6 రోజుల్లో.. రూ.84లక్షలు!
యాపిల్ ఎట్టకేలకు ఐఓస్14తో హోంస్ర్కీన్ కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో కస్టమ్ ఐకాన్ ప్యాక్లను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ రూపురేఖలు మార్చుకోవచ్చు. ఇప్పటికే ఐఫోన్ వినియోగదారులు హోం స్ర్కీన్ను రకరకాలుగా మార్చి స్ర్కీన్షాట్లను సోషల్మీడియాలో పెడుతున్నారు.
ఐకాన్ సెట్తో భారీగా సంపాదించిన డిజైనర్
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ ఎట్టకేలకు ఐఓస్ 14తో హోంస్ర్కీన్ కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో కస్టమ్ ఐకాన్ ప్యాక్లను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ రూపురేఖలు మార్చుకోవచ్చు. ఇప్పటికే ఐఫోన్ వినియోగదారులు హోం స్ర్కీన్ను రకరకాలుగా మార్చి స్ర్కీన్షాట్లను సోషల్మీడియాలో పెడుతున్నారు. ఈ ట్రెండ్ కస్టమ్ యాప్ ఐకాన్స్ తయారు చేసే ఓ డిజైనర్కు కాసులు కురిపించింది. ఆయన ఆరు రోజుల్లో 1,15,000 డాలర్లు(సుమారు రూ.84లక్షలు) సంపాదించాడు.
శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ట్రాఫ్ అనే డిజైనర్ కస్టమ్ యాప్ ఐకాన్ ప్యాక్స్ తయారు చేస్తుంటాడు. పలువురు వినియోగదారులు ఐఓస్14తో హోం స్ర్కీన్లను నూతనంగా మార్చి స్క్రీన్షాట్లను సామాజిక మాధ్యమాల్లో పెడుతుండటంతో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. దీంతో ట్రాఫ్ కొన్ని యాప్ ఐకాన్లు, విడ్జెట్లు తయారు చేసి హోంస్ర్కీన్ను తన బ్లాగ్తో పాటు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆయన ఐకాన్ ప్యాక్ను తెగ ఇష్టపడ్డారు. వాటిని తమకు షేర్ చేయాలని అడగడం మొదలుపెట్టారు. దీంతో డిమాండ్ను గుర్తించిన ట్రాఫ్ వాటిని కొన్ని ఆన్లైన్ విక్రయ సైట్లలో అందుబాటులో ఉంచారు. 120 ఐకాన్స్తో కూడిన ప్యాక్ను 28డాలర్లకు అమ్మడం మొదలుపెట్టాడు. రెండు రోజుల్లోనే విపరీతమైన లైక్లతో పాటు 6,000 డాలర్లు సంపాదించాడు. ఆ తరువాత రోజు 40వేల డాలర్లు వచ్చాయి. ప్రఖ్యాత టెక్ యూట్యూబర్ మార్కస్ బ్రౌన్లీ తన యూట్యూబ్ వీడియోలో ఈ ఐకాన్ప్యాక్ గురించి చెప్పడం ట్రాఫ్కి కలిసొచ్చింది.
మెత్తానికి సుమారు 4,188 మంది వినియోగదారులకు తన ఐకాన్ప్యాక్ను విక్రయించినట్లు ట్రాఫ్ తన బ్లాగ్లో రాశారు. సరైన విషయాన్ని సరైన సమయంలో పోస్టుచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇది ఒక్కరోజులో వచ్చిన విజయం కాదని 2013లోనే ఒక ఐకాన్ సెట్ తయారు చేసి 17డాలర్లు సంపాదించినట్లు చెప్పారు. ఇంటర్నెట్ ద్వారా మొదటిసారి 17 డాలర్లు సంపాదించడం ఆనందాన్నిచ్చిందని వివరించారు. సరైన విధంగా కంటెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిసి ఇలా చేసినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!