టెక్10: ఇన్స్టా కిడ్స్.. ఆగిన వాట్సాప్
ప్రపంచవ్యాప్తంగా టెక్ మరియు గ్యాడ్జెట్ విభాగంలో జరిగిన, వెలువడిన విషయాలు మీ కోసం...
1. చిన్నారుల కోసం కొత్త ‘ఇన్స్టా’
యువతను ఆకట్టుకోవడానికి రకరకాల కొత్త ఆప్షన్లు తీసుకొస్తున్న ఇన్స్టాగ్రామ్... ఇప్పుడు చిన్నారుల మీద దృష్టిసారించింది. మొన్నటిమొన్న 13 ఏళ్ల లోపు పిల్లల ప్రైవసీని కాపేడేలా ఫాలోయింగ్ ఆప్షన్లో మార్పులు ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా వారి కోసం కొత్త ఇన్స్టాగ్రామ్ యాప్నే తయారు చేయబోతోందని వార్తలొస్తున్నాయి. అంటే ‘ఇన్స్టాగ్రామ్ కిడ్స్’ అన్నమాట. ఆరు నుంచి 12 ఏళ్లలోపు వయసున్న పిల్లలు వాడేలా ఈ యాప్ను రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఈ తరహా ఫీచర్తో ‘మెసెంజర్ కిడ్స్’ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ‘ఇన్స్టా కిడ్స్’ ఎప్పుడు వస్తుందనేది తెలియదు.
2. A52, A72 ధరలివే
శాంసంగ్ ఇటీవల యూరప్ మార్కెట్లో గెలాక్సీ ఏ52, ఏ72ను ఆవిష్కరించింది. ఆ మొబైల్ మన మార్కెట్లోకి కూడా వస్తాయనే విషయం తెలిసిందే. తాజాగా ఈ మొబైల్స్ ధరలను సంస్థ ప్రకటించింది. శాంసంగ్ ఏ 52... 6 జీబీ/ 128 జీబీ వేరియంట్ ధర సుమారు ₹26,499. అదే 8జీబీ/ 128 జీబీ ధర ₹27,999. ఇక ఏ72 విషయనికొస్తే... 6 జీబీ/ 128 జీబీ వేరియంట్ ధర సుమారు ₹34,999. అదే 8జీబీ/ 128 జీబీ ధర ₹37,999.
3. స్క్రీన్ రికార్డుకి ‘థ్రెడ్ ఇట్’
మొబైల్స్లో స్క్రీన్ రికార్డు చేయడానికి ఇన్బిల్ట్గా ఆప్షన్ ఇస్తున్నారు. ఒకవేళ కొన్ని మొబైల్స్లో లేకపోతే... థర్డ్ పార్టీ అప్లికేషన్లు ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. అయితే డెస్క్టాప్ కోసం సరైన అప్లికేషన్లు/సాఫ్ట్వేర్లు లేవు. దీంతో గూగుల్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది. ‘థ్రెడ్ ఇట్’ పేరుతో రూపొందిన ఈ సర్వీసు వెబ్సైట్, క్రోమ్ ఎక్స్టెన్షన్ రూపంలో ఇస్తున్నారు. సర్వీసు ఓపెన్ చేసి షేర్ స్క్రీన్ క్లిక్ చేయగానే... స్క్రీన్ రికార్డు మొదలవుతుంది. రికార్డింగ్ పూర్తయ్యాక సెండ్ క్లిక్ చేస్తే... లింక్ రూపంలో ఆ వీడియో సెండ్ అవుతుంది.
4. ట్విటర్లో యూట్యూబ్ చూసేయొచ్చు
ట్విటర్లో యూట్యూబ్ లింక్ ఎవరైనా షేర్ చేసినప్పుడు... దానిని క్లిక్ చేస్తే మళ్లీ యూట్యూబ్లోకి వెళ్లి వీడియో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా అక్కడే వీడియో ప్లే చేస్తే బాగుంటుంది కదా అనిపించిందా? అయితే మీ మాట ట్విటర్ విన్నట్లు ఉంది. ట్విటర్ ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్ వీడియోలు డైరెక్ట్గా ప్లే అయ్యేలా మార్పులు చేస్తోంది. త్వరలో ఐవోఎస్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొంతమంది ఈ ఫీచర్ను వినియోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.
5. వీరికి వాట్సాప్ ఆగిపోయింది
పాత తరం మొబైల్స్లో వాట్సాప్ తన సేవలను క్రమంగా నిలిపేస్తూ వస్తోంది. వాట్సాప్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం ఇకపై వాట్సాప్ ఐవోఎస్ 10 ఆపై వెర్షన్లకే పని చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ విషయానికొస్తే... ఆండ్రాయిడ్ 4.0.3 తర్వాతి వెర్షన్లకే పని చేస్తుంది. ఐవోఎస్ 10 ముందు వెర్షన్లు అంటే... ఐఫోన్ 4ఎస్ మొబైల్స్లో ఇకపై వాట్సాప్ పని చేయదు. ఐఫోన్ 5 సిరీస్ నుంచే వాట్సాప్ పని చేస్తుంది. కాయ్ ఓఎస్లో 2.5.1 తర్వాతి వెర్షన్కే వాట్సాప్ పని చేస్తుందట.
6. డైమన్సిటీ 1200తో రియల్మీ
రియల్మీ నుంచి మరో కొత్త ఫోన్ ఈనెల విడుదల కాబోతోంది. ఈ నెల 31న రియల్మీ జీటీ నియోను లాంచ్ చేయనున్నారు. ఇందులో మీడియాటెక్ కొత్త ప్రాసెసర్ డైమన్సిటీ 1200 ఉండబోతోందట. ఇది 6 నానో మీటర్ సాంకేతికతతో పని చేస్తుంది. ఈ మొబైల్లో 6.55 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే ఉండబోతోంది. 4,400 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ ఇస్తారు. 120 హెర్జ్ ఆమోలెడ్ డిస్ప్లే ఉండబోతోంది. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండబోతోంది.
7. వన్ప్లస్ నుంచి మరో 5జీ
అఫర్డబుల్ ఫ్లాగ్షిప్ రేంజిలో వన్ప్లస్ కొత్త 5జీ ఫోన్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందనే విషయం తెలిసిందే. వన్ప్లస్ 9ఆర్ పేరుతో తీసుకురాబోతున్నారు. ఈ నెల 23న వన్ప్లస్ 9 సిరీస్లో రెండు ఫోన్లు వస్తాయని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వచ్చేవి రెండు కాదు, మూడు అని తెలుస్తోంది. వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రో, వన్ప్లస్ 9ఆర్గా మూడు ఫోన్లు వస్తాయట. ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు బయటకు రాకపోయినా నార్డ్ కంటే కాస్త ఎక్కువ ధరలు ఉండొచ్చని వార్తలొస్తున్నాయి.
8. ఐఫోన్ మినీకి పోటీగా ఆసుస్
పెద్ద పెద్ద స్క్రీన్లతో ఫోన్లు వస్తున్న తరుణంలో.. చిన్న స్క్రీన్తో వచ్చి వావ్ అనిపించింది ‘ఐఫోన్ 12 మినీ’. ఐదు అంగుళాల లోపల సైజ్ స్క్రీన్తో వచ్చిన ఆ మొబైల్కు మంచి స్పందనే వచ్చింది. దీంతో శాంసంగ్, సోనీ కూడా ఆ తరహా మోడల్స్ తీసుకొచ్చాయి. శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్ 10ఈ వస్తే, ఎక్స్పీరియాలో సోనీ ఓ మొబైల్ తెచ్చింది. ఇప్పుడు ఇదే వరుసలో ఆసుస్ కూడా ఓ ఫోన్తో వస్తోంది. ఫ్లాగ్షిప్ లెవల్లో ఈ మినీ జెన్ఫోన్ ఉండబోతోందట. ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉండబోతోందని సమాచారం. ఇందులో 5.92 ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుందట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
9. రెడ్మీ కె40 వచ్చేస్తోంది
రెడ్మీ నుంచి ఓ కొత్త మొబైల్ మన మార్కెట్లోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన మరింత సమాచారం బయటికొచ్చింది. చైనా మార్కెట్లో విడుదలైన రెడ్మీ కె 40ని అదే పేరుతో కాకుండా ఎంఐ 111 ఎక్స్ పేరుతో తీసుకొస్తారని సమాచారం. అదే రెడ్మీ కె40 ప్రోను అయితే ఎంఐ 11ఐ పేరుతో తీసుకొస్తారట. భారత ఐఎంఈఐ డేటా బేస్లో ఈ మొబైల్స్ వివరాలు పొందుపరిచారట. రెడ్మీ కె 40 కీలక స్పెసిఫికేషన్లు చూస్తే... ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది. 6.67 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చు. ధర సుమారు ₹23,000 ఉండొచ్చని సమాచారం.
10. లావా నుంచి మూడు ట్యాబ్లు
ఆన్లైన్ క్లాస్ల జోరు ఇంకా కొనసాగుతున్న వేళ లావా కొత్తగా మూడు ట్యాబ్లను లాంచ్ చేసింది. ₹10 వేల నుంచి మొదలై ₹16 వేల వరకు ఈ ట్యాబ్లు లభిస్తాయి. ఇందులో హై ఎండ్ వెర్షన్ అయిన మాగ్నమ్ ఎక్స్ఎల్లో 10.1 అంగుళాల స్క్రీన్, 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఓరాలో 8 అంగుళాల డిస్ప్లే, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఐవరీలో 7 అంగుళాల తాకేతెర ఇస్తున్నారు. మాగ్నమ్ ఎక్స్ఎల్ ధర ₹15,499, ఓరా ధర ₹12,999, ఐవరీ ధర ₹9,499.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Instagram: మరో రెండు సర్వీసులు మూసేస్తున్న ఇన్స్టాగ్రామ్.. ఎందుకంటే?
ఇన్స్టాగ్రామ్ వీడియో అప్లికేషన్లు బూమేరాంగ్, హైపర్ లాప్స్లను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. -
Twitter: రష్యా నిషేధం.. ట్విటర్ ‘ఉల్లిపాయ’ ఉపాయం
ట్విటర్ వినియోగదారులు కొత్తగా టార్ ఆనియన్ (Tor Onion) సేవలను ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. -
Samsung Galaxy F23: శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలివే!
గెలాక్సీ ఎఫ్23 స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో శాంసంగ్ విడుదల చేసింది. ఈ 5జీ స్మార్ట్ఫోన్లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ధరెంత? -
Metaverse phone:హెచ్టీసీ నుంచి ‘మెటావర్స్ ఫోన్’.. విడుదల ఎప్పుడంటే?
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ హెచ్టీసీ ఏప్రిల్ నెలలో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. వీటిలో అధునాతన మెటావర్స్ ఫీచర్స్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
Instagram: ఐజీటీవీ యాప్ మూసేస్తున్న ఇన్స్టాగ్రామ్... ఎందుకంటే?
ఇన్స్టాగ్రామ్ తన సొంత వీడియో అప్లికేషన్ ఐజీటీవీ (IGTV)యాప్ను మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. -
Power Bank: ఈ పవర్ బ్యాంక్తో 5వేల ఫోన్లు ఛార్జ్ చేయొచ్చు!
ప్రయాణాల సమయంలో మనకు ఎదురయ్యే సమస్యల్లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఒకటి. అన్ని చోట్ల ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉండకపోవచ్చు. అందుకే, పవర్ బ్యాంక్ను కొనుగోలు చేస్తుంటాం. వాటిలో 10వేల ఎంఏహెచ్ నుంచి దాదాపు లక్ష.. 2లక్షల ఎంఏహెచ్ వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే, -
Face ID with Mask: మాస్క్ ఉన్నా ఫేస్ఐడీ అన్లాక్.. ఈ కంపెనీ తొలి ప్రయత్నం!
కొవిడ్ మహమ్మారి వస్తూ వస్తూనే చాలా కష్టాలు మోసుకొచ్చింది. ఆరోగ్యపరంగానే కాదు.. సాంకేతికంగానూ కొత్త కష్టాలను తెచ్చింది. అలాంటి వాటిలో ఒకటే స్మార్ట్ఫోన్లలో ఫేస్ ఐడీ ఫీచర్ పనిచేయకపోవడం. -
Youtube: సొంతంగా వీడియోలు రూపొందించడంమానేస్తున్న యూట్యూబ్!
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వినియోగం భారీగా పెరిగింది. దీంతో ఓటీటీ సంస్థలన్నీ సొంతంగా సినిమాలు, వెబ్సిరీస్లు నిర్మిస్తున్నాయి. అయితే, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ మాత్రం షోలు, సినిమాల నిర్మాణం నుంచి తప్పుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇకపై ‘యూట్యూబ్ ఒరిజినల్స్’ ద్వారా -
Starlink: డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్న మస్క్ కంపెనీ
భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవల కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్న యూజర్స్కు కంపెనీ డబ్బును తిరిగి చెల్లించనుంది. ఈ మేరకు మెయిల్ ద్వారా యూజర్స్కు సమాచారం అందించింది. -
చెక్క ఉపగ్రహం
చెక్కతో ఉపగ్రహం! వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. జపాన్లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటొమో ఫారెస్ట్రీ కంపెనీ బృందం ఇలాంటి పనినే చేపట్టింది. దీని వెలుపలి భాగం పూర్తిగా చెక్కతోనే తయారుచేస్తారు మరి. అంతరిక్షంలో -
Google Chrome: క్రోమ్ బ్రౌజర్లో ఫొటో రీసైజింగ్.. ఎలా చేయొచ్చంటే?
ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఫొటో సైజ్ను ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించకుండా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఫొటో సైజ్లో మార్పులు చేయొచ్చు. అదెలానో తెలుసుకుందాం. -
Web Browsers: బ్రౌజర్లో పాస్వర్డ్లు సేవ్ చేస్తున్నారా?సైబర్ నిపుణులేమంటున్నారు?
ఆన్లైన్ ఖాతాలకు సంబంధించిన లాగిన్ వివరాలను చాలా మంది యూజర్స్ బ్రౌజర్లలో సేవ్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలేంటో చూద్దాం. -
Scam calls: ఆ కాల్స్ను నమ్మితే స్కామే... మరేం చేయాలంటే!
స్కామ్ కాల్స్కు జవాబిచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అసలు స్కామ్ కాల్స్ను ఎలా గుర్తించాలి -
Youtube: యూట్యూబ్ వీడియోలో నచ్చిన భాగాన్నే షేర్ చేయాలంటే?
యూట్యూబ్లో మనం చూసే వీడియోల్లో నచ్చిన భాగాన్ని ఇతరులో ఎలా షేర్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకు రెండు పద్ధతులున్నాయి. -
Windows 11: కొత్త విండోస్లో రంగులు మార్చే బగ్.. మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందంటే?
విండోస్ 11 ఓఎస్లో మరో కొత్త బగ్ను గుర్తించారు. దీని వల్ల వీడియో, ఫొటో ఎడిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఈ బగ్ను త్వరలో సరిచేస్తామని తెలిపింది. -
Amazon: అమెజాన్ ఖాతా లాకైందంటూ నకిలీ మెయిల్.. యూజర్స్కు అలర్ట్!
అమెజాన్ ఖాతాదారులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ-మెయిల్ ద్వారా జరిగే ఈ తరహా మోసాల పట్ల యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
పైథాగరస్కు వెయ్యేళ్ల ముందే
లంబకోణ త్రిభుజంలో కర్ణం వైపు వర్గం మిగిలిన రెండు వైపుల వర్గాల మొత్తానికి సమానం (a2 + b2 = c2). ఇది పైథాగరస్ సూత్రం. దీని గురించి బడిలో చదువుకునే ఉంటారు. -
e-KYC Frauds: ఈ-కేవైసీ మోసాలు.. యూజర్స్కు మొబైల్ నెట్వర్క్లసూచనలు!
ఈ-కేవైసీ, నకిలీ ఎస్సెమ్మెస్ల ద్వారా జరిగే మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో నెట్వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు వినియోగదారులకు కొన్ని సూచనలు చేశాయి. -
Gmail: జీమెయిల్ నుంచి వాయిస్ మెసేజ్.. ఇదిగో ఇలా పంపొచ్చు
జీమెయిల్ ఎక్కువ మంది సమాచార మార్పిడికి ఉపయోగించే ఈ - మెయిల్ సర్వీస్. అయితే జీమెయిల్ నుంచి మెయిల్ మాత్రమే కాదు, వాయిస్ మెసేజ్లు పంపొచ్చు. మరి అదెలానో తెలుసుకుందాం. -
Web 3: మస్క్ ట్వీట్కు డోర్సే రిప్లయ్.. మళ్లీ చర్చకు వెబ్3 !
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్కు ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే రిప్లై ఇచ్చారు. అదికాస్తా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. త్వరలోనే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుందనే సంకేతాలనిచ్చింది. -
Android Smartphones: ఆండ్రాయిడ్ యూజర్స్.. వెంటనే ఈ యాప్ను తొలగించండి!
ప్లేస్టోర్ నుంచి గూగుల్ మరో యాప్ను తొలగించింది. యూజర్స్ కూడా వెంటనే ఈ యాప్ను డిలీట్ చేయమని సూచించింది. ఈ యాప్లో జోకర్ మాల్వేర్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!