అంతరిక్షం నుంచి నట్టింటి దాకా
అంతరిక్షమంటే మనిషికి మొదట్నుంచీ ఆసక్తే. విశ్వాంతరాళాన్ని శోధించాలని, గ్రహాంతర యానం చేయాలని ఎప్పుడూ ఉబలాటమే. ఇందుకోసం ఎంతో సాధన సంపత్తిని సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అయితే వీటిల్లో కొన్ని మన నిత్య జీవితంలోనూ భాగమైపోయాయి.
అంతరిక్షమంటే మనిషికి మొదట్నుంచీ ఆసక్తే. విశ్వాంతరాళాన్ని శోధించాలని, గ్రహాంతర యానం చేయాలని ఎప్పుడూ ఉబలాటమే. ఇందుకోసం ఎంతో సాధన సంపత్తిని సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అయితే వీటిల్లో కొన్ని మన నిత్య జీవితంలోనూ భాగమైపోయాయి.
మౌస్ మ్యాజిక్
మౌస్ లేకపోతే డెస్క్టాప్తో పనిచేయటం చాలా కష్టం. అన్నిసార్లూ అందరికీ కీబోర్డుతోనే పనిచేయటం రాదుగా మరి. మొదట్లో దీన్ని వ్యోమనౌకల నియంత్రణ, సిమ్యులేషన్ను సులభం చేయటానికే రూపొందించారు. స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన డౌ ఎంజెల్బార్ట్ దీన్ని తయారుచేసినప్పటికీ.. నిధులు అందించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసానే. చిన్న చెక్కను నున్నటి ఉపరితలం మీద నొక్కినప్పుడు అడుగున ఉండే చక్రాలు కదిలేలా మొదటిసారి మౌస్ను తయారుచేశారు. దీంతో కంప్యూటర్ తెర మీద కర్సర్ కదిలేది. ఎంజెల్బార్ట్ దీన్ని శాన్ఫ్రాన్సిస్కోలో 1968లో జరిగిన కంప్యూటర్ కాన్ఫరెన్స్లో ప్రదర్శించారు. అప్పట్నుంచీ రకరకాలుగా మార్పు చెందుతూ.. చివరికి లేజర్ ట్రాకింగ్తో కూడిన అధునాతన మౌస్గా అభివృద్ధి చెందింది.
సెల్ఫీ సైన్స్
ఇప్పుడు కెమెరాలేని మొబైల్ ఫోన్ను ఊహించుకోవటమే కష్టం. అమెరికా భౌతికశాస్త్రవేత్త ఎరిక్ ఫోజమ్ సృష్టించిన పిక్సెల్ ఇమేజ్ గ్రాహకమే నేటి అధునాతన స్మార్ట్ఫోన్ కెమెరా, వెబ్క్యామ్స్కు బీజం వేసింది. అంతరిక్షంలో గ్రహ యానానికి సరిపడిన చిన్న కెమెరాను తయారుచేయాలనే ఉద్దేశంతోనే ఫోజమ్ దీన్ని రూపొందించారు. అయితే ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుండటంతో అనతికాలంలోనే చాలా పలు పరిశ్రమలు వినియోగించటం ఆరంభించాయి. క్రమంగా ఫోన్ కెమెరాగానూ మారిపోయింది. ఫోజమ్ సృష్టించిన పిక్సెల్ ఇమేజ్ గ్రాహకం కలర్ ఫిల్టర్లు, కాంతిని విద్యుత్శక్తిగా మార్చే ఫొటోడయోడ్ సాయంతో పనిచేస్తుంది. గ్రాహకం మీదుగా కాంతి ప్రసరిస్తున్నప్పుడు.. దాన్ని గ్రాహకం గ్రహించి, విద్యుత్ సంకేతంగా మారుస్తుంది. తర్వాత వివిధ ట్రాన్సిస్టర్లు ఈ విద్యుత్ సంకేతాలను మెరుగుపరుస్తాయి. అనంతరం అవన్నీ ఫొటోగా రూపాంతరం చెందుతాయి.
వాటర్ ఫిల్టర్
నిజానికి ప్రాథమిక స్థాయి వాటర్ ఫిల్టర్లు 50ల నుంచే వాడకంలో ఉన్నాయి. అయితే అపోలో ఉపగ్రహ కార్యక్రమం పరిశోధనతోనే ఆధునిక వాటర్ ఫిల్టర్ అందుబాటులోకి వచ్చింది. విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ పెద్దమొత్తంలో నీరు ఎక్కువకాలం శుభ్రంగా ఉంచేందుకే శాస్త్రవేత్తలు దీన్ని నిర్మించారు. బొగ్గుకు కాలుష్యాలను, నుసిని స్వీకరించే గుణముంది. దీని ఆధారంగానే ప్రత్యేక నీటి వడపోత వ్యవస్థను రూపొందించారు. ఇదో ఆక్సీకరణ ప్రక్రియ. ఇది కర్బన అణువుల మధ్య లక్షలాది రంధ్రాలు తెరచుకునేలా చేస్తుంది. దీంతో బొగ్గు మరింత ఎక్కువగా కలుషితాలను స్వీకరిస్తుంది. ఇదే క్రమంగా మారుతూ నేటి వాటర్ ఫిల్టర్ల ఆవిష్కరణకు దారితీసింది.
శాటిలైట్ టెలివిజన్
టీవీ సంకేతాలను ప్రసారం చేసిన మొట్టమొదటి ఉపగ్రహం టెల్స్టార్ 1. దీన్ని నాసా 1962లో ప్రయోగించింది. అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రయోగాత్మకంగా ఉపగ్రహ సమాచారాలను ప్రసారం చేయటం దీని ఉద్దేశం. ఇది ట్రాన్స్పాండర్ సాయంతో సమాచారాన్ని ప్రసారం చేసేది. చిన్న చిన్న యాంటెనాల ద్వారా అందే మైక్రోవేవ్ తరంగాలను గ్రహించి.. వాటిని ఒక గొట్టం ద్వారా పంపిస్తూ మెరుగుపరచేది. తర్వాత భూమి మీది స్టేషన్లకు ప్రసారం చేసేది. ఈ పరిజ్ఞానానికి నాసా నిరంతరం సానపడుతూ.. ప్రసారమయ్యే సంకేతాల్లో గరగర, ఎర్రర్స్ను తగ్గించేలా అధునాతనంగా తీర్చిదిద్దింది. ఇదే క్రమంగా హెచ్డీ వీడియో, ఆడియో ప్రసారాలకు దారితీసింది.
ఎయిర్ ప్యూరిఫయర్స్
వాయు కాలుష్యం ఆరుబయటి సమస్యే అనుకుంటాం గానీ ఇంట్లోనూ గాలి కాలుష్యం తక్కువేమీ కాదు. బ్యాక్టీరియా, కాలుష్య కారకాల వంటివెన్నో గాలిలో తిరుగాడుతుంటాయి. దీన్ని శుద్ధి చేయటానికి ఎయిర్ ప్యూరిఫయర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి దీనికి బీజం వేసింది అంతరిక్ష పరిశోధనే. అంతరిక్షంలో మొక్కలు అక్కడి వాతావరణాన్ని తట్టుకోవటం కోసమే దీన్ని తయారుచేశారు. ఇది అక్కడ అన్నిరకాల విషతుల్యాలను బాగా వడపోయటంతో నిత్య జీవితంలోకీ వాడకంలోకి వచ్చింది.
గీతలు పడని కళ్లద్దాలు
అంతరిక్షంలో దుమ్ము, ధూళి వ్యోమగాములకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వీటి నుంచి కాపాడుకోవటమెలా? అని నాసా ఇంజినీర్లు ఆలోచిస్తుండగా వజ్రం వంటి కార్బన్ (డీఎల్సి) కంటబడింది. దీన్ని ఉపయోగించి ఓ కొత్తరకం రక్షణ పొరను తయారుచేశారు. హెల్మెట్ అద్దాల మీద పరచగా ఇది మంచి ఫలితం చూపించింది. దీన్ని గుర్తించిన ఒక కళ్లద్దాల కంపెనీ నాసాతో జట్టుకట్టి వినూత్న ప్లాస్టిక్ పొరను రూపొందించింది. దీన్ని అద్దాలకు రక్షణ పొరగా ఏర్పాటు చేయటంతో గీతలు పడటం గణనీయంగా తగ్గిపోయింది. ఇలా గీతలు పడని కళ్లద్దాలు ఆవిష్కృతమయ్యాయి.
పారదర్శక బ్రేసెస్
దంతాల అమరికను సరిచేయటానికి బ్రేసెస్ అమర్చటం చూస్తూనే ఉంటాం. స్టీలు బ్రేసెస్ అయితే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. దీన్ని తప్పించటానికే పారదర్శక బ్రేసెస్ అందుబాటులోకి వచ్చాయి. అసలు ఇది క్షిపణి ట్రాకర్ల మీదుండే ఇన్ఫ్రారెడ్ యాంటెనా రక్షణ కోసమే పుట్టుకొచ్చింది. తేలికగా ఉంటూనే దృఢమైన, మృదువైన, ఉష్ణాన్ని తట్టుకునే పదార్థాన్ని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు పాలీక్రిస్టలిన్ అల్యూమినాను (టీపీఏఐ) సృష్టించారు. దీనికి కాంతిని శోషించుకునే గుణం ఉండటంతో పారదర్శకంగానూ ఉంటుంది. పళ్లను సరిచేయటానికి దంత వైద్యులు సైతం సరిగ్గా ఇలాంటి పదార్థం కోసమే ఎదురుచూస్తున్నారు. టీపీఏఐ గుణాలు సరిగ్గా సరిపోయాయి. ఇంకేముంది? పారదర్శక బ్రేసెస్ను రూపొందించారు. స్టీలు కన్నా గట్టిగా ఉండటం, ఆకర్షణీయంగానూ ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు చాలామంది వీటినే వాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్