వాట్సాప్ మెసేజ్ డిలీట్.. మీరు కోరినప్పుడు!
ప్రముఖ చాటింగ్ వాట్సాప్ రోజు రోజుకూ సరికొత్త అప్డేషన్స్తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగ దారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే అనుమతిలేకుండా ఇతరులు మీ వాట్సాప్ అకౌంట్లో లాగిన్ అవ్వకుండా ఫింగర్ ప్రింట్ ఆప్షన్ను అందుబుటులోకి తెచ్చిన వాట్సాప్.. మరిన్ని ఫీచర్ల కోసం కసరత్తు...
ఇంటర్నెట్డెస్క్: వాట్సాప్ రోజు రోజుకూ సరికొత్త ఫీచర్అప్డేట్స్తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగదారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే అనుమతిలేకుండా ఇతరులు మీ వాట్సాప్లో లాగిన్ అవ్వకుండా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఆప్షన్ను అందుబుటులోకి తెచ్చిన వాట్సాప్.. మరిన్ని ఫీచర్లపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వాట్సాప్లో పంపిన వీడియోలను, టెక్స్మెసేజ్లు, ఇమేజ్లు, ఫైల్స్, ఎమోజీలను నిర్ణీత సమయంలో అవతలి వాళ్ల ఫోన్ నుంచి డిలీట్ చేసే అవకాశం ఇప్పటికే ఉంది. ఆ సమయం తర్వాత డిలీట్ చేయడం కుదరదు. దీనిని అధిగమించడానికి మరో ఫీచర్ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అవతలి వాళ్ల వాట్సాప్కు మనం పంపిన సమాచారం ఎప్పుడు డిలీట్ చెయ్యాలా? అనేది ఎంచుకునేలా సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫీచర్ను అందుబాటులోకి తేనుంది.
ఉదాహరణకు మీరు పంపిన డేటా అవతలి వ్యక్తి ఫోన్లో 10 నిమిషాల తర్వాత డిలీట్ అవ్వాలంటే సెండ్ బటన్ పక్కనున్న టైమర్లో ఆ సమయం సెలెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ సమయం తర్వాత మెసేజ్ అవతలి ఫోన్ నుంచి డిస్అపియర్ అవుతుంది. ఇప్పటికే ఈ తరహా ఆప్షన్ ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ మెసెంజర్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా చాట్ నుంచి బయటకు వస్తే ఆటోమేటిగ్గా మీరు పంపిన డేటా అంతా డిలీట్ అయ్యేలా కూడా వాట్సాప్ ఈ ఫీచర్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఇది ఇన్కాగ్నిటో బ్రౌజర్ తరహాలో ఉంటుంది. తొలుత ఈ ఫీచర్లను బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చి ఆ తర్వాత స్టేబుల్యాప్లో అప్డేట్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు