బ్యాక్టీరియా నుంచీ కార్బన్‌డయాక్సైడ్‌

భూ తాపానికి, వాతావరణ మార్పులకు ముఖ్య కారణం పర్యావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ నానాటికీ పెరిగిపోవటం. ఇందుకు సముద్రం లోతుల్లో ఉండే ఒక బ్యాక్టీరియా కూడా కారణమని యూనివర్సిటీ ఆఫ్‌

Published : 02 Jun 2021 00:50 IST

భూ తాపానికి, వాతావరణ మార్పులకు ముఖ్య కారణం పర్యావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ నానాటికీ పెరిగిపోవటం. ఇందుకు సముద్రం లోతుల్లో ఉండే ఒక బ్యాక్టీరియా కూడా కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటా పరిశోధన పేర్కొంటోంది. ఈ బ్యాక్టీరియా సముద్రంలో కర్బనంతో కూడిన రాళ్లను కరిగిస్తోందని బయటపడింది మరి. గంధకాన్ని శక్తి వనరుగా వినియోగించుకునే ఈ సూక్ష్మజీవులు సముద్రం అడుగున మీథేన్‌ వాయువును వెలువరించే రాళ్ల మీద నివసిస్తుంటాయి. గంధకాన్ని వినియోగించుకునే క్రమంలో సూక్ష్మజీవులు ఆమ్ల చర్యను సృష్టిస్తున్నట్టు, ఇది రాళ్లు కరగటానికి దోహదం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీని మూలంగానే రాళ్లలోని కర్బనం సముద్రంలోకి చేరుతోంది. సముద్రంలోకి కర్బనం విడుదలైతే అక్కడితోనే ఆగిపోదు. అది పర్యావరణంలోకీ చేరుతుంది. ఎందుకంటే సముద్రం, పర్యావరణం నిరంతరం వాయువులను బదిలీ చేసుకుంటుంటాయి. మన గ్రహం మీద మూలకాల చట్రంలో సూక్ష్మజీవుల పాత్రను మరింత బాగా అర్థం చేసుకోవటానికి,  ప్రపంచ వ్యాప్తంగా కార్బన్‌డయాక్సైడ్‌ పరిమాణాన్ని తెలుసుకోటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని