జరిగింది. ఇదే మాదిరిగా భూమిని పోలిన ఇతర అంతరిక్ష వస్తువులపైన కూడా ఇలాంటి పరిణామమే జరగడం సహజమైన విషయమే అవుతుందనేది శాస్త్రవేత్తల అంచనా.
మొదలైన అన్వేషణ..
మన భూగ్రహానికి ఇతర నక్షత్ర వ్యవస్థల నుంచి సంకేతాలు కాంతి వేగంతో వస్తున్నాయి. భూమిపై ఉన్నవారిని పలకరించేందుకే అన్యగ్రహవాసులు ఎవరైనా పంపుతున్నారేమోనని సందేహం. మరి, వాటిని గుర్తించాలంటే? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. దీంట్లో భాగంగానే 1972లో అమెరికా ‘పయొనీర్-10’ వ్యోమనౌకను ప్రయోగించింది. అది మనిషికి తెలిసిన అన్ని గ్రహాలనూ దాటుకుని సుదూర విశ్వంలోకి చేరుకుంది. అంటే.. రోదసీ కుహరం నుంచి సంకేతాలు పంపింది. 2003, జనవరి 22న ఆఖరి సందేశం పంపింది. తర్వాత అది పంపే సంకేతాలు మనకు చేరనప్పటికీ.. పయొనీర్ మాత్రం పాలపుంత కేంద్రం వైపు దూసుకువెళుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ప్రయత్నంగా అమెరికా పంపిన పయొనీర్-2 కూడా మరొక దశలో సౌరకుటుంబంలోకి దూసుకెళ్లింది. తర్వాత అనంత విశ్వంలో ఎక్కడైనా బుద్ధి జీవులు తారసపడితే వారికి అర్థమయ్యేలా మన సందేశాలు కనిపించడం కోసం బంగారు తాపడం చేసిన అల్యూమినియం పలక మీద గ్రాఫిక్ మెసేజ్ రాసి ‘పయొనీర్-10’ వ్యోమనౌకని పంపారు. ఇంత వరకూ దానికి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా ప్రపంచ దేశాలు పలు అంతరిక్ష నౌకల్ని ప్రయోగిస్తూ లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించేలా చేసి.. ఇతర గ్రహాలపై జీవరాశి ఉనికిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
వాయేజర్ విశేషాలు..
తొలిసారి శనిగ్రహాన్ని క్లిక్ మనిపించిన ఘనత వాయేజర్-1కి దక్కుతుంది. 1977, సెప్టెంబరు 5న అమెరికా దీన్ని ప్రయోగించింది. ఇది సుమారు ఏడాది పాటు ప్రయాణం చేసి శనిగ్రహం ఫొటోలను దానికి 760, 510 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి తీసింది. వాటిని భూమికి పంపింది. తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన వాయేజర్-2 నిర్విరామంగా 300 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి యురేనస్ గ్రహానికి చేరువలోకి వెళ్లిన తొలి అంతరిక్షనౌకగా చరిత్ర సృష్టించింది. 2020నాటికి అది సౌరకుటుంబం సరిహద్దులు దాటి అంతర్ నక్షత్రమండలంలో ప్రవేశించింది. ఇంతవరకూ మనకు తెలియని ఈ ప్రాంతంలోని విశేషాల్ని తెలుసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు.. అక్కడ జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉన్న గ్రహంపై ఆవిరి జాడలు ఉన్నట్లు గుర్తించారు. దానికి సూపర్ ఎర్త్ అని, కే2-18బీగా నామకరణం చేశారు. ఇది అరుణ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ 110 కాంతి సంవత్సరాల దూరం ఒక కక్ష్యలో భ్రమణం చేస్తోందని గమనించారు. మనదేశం ఈ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఇతర దేశాలకు దీటుగానే అంతరిక్ష ప్రయోగానికి నాంది పలికింది. 1963, నవంబరు 21న తుంబా నుంచి తొలి సౌండింగ్ రాకెట్ను ప్రయోగించడంతో భారత్ అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.
పోలిక కుదిరింది..
సౌరకుటుంబంలో ఉన్న ఎనిమిది గ్రహాల్లో కేవలం బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు మాత్రమే శిలామయ గ్రహాలు. వీటికి సాంద్రత ఎక్కువ. గురువు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు పెద్దగా ఉన్నప్పటికీ వీటికి సాంద్రత తక్కువ. వీటిని ఉన్నత గ్రహాలు అని పిలుస్తారు. భూమికి పొరుగు గ్రహమైన శుక్రుడి వాతావరణంలో 96 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంది. అంతేకాదు.. దీనిపై ఉన్నంత వేడి మరే ఇతర గ్రహంపైనా లేదు. దాని ఉపరితల ఉష్ణోగ్రత 462 డిగ్రీల సెల్సియస్. దీంతో శుక్రుడిపై జీవరాశి ఉండే అవకాశం చాలా తక్కువ. ఇక మనకి ఇరుగు గ్రహమైన అంగారకుడిపైకి వెళ్తే.. 1996లో నాసా ఒకప్పుడు జీవం ఉండేదని ప్రకటించింది. దీంతో అందరి దృష్టి దానిపై పడింది. ఒకప్పుడు అక్కడ నీరు, వాతావరణం ఉండేదని.. సూర్యరశ్మిని గ్రహించి జీవరాశి మనుగడకు వీలైన పరిస్థితులు నెలకొని ఉండొచ్చని అంచనా వేశారు. తర్వాత 1996, డిసెంబరు 4న ‘పాత్ఫైండర్’ను అంగారక గ్రహంపైకి పంపారు. సుమారు ఎనిమిది నెలలు ప్రయాణించి మార్స్పై వాలింది. అప్పుడు పంపిన ఫొటోల ఆధారంగా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం మార్స్పై ఊహకందని రీతిలో వరదలు సంభవించినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘పర్సెవరెన్స్’ను ప్రయోగించింది. గత ఏడాదిలో జులై 30న నింగికి ఎగసిన రోవర్ 203 రోజులు ప్రయాణం చేసి అంగారకుడిపై వాలింది. రాబోయే రెండేళ్ల పాటు పర్సెవరెన్స్ అక్కడ తవ్వకాలు చేపట్టి మట్టి నమూనాల్ని సేకరిస్తుంది. వాటిని నాసా త్వరలో భూమికి తీసుకొచ్చి పరీక్షించనుంది.
పొరుగు గ్రహ ప్రయాణాలెందుకు?
అన్య గ్రహాల నుంచి వస్తున్న సంకేతాల్ని కనిపెట్టేందుకు ఆకాశంలో అత్యాధునిక సాంకేతిక ప్రక్రియల సహాయంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అంటే... సౌరకుటుంబం వెలుపల గ్రహాంతర వాసుల కోసం గత 55 ఏళ్లగా విశ్లేషణ సాగుతోంది. ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. భూమిని చేరుతున్న విశ్వకిరణాలు, ఇతర వికిరణాల తీవ్రత గురించి అధ్యయనం చేయడమే లక్ష్యంగా అంతరిక్ష ఉపగ్రహాల్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. ఆయా గ్రహాల్లో సహజవనరుల అన్వేషణతో పాటు నక్షత్ర మండలాల పరిశోధన సాధ్యం అవుతుంది. సైనిక, గూఢచారి కార్యకలాపాలకు తోడ్పడుతున్నాయి. సాగరాల అడుగున ఉన్న ఖనిజ సంపదల్ని తెలుసుకునేందుకు దోహదపడుతున్నాయి. మరోవైపు.. గ్రహాంతరసీమలకు ప్రయాణికుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలైనప్పటికీ.. ఇప్పటికైతే ఎలాంటి అంతరిక్షనౌకలు ఇంకా తయారు కాలేదు. ఇతర గ్రహవాసులు ప్రయోగించే నౌకలు, మన టెక్నాలజీ ఊహాశక్తికి అందని విధంగా ఉంటాయా? అసలు అవెలా ఎగురుతాయి. వాటిని గుర్తించడం ఎలా? అనే విషయంలోనూ ఖగోళ శాస్త్రవేత్తలు అతిపెద్ద టెలిస్కోపులతో ఆకాశంలోకి తొంగి చూస్తున్నారు. అటువంటి అంతరిక్ష నౌకల కోసం ఆకాశంలోని అణువణువునూ గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
-
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు