చిపంతర్యామి!
చిప్ సర్వాంతర్యామి! అతిశయోక్తిలా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. కంప్యూటర్ల దగ్గర్నుంచి కార్ల వరకూ.. ఫోన్ల దగ్గర్నుంచి ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల వరకూ.. వాషింగ్ మిషన్ల దగ్గర్నుంచి రిఫ్రిజిరేటర్ల వరకూ ఏది పనిచేయాలన్నా మైక్రోచిప్ తప్పనిసరి. కొవిడ్ విజృంభణతో సెమీ కండక్టర్
చిప్ సర్వాంతర్యామి! అతిశయోక్తిలా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. కంప్యూటర్ల దగ్గర్నుంచి కార్ల వరకూ.. ఫోన్ల దగ్గర్నుంచి ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల వరకూ.. వాషింగ్ మిషన్ల దగ్గర్నుంచి రిఫ్రిజిరేటర్ల వరకూ ఏది పనిచేయాలన్నా మైక్రోచిప్ తప్పనిసరి. కొవిడ్ విజృంభణతో సెమీ కండక్టర్ చిప్ల కొరత మూలంగా ఏకంగా పరిశ్రమలు స్తంభించే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏమిటీ మైక్రోచిప్ మహాత్మ్యం? దీన్ని ఎలా తయారుచేస్తారు? ఎలా పనిచేస్తుంది?
కొన్ని ఆవిష్కరణలు శాస్త్రరంగంలో ఎప్పటికీ మేలి మలుపులుగా నిలిచిపోతాయి. ఆవిరి యంత్రం, విద్యుత్తు, విమానం.. ఇలా ఒకోటీ ఒకో అభివృద్ధి ఘట్టానికి బీజం వేసినవే. మైక్రోచిప్ కూడా అలాంటి గొప్ప ఆవిష్కరణే. సమాచార సాధన స్రవంతితో మమేకమైన ఆధునిక ప్రపంచం మొత్తం దీని మీదే నడుస్తోంది మరి. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, సర్వర్లు, మోషన్ డిటెక్టర్లు, డిజిటల్ వాచ్లు, ఏటీఎంలు, వీడియోగేమ్లు.. ఒక్కటేమిటి? అన్నిరకాల ఎలక్ట్రానిక్ పరికరాల గుండెకాయ ఇదే. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, మోనోలితిక్ సర్క్యూట్, మైక్రోచిప్, సెమీ కండక్టర్, తేలికగా చిప్. ఇలా దీనికి చాలా పేర్లే ఉన్నాయి. చూడ్డానికి చిన్నదే కావొచ్చు గానీ దీని మీద బోలెడన్ని ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, కెపాసిటర్లు ఉంటాయి. ట్రాన్సిస్టర్లు మీటల మాదిరిగా విద్యుత్తును ఆన్, ఆఫ్ చేస్తుంటాయి. ట్రాన్సిస్టర్ల మధ్య ముందుకూ వెనక్కూ వెళ్లే విద్యుత్తు ప్రసారాన్ని రెసిస్టర్లు నియంత్రిస్తుంటాయి. ఇక కెపాసిటర్లేమో విద్యుత్తును నిల్వ చేసుకొని, విడుదల చేస్తూ ఉంటాయి. ఇలా ఇవన్నీ గోరుకన్నా చిన్నదైన చిప్ మీద ఒదిగిపోయి ఎలక్ట్రానిక్ పరికరాలను నడిపిస్తుంటాయి.
ఇసుకే ఆధారం
ఇంతకీ చిప్లు దేంతో తయారవుతాయి? సిలికా అనే ఇసుక నుంచి పుట్టుకొచ్చిన సిలికాన్తో. దీనికి విద్యుత్తును ప్రసారం చేసే, నిలువరించే గుణముంది. అంటే సెమీకండక్టర్ మాదిరిగా పనిచేస్తుందన్నమాట. కంప్యూటర్లు, కంప్యూటర్ భాగాలు రోజురోజుకీ చిన్నగా అవటానికి దోహదం చేస్తున్నవి ఈ సెమీకండక్టర్ పదార్థాలే. వీటిల్లో ప్రధానమైంది సిలికానే. ఫొటో లిథోగ్రఫీ ప్రక్రియ ద్వారా సిలికాన్ను పొరలుగా పరుచుకుంటూ చిప్లను రూపొందిస్తుంటారు. ముందుగా కాంతికి స్పందించే రసాయనంతో కూడిన ఉపరితలం మీద సిలికాన్ డయాక్సైడ్ను పొరలుగా పోస్తారు. అతి నీలలోహిత కాంతి ప్రభావానికి గురైనప్పుడు దీనిపై ఉబ్బెత్తుగా 3డీ ఆకారంలో సర్క్యూట్ డిజైన్ ఏర్పడుంది. కాంతి తగిలిన భాగం గట్టిపడుతుంది. మిగిలిన మెత్తటి భాగాలను గ్యాస్తో తొలగిస్తారు. చిప్ పొరల మీద ట్రాన్సిస్టర్లను, తీగలను అమర్చి.. సన్నటి లోహపు (అల్యూమినియం) పోతలతో అనుసంధానం చేస్తారు. (బాక్సులో సవివరంగా..)
అత్యంత శుద్ధమైన సిలికాన్ క్వార్ట్జ్ రాళ్లలో లభిస్తుంది. ఉత్తర కరోలినాలోని స్ప్రూస్ పైన్ క్వారీలో శుద్ధమైన క్వార్ట్జ్ ఉంటాయి.
రెండు రకాలు
మైక్రోచిప్లు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి- సమాచారాన్ని నిల్వ చేసుకునే మెమరీ చిప్స్. రెండు- సహేతుకంగా విశ్లేషించే లాజిక్ చిప్స్. కంప్యూటర్లకే కాదు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాల మెదడులా ఉపయోగపడేవి ఈ లాజిక్ చిప్సే. 1960ల్లోనే అమెరికా వైమానిక దళం క్షిపణుల తయారీలోనూ వీటిని వాడుకుంది. అపోలో ప్రాజెక్టు కోసమూ నాసా వీటిని ఉపయోగించింది. టెలివిజన్లు, జీపీఎస్ పరికరాలు, ఐడీ కార్డులు.. చివరికి క్యాన్సర్ వంటి జబ్బులను త్వరగా గుర్తించటానికి వైద్యరంగంలోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం అందరి చేతి పరికరంగా మారిన స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగానికి తోడ్పడుతున్నవీ ఇవే. ఎలక్ట్రానిక్ పరికరాల వెల్లువతో వీటికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. 2019లో 63,400 కోట్లకు పైగా చిప్లు తయారయ్యాయి! కానీ కరోనా విజృంభణతో వీటి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు అంతా ఆన్లైన్లోనే ఎక్కువగా గడుపుతుండటంతో డిమాండ్ ఇంకా పెరిగిపోయింది. ఫలితంగా చిప్ల కొరత ఏర్పడి, పరిశ్రమలకు ఇక్కట్లు సృష్టిస్తోంది.
తయారీ సునిశితం
మైక్రోచిప్ తయారీ సున్నితమైంది. వీటిని చాలా కచ్చితత్వంతో రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేక పద్ధతిని ఉపయోగిస్తారు.
పొరల తయారీ
సిలికాన్ స్ఫటికాలను పొడవైన సిలిండర్లుగా వృద్ధి చేసి, పలుచటి పొరలను సృష్టిస్తారు. వీటిని చిప్ల మాదిరిగా కత్తిరిస్తారు.
మాస్కింగ్
సిలికాన్ డయాక్సైడ్లో ముంచి పూత పూయటానికి పొరలను వేడిచేస్తారు. అతి నీలలోహిత కాంతి సాయంతో పొరను గట్టి పరుస్తారు (ఫొటోరెసిస్ట్).
ఎచింగ్
ఒక రసాయనం ద్వారా ఫొటోరెసిస్ట్ను తొలగిస్తారు. దీంతో ఎన్-రకం, పి-రకం సిలికాన్ను అమర్చటానికి అవసరమైన డిజైన్ ఏర్పడుతుంది.
డోపింగ్
పొరలను గ్యాస్తో వేడిచేసి సిలికాన్ కుదురుకోవటానికి అనువుగా భాగాలను ఏర్పరుస్తారు.
పరీక్ష
ప్రతీ చిప్నూ పొడవైన లోహ అనుసంధానాలతో పరీక్షిస్తారు. పనిచేయని వాటిని పక్కన పెడతారు.
ప్యాకింగ్
పనిచేస్తున్న చిప్లను పొరల నుంచి కత్తిరించి, భద్రంగా ప్యాక్ చేసి, సరఫరా చేస్తారు.
సెలవులు లభించకపోవటంతో
మొట్టమొదటి మైక్రోచిప్
సృష్టికర్త జాక్ కిల్బీ
కిల్బీ చిప్తోనే ఆగిపోలేదు. పోర్టబుల్ కాలిక్యుటేర్నూ ఆవిష్కరించారు. చిప్ ఆవిష్కరణకు గాను ఆయన 2000 సంవత్సరలో నోబెల్ బహుమతినీ అందుకున్నారు. ఇక రాబర్ట్ నోయిస్ ఇంటెల్ సంస్థను స్థాపించారు. మైక్రోప్రాసెసర్ పుట్టుకొచ్చింది ఇక్కడ్నుంచే.
మైక్రోచిప్లకు 1947లో ట్రాన్సిస్టర్ల ఆవిష్కరణతోనే బీజం పడింది. ఎలక్ట్రాన్లు కొన్ని స్ఫటికాల మీద కొన్ని పరిస్థితుల్లో నిరోధకాలుగా ఏర్పడతాయని విలియం బి.షాక్లే బృందం గుర్తించింది. వీటిని మార్చటం ద్వారా స్ఫటికాల్లో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించొచ్చని కనుగొంది. ఇదే ట్రాన్సిస్టర్ రూపకల్పనకు దారి తీసింది. ఈ పద్ధతితో రెసిస్టర్లు, కెపాసిటర్లు కూడా సృష్టించొచ్చని గుర్తించారు. దీంతో అప్పటివరకు రేడియోలు, టీవీల వంటి వాటిల్లోని వాక్యూమ్ ట్యూబులకు కాలం చెల్లినట్టయ్యింది. ఫలితంగా ఎలక్ట్రానిక్ పరికరాల సైజు గణనీయంగా తగ్గిపోయింది. దీని స్ఫూర్తితోనే జాక్ కిల్బీ అనే ఇంజినీర్ 1958లో ఒకేచోట పలు ట్రాన్సిస్టర్లను అమర్చేలా తొలి చిప్ను ఆవిష్కరించారు. ఆయన అప్పుడే అమెరికాలోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో చేరారు. వేసవి సెలవులను ఆస్వాదించటానికి మిగతా ఉద్యోగులంతా షికారుకు వెళ్లారు. కానీ ఆయనకు అవకాశం లభించలేదు. దీంతో ల్యాబ్లోనే ఉండిపోయారు. మిగతా ఉద్యోగులు సెలవుల నుంచి వచ్చేసరికి తనదైన ఆలోచనతో కొత్తరకం సర్క్యూట్ను సిద్ధం చేశారు. ఎలక్ట్రానిక్ పదార్థాలు స్థిరంగా ఉండటానికి పట్టు స్క్రీన్తో సెరాబిక్ బేస్ సర్క్యూట్ను రూపొందించారు. మైక్రోచిప్కు పునాది ఇదే. అయితే 1959లో రాబర్ట్ నోయిస్ అనే మరో ఇంజినీర్ కూడా ఒకే ముక్క మీద మొత్తం సర్క్యూట్ అమర్చే విధానాన్ని కనుగొన్నారు. దీనికి 1961లో పేటెంట్ కూడా పొందారు. అప్పటికి కిల్బీ దరఖాస్తు ఇంకా పరిశీలనలోనే ఉండి పోయింది. ఇలా ఒకేసారి వేర్వేరు చోట్ల మైక్రోచిప్ పుట్టుకొచ్చింది. అందుకే ఇద్దరినీ మైక్రోచిప్ సృష్టికర్తలుగానే భావిస్తున్నారు. అప్పట్నుంచీ మైకోచిప్ పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. మొదట్లో ఒక చిప్ మీద ఒక ట్రాన్సిస్టర్, మూడు రెసిస్టర్లు, ఒక కంపాక్టర్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఒక చిప్ మీద 12.5 కోట్ల ట్రాన్సిస్టర్లు అమరుస్తున్నారు. ఇవే లేకపోతే కంప్యూటర్లు, టీవీల వంటివి ఇంకా పెద్దగానే ఉండేవి. ఒకప్పుడు కంప్యూటర్ ఏకంగా గదంత పెద్దగా ఉండేది మరి. తొలితరం కంప్యూటర్లలో ఎలక్ట్రిక్ భాగాలను విడివిడిగా సోల్డరింగ్ చేసి సర్క్యూట్ బోర్డు మీద అమర్చేవారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ రాకతో ఇది చాలా తేలికైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్జీపీటీ
ఛాట్జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
ఎక్స్లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు