- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
6G Network: 6జీ సాంకేతికతతో మొబైల్ఫోన్లు ఉనికిని కోల్పోతాయా?
ఇంటర్నెట్డెస్క్: మొబైల్ నెట్వర్క్ ప్రపంచంలో 5జీ సాంకేతికతను ఒక విప్లవంగా చెబుతుంటారు. భారత్లో ఈ నెట్వర్క్ సేవలు పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాకముందే.. 6జీ సాంకేతికతపై చర్చ మొదలైంది. 5జీ కన్నా 50 రెట్లు వేగంతో 6జీ నెట్వర్క్ ఉంటుందని టెక్ వర్గాలు తెలిపాయి. గత నెలలో జరిగిన ట్రాయ్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్వర్క్ను భారత్లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో పలు టెలికాం నెట్వర్క్ కంపెనీలు 6జీ నెట్వర్క్కు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో నోకియా కంపెనీ సీఈవో పెక్కా లుండ్బర్గ్ 6జీ నెట్వర్క్పై డబ్ల్యూఈఎఫ్ (వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్)2022లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
6జీ సాంకేతికత మొబైల్పోన్లను యూజర్లకు అవసరంలేని వస్తువుగా మార్చేస్తుందని అన్నారు. అంతేకాకుండా 6జీ సేవలను ఉపయోగించుకునేందుకు ప్రత్యేకమైన ఇంటర్ఫేస్ అవసరంలేదని.. వాస్తవికత-డిజిటల్ సమ్మిళితంగా ఉండే ఈ సాంకేతికతలో మానవులే ఇంటర్ఫేస్గా పనిచేస్తారని తెలిపారు. అంటే ఇయర్బడ్స్, స్మార్ట్వాచ్, గ్లాసెస్ వంటి డివైజ్లు మానవులు ధరించే దుస్తుల్లో లేదా చర్మానికి అతుక్కుని ఉండే బయో-ఇంప్లాట్ల రూపంలో అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. అలానే స్మార్ట్ డివైజ్లలోని సెన్సర్లు, మైక్రోఫోన్లు, కెమెరాల ద్వారా మనిషి భావోద్వేగాలను గుర్తించి తదనుగుణంగా అవి పనిచేస్తాయట.
ఈ ప్రక్రియలో ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ ముందంజలో ఉంది. మనిషి బ్రెయిన్ను, మెషీన్ను అనుసంధానించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా ఏఐ సాంకేతికతతో పనిచేసే కార్లు ఒకదానితో ఒకటి అనుసంధానమవడం, రహదారి పరిస్థితులకు అనుగుణంగా కార్లు స్వయంచాలిత నియంత్రణ వంటివి చూడొచ్చు. కార్యాలయాల్లో ఉద్యోగులు వేరే ప్రదేశంలో ఉండి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా బోర్డ్ రూమ్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. మొత్తంగా 6జీ సాంకేతికత వాస్తవికతలో భ్రమింపజేసే డిజిటల్ ప్రపంచాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
భారత్లో మరి కొన్ని నెలల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ మార్కెట్గా ఉంది. ఈ నేపథ్యంలో భారత్లో మొబైల్ఫోన్ అవసరంలేని వస్తువుగా మారేందుకు మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. రాగల రెండు రోజులు భారీ వర్షాలు!
-
Movies News
Liger: అన్ని కోట్ల ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసిన దమ్ము ఎవరిది?.. లైగర్ టీమ్తో ఛార్మి ఇంటర్వ్యూ
-
Sports News
Shoaib Akhtar: అప్పుడు రాహుల్కు ఆగ్రహం వచ్చింది.. నాకు ఆశ్చర్యమేసింది: అక్తర్
-
India News
Video: షాకింగ్.. ముంబయిలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
-
India News
US Visa: అమెరికా వీసా కష్టాలు.. అపాయింట్మెంట్కు 510 రోజులు నిరీక్షించాల్సిందే!
-
India News
Rajnath Singh: తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయా.. రాజ్నాథ్ సింగ్ భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్గా పంపించాలనే ఐడియా ఎవరిది..?